Tuesday 31 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 248 (నన్నయ భారతము : ఆదిపర్వము: షష్ఠాశ్వాసము)

వీరు నమ్మంగ దగుదురు వీరు నమ్మ
దగరు నాకు నా వలవదు, తత్త్వబుద్ధి 
నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు 
నాత్మరక్షాపరుం డగు నది విభుండు.

ఇమ్ముగ నాత్మరక్ష విధియించు విధంబున మంత్రరక్ష
త్నమ్మున జేయగావలయు, దత్పరిరక్షణశక్తి నెల్ల కా
ర్యమ్ములు సిద్ధి బొందు బరమార్థము, మంత్రవిభేద మైన గా
ర్యమ్ములు నిర్వహింపగ బృహస్పతికైనను నేరబోలునే.

తన కపకారము మును జే
సిన జను డల్పు డని నమ్మి చేకొని యుండం
జన దొకొయించుక ముల్లయి
నను బాదతలమున నున్న నడవగ  నగునే

తడయక సామభేదముల దానములన్ దయతోడ నమ్మగా
నొడివియు సత్యమిచ్చియు జనున్ జననాథ! కృతాపకారులం
గడగి వధింపగా  గనుట  కావ్యు మతం బిది గాన యెట్టులేం
గడుకొని శత్రులం జెరుపగాంచుట కార్యము రాజనీతిమైన్.

శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, షష్ఠాశ్వాసంలో కణిక నీతులని ఉన్నాయికణికుడు శకునికి మంత్రిధృతరాష్ట్రుడు యుధిష్ఠురునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయడంతో, మాత్సర్యం వహించిన దుర్యోధనుడు, కణికుడితో మంతనాలు సాగించాడు. సందర్భంలో, శత్రువు మీద పై చేయి సాధించటానికి ఏమేమి చేయాలొ చెప్పినవే కణిక నీతులని ప్రసిద్ధి నొందాయి.

" రాజుకి వీడు నమ్మదగినవాడు, వీడు నమ్మదగినవాడు కాదు అనే భేదము ఉండకూడదుఅసలు, ఎవరినీ నమ్మకుండా, తనను తాను రక్షించుకోవాలి.

అదేవిధంగా, రాజు తన అంతరంగంలో ఉన్న ఆలోచనలను కూడా రక్షించుకోవాలిఅవి బయటపడకుండా  ఉంచుకొనడంలోనే, అతని బల  మంతా ఉంది. అప్పుడే, అతని పనులు ఫలప్రదమౌతాయిఅవి బయటపడ్డాయంటే, ఇక వాటిని ఫలవంతం చేయడం బృహస్పతికైనా సాధ్యం కాదు.  (బుద్ధిలో బృహస్పతిని మించిన వారు లేరు కదా!)

కాలులో గుచ్చుకున్న ముల్లు చిన్నదే అయినా, వెంటనే తీసివేయాలి. లేకపోతే నడవలేముఅట్లాగే, తనకు అపకారం చేసినవాడు అల్పుడయినా, అతడిని ఉపేక్ష చేయకూడదు.

తనకు అపకారం చేసిన వారిని, ముందు సామ, దాన, భేదోపాయాలతో లొంగదీసుకోవాలిఅది కూడా పని చేయకపోతే, దయ చూపించి, నమ్మకం కల్పించి, ఒట్టు వేయించుకోవాలి విధంగా మెల్లగా నమ్మకం కలిగించి, గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టాలి. ఇది శుక్రాచార్యుడు చెప్పిన రాజనీతికాబట్టి, విధంగా నైనా శత్రువుని  మట్టుపెట్టకండా ఉండకూడదు. "


శుక్రాచార్యుడు భృగువు (కవి) కుమారుడు కనుక కావ్యుడని ప్రసిద్ధి వహించాడు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like