Thursday 26 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 233 (తిక్కన భారతము: ద్రోణపర్వం: ప్రథమాశ్వాసం)

వేదములుం తదంగములు వింతలుగా నొక కొన్ని నేర్తు ధై
ర్యాది గుణంబు లెందు గల వైనను నింతటి వాని గాగ
త్యాదర వృత్తి మీరు విజయాశ ననుం గొనియాట జేసి యౌ
గాదన కియ్యకొంటి దగ గౌరవనాథుని కోర్కి దీర్పగన్.

ద్రోణాచార్యుడికి సర్వసైన్యాధ్యక్ష పదవి కట్టబెట్టింది కౌరవపక్షం. దానికి తన స్పందనను తెలియజేస్తున్నాడు ఆచార్యుడు.

" వేదాలు, వేదాంగాలు కొన్ని నేను కొంతవరకు నేర్చుకొన్నాను. ఇక మీరందరూ నా ధైర్యసాహసాలను మెచ్చుకొంటున్నారు చెప్పిన ధైర్యసాహసాలు నాకెక్కడివి? అయినా మీరందరూ విజయం మీద ఆశతో నన్నింత వానిగా ప్రశంసిస్తున్నారు కాబట్టి, దుర్యోధనుడి మాట కాదనలేక యీ సర్వసైన్యాధిపత్యానికి ఒప్పుకుంటున్నాను. "

ద్రోణాచార్యుని మాటలు చాలా జాగ్రత్తగా, తూచినట్లు మాట్లాడినవి.

ఆయన వేద, వేదాంగాలు క్షుణ్ణంగా నేర్చుకున్నవాడేకానీ, కొంతవరకే నేర్చుకొన్నానంటున్నాడు.  " అదికూడా వింతలుగా, ఆశ్చర్యకరంగా, నేర్చుకొన్నాడటఅంటే పరశురాముని వంటి వాని వద్ద నుండి గురుకృపతో ప్రాప్తించినాయని అర్థం చేసుకొనవచ్చు, ఇంకొక విధంగా, వేదాలు ప్రతిపాదించిన ధర్మ స్థితి ఇప్పుడు తప్పిందని అర్థం కూడా కావచ్చు. ధైర్యాది గుణంబు లెందు గలవు " అంటున్నాడుఇవి రెండువైపుల పదునైన కత్తివంటి మాటలుఇవి ఒకవైపున ద్రోణుని వినయసంపదను సూచిస్తూ, ఇంకొక వైపు అతని ముందు చూపును కూడా తెలియజేస్తున్నాయిగతంలో, సుయోధనుడు తనను పలుమార్లు అధిక్షేపించిన సంగతి అతని స్మృతిపథంలో ఉంది. ఇక కురురాజు యొక్క ఉప్పు తింటున్నాడు కనక, సేవాధర్మంతో, తన శక్తి మేరకు యుద్ధం చేయవలసిందేవీళ్ళందరూ తనను ఇంతటివానిగా ఎందుకు పొగుడుతున్నారువిజయాశతోవిజయం మీద ఆశతో, విజయుడిని గెలుస్తాననే ఆశతో. అందువల్ల, ఔను, కాదు అనలేక, సుయోధనుని ముద్దు చెల్లించటానికి ఒప్పుకుంటున్నాడుకానీ, యదార్థం అతనికి తెలుసుకురురాజు ఆశలు అడియాశలవుతాయనివేదాలు, వేదాంగాలు నేర్చుకొన్నవాడికి తెలియదా ధర్మమే గెలుస్తుందని

మానవస్వభావం లోతులు తెలిసిన మహాకవులే విధంగా వ్రాయగలరుతిక్కన అందులో సిద్ధహస్తుడు.

వేదాలు నాలుగు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదంవేదాంగాలు ఆరుశిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం


ఇంతటి భావయుక్తమైన పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, ద్రోణపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like