Sunday 29 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 239 (శ్రీమదాంధ్ర మహాభారతము: అశ్వమేధపర్వం: ప్రథమాశ్వాసం)

పనివడి పూచి పట్టమి సుబంధురధైర్యము నిర్వహింతు నే
నను మతి సొన్పకండుట సమగ్రతపంబున తత్ఫలేచ్ఛ లే
కునికి విమోక్షతృష్ణభర మొందమి కాము నడంచు గాన ని
య్యనువులు లేమి సువ్వె యనపాయతగా నత డాడె భూవరా!

శ్రీకృష్ణుడు ధర్మరాజుకి తత్త్వాన్ని బోధిస్తున్నాడు. రెండక్షరాలు మృత్యువని, మూడక్షరాలు బ్రహ్మమని చెప్పాడు. మమ (నాది) అనే రెండక్షరాలు మృత్యువు, బంధకారణము మమ (నాది కాదు) అనే మూడక్షరాలు మోక్షకారణమని కృష్ణుడు చెప్పాడు. ఇది గీతా సారాంశమే తరువాత, శ్రీకృష్ణుడు కామగీతలు వివరించాడుకామగీతలు అంటే కామునిచే బోధింపబడినవి.

" ధర్మరాజానేను చెప్పేది విను. పట్టుబట్టి ఒక పనిని చేపట్టకపోవటం, పని తప్పకుండా చేయగలను అనే స్థిరబుద్ధి లేకపోవటం, గొప్ప తపస్సు చేస్తున్నప్పుడు కూడా తపఃఫలంలో కోరిక లేకుండా ఉండటం, చివరికి మోక్షం మీద కూడా కోరిక లేకుండా ఉండటం, కాముడిని జయిస్తాయికానీ అవి చెప్పినంత తేలిక కావుకోరికలను జయించటం చాలా కష్టంఅందుకే నన్నెవరూ వదలిపెట్టలేరని కాముడు చెప్పాడు "

సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధపర్వం, ప్రథమాశ్వాసానికి డాక్టర్ హెచ్.ఎస్. బ్రహ్మానందగారి విశేష్య వ్యాఖ్య పొందుపరుస్తున్నాను.

" అశ్వమేధపర్వం లోని అతి ముఖ్యమైన పద్య మిదికాముడు మానవుడిని ఎందుకు వెన్నాడుతాడో, అతడిని ఎట్లా జయించవచ్చునో చెప్పే ఉపాయం పద్యంలో ఉన్నది

మొదటిది - పనిని చేయటం అంటే పూనుకొని చేయాలి. పనిని ప్రారంభించటం జరిగితే అది విఫలమయ్యే ప్రశ్న ఉండదుఅంతే కాదు, ఉద్యమంచి పని చేయాలిఉత్సాహంతో చేయాలి. దీనినే 'శ్రద్ధ ' అంటారు. శ్రద్ధాళువు పనిని నిరాటంకంగా చేయగల్గుతాడు.   శ్రద్ధ ఉన్నా ' పూనిక ' మొండి పట్టుదల కాకుండా ఉండాలి.

రెండవది - పనిని తప్పక పూర్తిచేస్తానన్న ' స్థిరబుద్ధి ' ఉండాలి. మధ్యలో వదిలివేయటం, చేతకాదేమో అనటం, చేస్తానని చేయకపోవటంఇతరులకు ఒప్పచెప్పటం, ఇట్లాంటి పనులు ' సోమరి ' లక్షణాలుపని పూర్తి అయ్యేదాకా స్థిరబుద్ధి నశించకూడదుదీనినే ' ఓర్పు ' అంటారు.  'ఓర్పు ' ఉన్నా ' నా పనే గెలవా ' లన్న మూర్ఖత్వం ఉండరాదు.

మూడవది- మనం చేస్తున్న పనిని తాత్పర్యంతో చేయటం నిర్దిష్టలక్ష్యం కార్యసాధనకోసమే తప్ప, కోరికను నింపుకొనటం కొరకు కాకూడదుదానిని విషయంలో కూడా ఫలాపేక్ష లేకండా ఉండటం అని ఇక్కడ చెప్పుతున్నారు.

నాలుగవది - మోక్షవిషయంలో కూడా కోరిక ఉండకూడదనటం అంటే మోక్షం పొందాలన్నది ఒక ' దాహ ' మటదాహమయిన మనిషి నీటికొరకు వెదకి తీరుతాడుమోక్షం దానంతట అది రావాలి తప్ప నీవు ప్రయత్నం చేసి కృత్రిమంగా అందుకొనగలిగింది కాదన్న  జ్ఞానం ఉన్నప్పుడు మనిషి మోక్షాన్ని కోరడు.

' అనువు ' అంటే దారి / ఉపాయం అని  అర్థాలున్నాయికామజయం అతి కష్టం కాదని అర్థం.




No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like