Sunday 15 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 188 (శ్రీమదాంధ్ర మహాభాగవతము: అష్టమస్కంధము)

కాంతాజనరత్న మెవ్వరిదొకో? యీ యాడురూపంబు ము
న్నే కల్పంబుల యందు గాన; మజు డీ యింతిన్  సృజింపంగ దా
లేకుం టెల్ల నిజంబు; వల్లభత నీ లీలావతిం జేరగా
నే కాంతుండు గలండొ? క్రీడలకు నాకీ యింతి సిద్ధించునే?

మోహినీ రూపాన్ని చూడాలన్న శివుని కోరికను మన్నిస్తూ , రూపాన్ని చూడగానే చిత్తవిభ్రమానికి లోనవ్వద్దని విష్ణువు శివునికి సలహా ఇచ్చాడు తరువాత విష్ణువు అంతర్ధానమయ్యాడువిష్ణువు కనుపించకపోయేసరికి శివుడు అతని కోసం అన్ని దిక్కులా వెదుకసాగాడు సమయంలో, ఒక సుందరోద్యానవనంలో, చెట్లవరుసలో, వయ్యారంగా నిలుచున్న ఒక సుందరి  కనబడిందిగాలికి ఆమె పైటచెంగు కొంచెం తొలిగిందిదాన్ని సర్దుకోవడానికి ఆమె వంగగా, ఆమె స్తన సౌందర్యం అచ్చెరువు గొలుపుతూ ఉంది. ఆమె ముంగురులు జారి వీపు మీద వ్రేలాడుతున్నాయి. ఆమె నడుము ఉందా లేదా అన్నంత సన్నగా అందంగా ఉందిచెవులకు పెట్టుకున్న ఆభరణాలు ప్రకాశిస్తూ, కాంతి ఆమె చెక్కిళపై పడుతున్నది. మెల్లగా నడుస్తుంటే, పిఱుదుల బరువుతో పాదాలు తడబడుతున్నాయిలేడిలాగా బెరుకు చూపులు చూస్తుంటే, చూసేవాడి గుండెలో సూటిగా గుచ్చుకొంటున్నాయి. జారిపోతున్న చీర కుచ్చెళ్ళను ఎడమచేతితో పట్టుకొని, బంతితో ఆదుతున్న సుందరిని శివుడు చూసాడుచూసి, మైమరపు చెందాడు.

సందర్భంలో అద్భుతమైన వచనం వ్రాసారు పోతనగారు.  " కానీ మున్ను మగువ  మరగి సగమయిన మగవా డమ్మగువ వయో రూప గుణ విలాసంబులు దన్ను నూరింపం గనుఱెప్ప వ్రేయక తప్పక చూచి మెత్తనయిన చిత్తంబున " అని వ్రాసారు.

పార్వతీదేవి సౌందర్యానికి మురిసి సగమై పోయాడట శివుడుశివుడు అర్థనారీశ్వరుడు.   ఇప్పుడు యీ సుందరి అందానికి బందీ అయిపోయిన శివుని పరిస్థితి ఏమిటి? అనేది తెలియజేసేదే యీ పద్యంశివుని మనస్సులో కోరిక సుడులు తిరుగుతున్నది.

" ఎవరబ్బా! అమ్మాయి ! కల్పంలోను ఇంత అందమైన అమ్మాయిని చూడలేదే? ఈమెను బ్రహ్మగారయితే సృష్టించి ఉండడు సుందరిని ఇల్లాలుగా  పొందేవాడు యెంత అదృష్టవంతుడో గదా! ఈమెతో క్రీడించే భాగ్యం నాకు లభిస్తుందా? "

ఇదీ శివుని మానసిక పరిస్థితి.  

సాక్షాత్తు భగవంతుడే యీ మనోవికారానికి లోనయితే, ఇక సామాన్య మానవుల సంగతి ఏమిటి

పద్యం మూడవ పాదంలోని " లీలావతి ",  చివరి పాదంలోని " క్రీడలకు " అనే పదాలు సార్థకములు, అర్థవంతమైనవి.

ఒకే చైతన్య రూపాలైన ఇద్దరూ, మాయ (అవిద్యయెంత బలీయమో ప్రపంచానికి తెలియజేయడానికి, క్రీడగా, లీలగా ఆడుతున్న జగన్నాటకమే యీ తంతు అని సమన్వయం చేసుకోవచ్చు. ఆట ఆడటానికి ఇద్దరు ఆటగాళ్ళు ఉండాలి గదా! వారు సమ ఉజ్జీలై ఉండాలి. వారే శివకేశవులు.








No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like