Tuesday 31 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 250 (నన్నయ భారతము: అరణ్యకాండము: ప్రథమాశ్వాసము)

అలబల మంది యందుల మృగావలియున్ విహగంబులున్ భయా
కులగతి బొంది మూగలును గుంటులు జీకులునైన యట్టులై
యులియక, యున్నచో నడగియుండగ, గిరాతబలంబుతోడ బిం
గలనయనుం డుమేశ్వరుడు గవ్వడి డాయగ వచ్చె జెచ్చెరన్.

అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద పరమేశ్వరుని గూర్చి తపస్సు చేస్తున్నాడు. అర్జునుడిని పరీక్షించడానికి కిరాతవేషంలో శివుడుబోయసాని రూపంలో అమ్మవారు, అడవిలో వేటకు బయలుదేరారు 
సంరంభం చూసి, అడవిలోని జంతువులు, పక్షులు, మూగలుగాను, కుంటివిగాను, గ్రుడ్డివిగాను అయిపోయినాయిఅంటే, ఎక్కడివక్కడే కదలకుండా భయంతో మొద్దుబారిపోయినాయి విధంగా ఎఱుకల సమూహంతో అగ్ని నేత్రంగా కల శివుడు, సవ్యసాచియైన అర్జునుడిని సమీపించాడు.

పద్యంలో శివుని పరంగా ' పింగలనయనుండు ' అని, అర్జునుడి పరంగా ' కవ్వడి ' అని నన్నయగారు పదాలను సాభిప్రాయంగా వాడారుశివుడు త్రినేత్రుడు. అందులో ఒకటి అగ్ని నేత్రం. అగ్ని నేత్రంతో చూడటమంటే కాల్చడమేదీనినే, విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్షము సుందరకాండములో " ముఖంలో అగ్నినేత్రం కలవానిని, చూసి రమ్మంటే, కాల్చి రమ్మనే అర్థం కదా! " అని శైవాంశ సంభూతుడైన హనుమంతుని గురించి చమత్కరించారుఅగ్ని ఎదురుగా ఉన్న దానినల్లా దహించివేస్తుంది.

ఇక కవ్వడి అంటే, కవ+వడిజంట వడులు కలవాడురెండు చేతులతోను వడిగా బాణప్రయోగం చేసేవాడు, సవ్యసాచి. బాణప్రయోగంలోబాణానికి, బాణానికి మధ్య ఎడం ఉండదు.

పైన వాడబడిన రెండు విశేషణాలు స్వారస్యంతో కూడుకొన్నవిప్రతిస్పర్థు లిద్దరూ దీటైనవారుఇక వారిద్దరి మధ్యలో పోరు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించవచ్చు.


పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వము, ప్రథమాశ్వాసంలో ఉన్నది.

సువర్ణ సుమన సుజ్ఞేయము - 249 (నన్నయ భారతము: సభాపర్వము: ప్రథమాశ్వాసము)

సమ్మదమంది చూచిరి భృశంబుగ భూజను లెల్ల బ్రహ్మతే
జమ్మును రాజతేజమును సద్బహుభూషణ రత్నరాజి తే
జమ్మును విస్తరించుచు నిజద్యుతి యొప్పగ మూర్తమైన
ర్మమ్మును బోలె నున్న గుణమండితు దీక్షితు ధర్మనందనున్.

భగవంతుడైన శ్రీకృష్ణుని దయతో, అరివీర భయంకరులైన తమ్ముల సహాయంతో, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడుఆయన బ్రహ్మతేజంతో, క్షాత్రతేజంతో వెలిగిపోతున్నాడుఅతడు ధరించిన రత్నాభరణాలు ప్రకాశానికి మెరుగులు దిద్దుతున్నాయివీటన్నిటికీ తోడు తన సహజమైన కాంతి, నిజద్యుతి, జతగలిసిందా అన్నట్లు, ఆకారం దాల్చిన ధర్మం వలె సుగుణ సంపదతో ప్తకాశిస్తూ, యజ్ఞదీక్షితుడై ఉన్న  ధర్మరాజుని చూసి అక్కడ ఉన్నవారంతా సంతోషించారు.

