Tuesday 30 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 571 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)









లీలగ మీరు  లోకమును లెక్కయె చేయరు, మీకు సర్వముం 
దేలికగాఁ గనంబడును దీర్పని కార్యము తీర్చినట్లుగా
బోలు నపారశక్తిగల బుద్ధికి, మా యెడ నట్లు గాదు, ప్రా

ణాలును బ్రాప్తకార్యకరణంబును తూనిక పట్టినట్లుగా.

సుగ్రీవుని సందేహాన్ని నివృత్తి చేయటం కోసం, రాముడు సప్తతాళ భంజనమనే అద్భుతమైన కార్యం చేసి అతనికి నమ్మకం కలిగించాడు. అయితే సోదరులతో తనకు గల గాఢానుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని, "  దయ అనేది లేకుండా, సిగ్గుపడేటట్లుగా, సోదరుల మధ్య అంత వైరం ప్రబలి, తమ్ముడివైన నిన్ను వాలి, విధంగా వెంబడించడానికి, నీవేమి తప్పు చేశావు? " అని రాముడు సుగ్రీవుడిని అడిగాడురాముని మాటతో, రాముని ఔదార్యం, వాలి మీద కృపగా మారుతుందేమోనని భయపడ్డాడు సుగ్రీవుడుఅందుచేత, సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు.

మీరీ మాటనటానికి నే నాయనకు ఒక అపకారమని చేస్తే కదా ! విపరీతబుద్ధి కల వాలి మనం ఏం చేయకుండానే ఏదేదో ఊహించుకుంటాడు. నేనతడిని బ్రతిమాలాను, బామాలాను న్నపార్థం చేసుకోవద్దనిదుందుభిని వధించిన అతడి బలపరాక్రమాలను మెచ్చుకొన్నాను. నేను తెలియక చేసిన పొరపాటును మన్నించమన్నాను.   అతడివన్నీ తల కెక్కించుకొంటే గదా !

ఆయనకు ఒకడిపై విరోధం, ఇంకొకడిపై కోపం అనేవి ఉండవు. వాలి వంటి వారికి, వారి పదవి మీద ఉన్నంత అభిమానం ఇంకొక దాని మీద ఉండదు. రామా ! నేను చెప్పేది పూర్తిగా వినండి తరువాత, నాది తప్పని మీకనిపిస్తే, అప్పుడు వాలినే సమర్థించండి. "

సుగ్రీవుడు అతిలోక ప్రజ్ఞా విశేషాలున్న వారి ఆలోచనా విధానానికి, సామాన్య లోక వ్యవహారానికి గల తారతమ్యాన్ని  యీ పద్యంలో వివరించాడు.

" రామా ! మీరు అపారమైన శక్తిసామర్థ్యాలు, బుద్ధి విశేషం ఉన్నవారు. మీరు లోకాన్ని లెక్క చేయరులో కంలోని సర్వవ్యవహారాలు మీకు తేలికగా కనపడతాయిజరుగని పని జరిగినట్లుగా మీకు కనపడుతుందిమా విషయం అట్లా కాదు. మా ప్రాణాలు, మాకు ప్రాప్రమయ్యే ఫలితాలు తూనిక పట్టినట్లుగా ఉంటాయి. "

రాముడు ధర్మమూర్తి. విశ్వనాథ అవతారికలో చెప్పినట్లుగా, అతడి సోదరులు రాముడి ఊహలను అనుసరించి నడచుకొనేవారుఅంతటి గాఢానుబంధం వారిదిఅందువలననే, వాలి " కృపమాలి వెంబడింపగ ద్రపమాలినయట్టు లన్నదమ్ముల మధ్యన్. " అని ఆశ్చర్యాన్ని ప్రకటించాడురామునికి, అతని సోదరులకు మధ్య నున్న బంధం లోకాతీతమైనది. ఇక సుగ్రీవుడు చెప్పింది లోకవ్యవహారం గురించిలోకంలో, రామసోదరుల మధ్య నున్నంత గాఢబంధం లేదన్నది అందరికీ తెలిసిన విషయం

ఇక రెండవ విషయం, విశ్వనాథ కథాకథనానికి సంబంధించినది. సోదరుల మధ్య అంత వైరం ప్రబలటానికి కారణమడిగి, సుగ్రీవుని చేత దుందుభి యొక్క తదనంతర కథను చెప్పించటం, విశ్వనాథ కథాశిల్పానికి నిదర్శనం.

లోకాతీతమైన విషయానికి, లోకవ్యవహారానికి సంబధించిన యీ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనిది.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 570 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: ) అరణ్య కాండము : దశవర్ష ఖండము)








ఋషికథ యీ ఋషికథ
యే ఋషికథ చెప్పుచున్న నేమి యగస్త్యో
దార చరిత్రస్పర్శ వి
నా రాదది రామునకు మనంబున నాడున్.

