Friday 13 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 174 (శ్రీమదాంధ్ర మహాభాగవతము: పంచమాశ్వాసము)

భారతవర్ష జంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు? నీ
భారతవర్షమందు హరి పల్మఱు బుట్టుచు జీవకోటికిన్ 
ధీరతతోడ దత్త్వ ముపదేశము చేయుచు జెల్మి జేయుచు
న్నారయ బాంధవాకృతి గృతార్థుల జేయుచునుండు నెంతయున్.

శ్రీమదాంధ్రమహాభాగవతము పంచమస్కంధము నందలి యీ పద్యం భారతదేశము యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుందిభారతదేశము అంటే భరతఖండము.  

భరతవర్షంలో పుట్టడం జీవులు చేసుకున్న అదృష్టం. ఎందుకని గడ్డ మీదే శ్రీమన్నారాయణుడు అనేకమార్లు అవతరించాడు. అవతరించడం ఎన్నో రూపాల్లో అవతరించాడు. అవతరించిన ప్రతిసారీతత్త్వాన్ని ఉపదేశం చేశాడుతత్త్వం అంటే, "  ఏదైతే యదార్థంగా ఉన్నదో " అది.  " ఏదైతే శాశ్వతమో " అది.  " తత్ - త్వం - అసి (తత్వమసి) - "  అది నీవే అయి ఉన్నావు " అనే మహావాక్యానికి, సనాతన ధర్మానికి మూలబీజం.   " అది నువ్వే " అనే ఆత్మజ్ఞానం.  

పోతనగారు ' జంతువుల ' అనే పదం ఉద్దేశ్యపూర్వకంగా వాడారుఆహార నిద్రా భయ మైథునాదులు జంతులక్షణాలు. బుద్ధిజీవియైన మానవుడు, లక్షణాలను అంతరింపజేసి ఆత్మజ్ఞానంతో తరించాలి. మూలతత్త్వమే భాగవతమంతా పరచుకొని ఉంది.


అభవుడైన, అంటే, పుట్టుకలేని పరమాత్మ,   పుట్టినవారితో స్నేహం చేశాడుచుట్టరికం నెరిపాడు. విధంగా యీ భూమి మీద పుట్టిన జీవులందరినీ కృతార్థులను చేశాడుపుట్టుక లేని భగవంతుడు పుట్టడం అంటే, కర్మానుభవం పొందడం, కర్మసిద్ధిని పొందడం..  అయితే, పుట్టడం మన పుట్టుక వంటిది కాదుదానిని అవతరించడం అంటారు. అవతారము అంటే దిగిరావడం.     సంసారమంటే జారిపోవడంఆత్మజ్ఞానం నుంచి జారిపోయే బుద్ధిజీవులను, వారి బుద్ధిని ఆత్మజ్ఞానం వైపుక్కి మరలించడమే, తత్త్వ ముపదేశించి, కేతార్థులను చేయడం. ఇది భరతబూమిలోనే సాధ్యంఅవతారమెత్తిన ప్రతిసారీ, శ్రీమహావిష్ణువువిశ్వకళ్యాణం కోసం, ఒక కార్యసిద్ధి నొనరిస్తూ, ఒక తత్త్వోపదేశం చేస్తూ, ఒక కృతార్థతను కలిగిస్తున్నాడు.   అందువల్లనే, యీ భూమి కర్మభూమి, తత్త్వభూమి, మోక్షభూమి అని పేరు పొందిందిఇదే భావం, పోతనగారి యీ పద్యంలో తెలుస్తుంది.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like