పద్యంలో ఉన్న విశేష మేమంటే, వాల్మీకి మారీచుని చేత " రామో విగ్రహవాన్ ధర్మః " అని చెప్పించాడు. "  అదే రీతిలో తెలుగు భారతంలో నన్నయగారు, కథానాయకుడు యుధిష్ఠురుని, " మూర్తమైన ధర్మము " , రూపుదాల్చిన  ధర్మంగా అభివర్ణించారు

కురుక్షేత్ర మహాసంగ్రామం ద్వారా, ధర్మ విజయాన్ని సూచించే మహేతిహాసం భారతంఅందుకే, నన్నయగారు, " ధర్మతత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రం బని " అన్నారని వ్రాశారు.

పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, సభాపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 248 (నన్నయ భారతము : ఆదిపర్వము: షష్ఠాశ్వాసము)

వీరు నమ్మంగ దగుదురు వీరు నమ్మ
దగరు నాకు నా వలవదు, తత్త్వబుద్ధి 
నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు 
నాత్మరక్షాపరుం డగు నది విభుండు.

ఇమ్ముగ నాత్మరక్ష విధియించు విధంబున మంత్రరక్ష
త్నమ్మున జేయగావలయు, దత్పరిరక్షణశక్తి నెల్ల కా
ర్యమ్ములు సిద్ధి బొందు బరమార్థము, మంత్రవిభేద మైన గా
ర్యమ్ములు నిర్వహింపగ బృహస్పతికైనను నేరబోలునే.

తన కపకారము మును జే
సిన జను డల్పు డని నమ్మి చేకొని యుండం
జన దొకొయించుక ముల్లయి
నను బాదతలమున నున్న నడవగ  నగునే

తడయక సామభేదముల దానములన్ దయతోడ నమ్మగా
నొడివియు సత్యమిచ్చియు జనున్ జననాథ! కృతాపకారులం
గడగి వధింపగా  గనుట  కావ్యు మతం బిది గాన యెట్టులేం
గడుకొని శత్రులం జెరుపగాంచుట కార్యము రాజనీతిమైన్.

శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, షష్ఠాశ్వాసంలో కణిక నీతులని ఉన్నాయికణికుడు శకునికి మంత్రిధృతరాష్ట్రుడు యుధిష్ఠురునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయడంతో, మాత్సర్యం వహించిన దుర్యోధనుడు, కణికుడితో మంతనాలు సాగించాడు. సందర్భంలో, శత్రువు మీద పై చేయి సాధించటానికి ఏమేమి చేయాలొ చెప్పినవే కణిక నీతులని ప్రసిద్ధి నొందాయి.

" రాజుకి వీడు నమ్మదగినవాడు, వీడు నమ్మదగినవాడు కాదు అనే భేదము ఉండకూడదుఅసలు, ఎవరినీ నమ్మకుండా, తనను తాను రక్షించుకోవాలి.

అదేవిధంగా, రాజు తన అంతరంగంలో ఉన్న ఆలోచనలను కూడా రక్షించుకోవాలిఅవి బయటపడకుండా  ఉంచుకొనడంలోనే, అతని బల  మంతా ఉంది. అప్పుడే, అతని పనులు ఫలప్రదమౌతాయిఅవి బయటపడ్డాయంటే, ఇక వాటిని ఫలవంతం చేయడం బృహస్పతికైనా సాధ్యం కాదు.  (బుద్ధిలో బృహస్పతిని మించిన వారు లేరు కదా!)

కాలులో గుచ్చుకున్న ముల్లు చిన్నదే అయినా, వెంటనే తీసివేయాలి. లేకపోతే నడవలేముఅట్లాగే, తనకు అపకారం చేసినవాడు అల్పుడయినా, అతడిని ఉపేక్ష చేయకూడదు.

తనకు అపకారం చేసిన వారిని, ముందు సామ, దాన, భేదోపాయాలతో లొంగదీసుకోవాలిఅది కూడా పని చేయకపోతే, దయ చూపించి, నమ్మకం కల్పించి, ఒట్టు వేయించుకోవాలి విధంగా మెల్లగా నమ్మకం కలిగించి, గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టాలి. ఇది శుక్రాచార్యుడు చెప్పిన రాజనీతికాబట్టి, విధంగా నైనా శత్రువుని  మట్టుపెట్టకండా ఉండకూడదు. "


శుక్రాచార్యుడు భృగువు (కవి) కుమారుడు కనుక కావ్యుడని ప్రసిద్ధి వహించాడు.

