Monday 23 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 223 (శ్రీనాథుని హరవిలాసము: షష్ఠాశ్వాసము)

ఇరు ప్రక్కియల నుండి సురసింధురములు 
          పరిపూర్ణ హేమకుంభములు దాల్ప
నందంద నవనిధానాధిదేవతలును
          సొరిది బంగారువీచోపు లిడగ
జయ జయ ధ్వనులతో సర్వదేవతలును
          గేలుదమ్ములు మౌళి గీలుగొల్ప
బుష్పవర్షములకు బ్రోదియై వినువీధి
          దేవదుందుభినాద మావహిల్ల 

బ్రబలి మున్నీటినడునీట బాండువికచ
కమలకాంచనకర్ణికాగ్రంబునందు
బ్రహ్మదిక్పాలవందితపాదపద్మ
పద్మ యుదయించె గన్నులపండు వగుచు.

పాలకడలిని చిలుకుతుంటే ముందు హాలాహలం పుట్టిందిదానిని, శివుడు తన కంఠంలో దాచి లోకాలను రక్షించాడు. తరువాత, క్షీరసాగరమధ్యం  నుండి ఒక పద్మము పుట్టిందిదాని పరిమళంతో లోకాలన్నీ నిండిపోయాయి.

అష్టదళ పద్మము నందు " పద్మ యుదయించె కన్నులపండు వగుచు. " అన్నాడు శ్రీనాథుడుఅట్టి లక్ష్మీదేవిని వర్ణించే పద్యమే ఇది.

" లక్ష్మీదేవికి రెండు ప్రక్కల ఐరావతముల వంటి స్వర్గ లోకపు గజరాజులు స్వర్ణకుంభాలను తొండములతో పైకెత్తి పట్టుకున్నాయినవనిధులకు అధిదేవతలు బంగారపు వింజామరలు వీస్తున్నారుజయ జయ ధ్వానాలతో, దేవతలందరూ తలలు వాల్చి ఆమె పాదపద్మాలకు నమస్కరిస్తున్నారుఆకాశవీధి నుండి పూలవానతో పాటు దేవదుందుభులు మ్రోగసాగాయి విధంగా పాలసముద్రం నడుమ, బంగారు కాంతులు విరజిమ్ముతున్న వికసించిన పద్మము నందు చూసేవారి కన్నులకు పండుగగా, బ్రహ్మాదిదేవతలచే పూజింపబడుతున్నలక్ష్మీదేవి ఉద్భవించింది. "

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం.............హస్తినాద ప్రబోధినీం........పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. " అని ఋగ్వేదాంతర్గత శ్రీసూక్తం లక్ష్మీదేవిని కీర్తిస్తుంది.  

శ్రీనాథ కవిసార్వభౌముడు యీ పద్యంలో పద్మము యొక్క ప్రస్తావన పలుసార్లు చేశాడుపద్మం, స్వచ్ఛతకు, పవిత్రతకు, అందానికి, ఆధ్యాత్మికతకు, ప్రాణశక్తికి సంకేతంలక్ష్మీదేవికి ఇరుప్రక్కల నున్న ఏనుగులు, సంపదకు, సమృద్ధికి చిహ్నాలు.

మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము అన్న తొమ్మిది నిధులను కుబేరుని నవనిధులు అంటారుఅటువంటి కుబేరుడు అమ్మవారికి బంగారపు వింజామరతో వీస్తాడుఅనగా, లక్ష్మీ కటాక్షం ఉంటే సంపదలు సమకూరుతాయని అర్థం.


సీస పద్యం హరవిలాసము, షష్ఠాశ్వాసంలో ఉంది.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like