సువర్ణ సుమన సుజ్ఞేయము - 247 (నన్నెచోడుని కుమార సంభవము: దశమాశ్వాసము)

వరదుం డీశుడు భక్తవత్సలుడు దేవవ్రాతసేవ్యుండు శం
కరు డానందు డనాధనాధుడని లోకంబెల్ల సద్భక్తిత
త్పరులై సార్థకనామధేయ మహిమోద్దామస్థితున్ నిన్ను దు
స్తరదుఃఖాపనయార్థ మర్థి గొలుతుర్ దారిద్ర్యవిద్రావణా!

" దారిద్ర్యాన్ని పోగొట్టే శివా! వరాలను ఇచ్చేవాడివని, సర్వ లోకాలకు ప్రభువువని, భక్తుల యెడల అపారమైన వాత్సల్యం కలవాడివని, దేవతలందరిచే సేవింపబడేవాడివని, శుభాలను కలుగజేసేవాడివని, ఆనందమయుడివని, దిక్కు లేనివారికి దిక్కని, లోకంలోని వారంతా సద్భక్తితో నిన్ను కొలుస్తూ ఉన్నారు. శివుడు, శంకరుడు అనే పేర్లు నీ యెడల సరియైనవని తలుస్తున్నారు. మహామహిమాన్వితుడవైన నీవు వారి భరించరాని దుఃఖాన్ని పోగొడతావని నిన్ను కొలుస్తున్నారు. "


నన్నెచోడుని కుమారసంభవము కావ్యము, దశమాశ్వాసము నందలి బృహస్పతికృత దారిద్ర్యవిద్రావణ స్తవంలో ఇదీ నాలుగవ పద్యం. కంఠస్థం చేసి చక్కగా, భక్తి తత్పరతతో పాడుకొన దగిన పద్యం.

సువర్ణ సుమన సుజ్ఞేయము - 246 (శ్రీమదాంధ్ర మహాభాగవతము: దశమ స్కంధము)

ఇతడె యితండు కన్ను లొకయించుక మోడ్చిన నీ చరాచర
భువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్ 
వితతములై జనించు బ్రభవిష్ణుడు విష్ణుడు నైన యట్టి యీ
క్రతుఫలదుండుగా కొరు డొకం డెటు లర్హుడు శిష్టపూజకున్.

పురుషోత్తమున్ జగదధీశు ననంతుని సర్వశక్తు జి
ద్రూపకు నగ్రపూజ బరితోషితు జేయ సమస్త లోకముల్
వే పరితుష్టి బొందు బృథివీవర! కావున నీవు కృష్ణునిన్ 
శ్రీపతి బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్?

రాజసూయ యాగం సందర్భంగా, అగ్రపూజను అందుకొనడానికి, శ్రీకృష్ణుడు తప్ప ఇంకొకరు అర్హులు కారని, సహదేవుడు చెప్పిన మాటలివి.

" శ్రీకృష్ణుడు కన్నులు కొంచెం మూసుకున్నాడంటే సమస్త చరాచర ప్రపంచమంతా నశిస్తుందిఆయన కన్నులు తెరిచి చూసాడంటే, లోకాలన్నీ పుడతాయి. అందువల్ల, సమస్త సృష్టికి హేతువు, విశ్వవ్యాపకుడు, యజ్ఞఫలదాత అయిన శ్రీకృష్ణుడు తప్ప అగ్రపూజకు ఇంకెవరు అర్హులు

అంతేగాక, మహారాజా! పురుషోత్తముడిని, సర్వ లోకాధీశుడిని, అనంతుడిని, సర్వశక్తిమయుడిని, జ్ఞానస్వరూపుడిని అగ్రపూజతో సంతోషింప జేస్తే, సమస్త భువనాలు పరిపూర్ణంగా తృప్తి నొందుతాయిఅందువల్ల, ఇక మాత్రం ఆలస్యం చేయకుండా, మహనుభావుడిని పూజించుతక్కిన మాటలన్నీ అనవసరం. "


శ్రీకృష్ణుని అగ్రపూజకు సంబంధించిన పద్యాలు శ్రీమదాంధ్ర మహాభాగవతము, దశమ స్కంధంలో ఉన్నాయి.

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like