కనులను మూసి యోగపరికల్పిత గాఢ సమాధి లగ్నులా
త్మను దనియింత్రు లోకపరితర్పణ సంగత వీరకర్ములౌ
మునులు కనుల్ చెవుల్ మనసు బుద్ధి యివెల్లను సంతసింపఁజే
యనగుదు రింద్రియంబులకు నంటి చరించునుగాదె జీవులున్.

సీతారామలక్ష్మణులు పదేండ్లు అరణ్యవాసాన్ని పూర్తిచేసారు. పదేండ్ల కాలంలో, మునులను రాక్షసుల బారి నుండి రక్షిస్తూ వచ్చారు. వారితో ప్రసంగిస్తూ, వారు చెప్పే పురాణ కథలను వింటూ పులకించిపోయారు. ఋషులు చెప్పే కథలు, ఋషుల యొక్క కథలు యెన్నో విన్నారు. ఏన్ని కథలు విన్నా, రాముడికి, అగస్త్యమహర్షి యొక్క మహత్తరమైన చరిత్ర వినకుండా, మనస్సుకి ఆనందం కలగటం లేదు. రాముడి మనస్సులో యెప్పుడూ అగస్త్యమహర్షి  కదులుతుంటాడు.

ఒకరోజు రామచంద్రుడు,  "  నేను మున్యాశ్రమాలు తిరుగుతున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా అగస్త్య మహర్షి లోకకళ్యాణార్థం చేస్తున్న పనులను గురించి చెప్పేవాళ్ళునే నింతకుముందు వెళ్ళిన ఆశ్రమాలకు అగస్త్యమహర్షి ఆశ్రమం చాలా దూర మంటున్నారు. ఇక్కడకు అది యెంత దూరమో చెప్పండి. " అని సుతీక్ష్ణుడిని వినయంగా అడిగాడు సందర్భంలో, మునుల యొక్క యోగనిష్ఠను గురించి ఎంతో కొనియాడాడు.  

మునులు కళ్ళు మూసుకొని ధ్యానముద్రలో కూర్చొనిగాఢమైన  యోగ సమాధిలో మునిగిపోయి, తమ ఆత్మలలో రమిస్తూ ఉంటారు.   జగత్కళ్యాణం కోసం ఇదంతా చేస్తున్న   వీరకర్ములు, దానిలోనే తృప్తి పొందుతూ ఉంటారుఇక సంసారజీవులు, కళ్ళు, చేతులు, మనస్సు, బుద్ధి, వీటినన్నిటినీ సంతోషపెడుతూ, యింద్రియాలను అంటిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. "

రామయాణంలో చాలా చోట్ల, రాముని యొక్క వైరాగ్య భావన తళుక్కుమంటూ కనిపిస్తూ ఉంటుంది. శ్రీమద్రామాయణ కల్పవృక్షంలోవిశ్వనాథ చేతిలో రాముని యొక్క నిర్వేదం బహుముఖాలుగా ప్రస్ఫుటమయింది.

పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.






సువర్ణ సుమన సుజ్ఞేయము - 569 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము : అభిషేక ఖండము)










ఒక యేదో బెడిదంపు దోసమని నే నూహింతు, లేకున్న ఱే
నికిఁ దా నింతటి దైన్యముం గలుగునే నిక్కంబుగాఁ దల్లి ! యిం
తకు నేఁ జాలుదునా? ధరాపతికి నేతాదృక్రుథాహేతుపా
తక  మే నేమి పొనర్చి యుందునొకొ జింతాదుర్గమం బయ్యెడిన్

తండ్రి పిలిచాడని సుమంత్రుడు చెప్పగానే, రాముడు పినతల్లి  కైక గృహానికి వెళ్ళాడు. చింతాక్రాంతుడై ఉన్న తండ్రిని చూసి నిర్విణ్ణుడై, తండ్రి పాదాలకు, కైకమ్మకు పాదాలకు నమస్కరించాడుతండ్రిని పలుకరించినా బదులు లేకపోయేటప్పటికి, తండ్రి ముఖం వంక చూస్తూ, " రాగానే ఒళ్ళో కూర్చొనబెట్టుకొని, తల మీద ముద్దు పెట్టుకొనే తండ్రి విధంగా చేయకుండా దుఃఖంగా ఉన్నాడేమిటనిఆశ్చర్యంగా పినతల్లిని అడిగాడు. తనవైపు చూడను కూడా చూడకుండా ఉన్న తండ్రికి ఇంత కోపం రావటానికి కారణ మేమయి ఉంటుందో, తండ్రి పినతల్లి కైకకు చెప్పే ఉంటాడని, అది తనకు చెప్పి తన ఆరాటాన్ని తగ్గించమని కైకను వేడుకొన్నాడురాముడు తన హృదయంలోని ఆవేదనను ఇంకా ఇలా వెలిబుచ్చాడు.

" అమ్మా ! నేనేదో పెద్ద తప్పే చేశానని అనుకుంటున్నాను. లేకపోతే తండ్రి ఇంత దైన్యంగా ఎందుకుంటాడు? తండ్రి యొక్క ఇంత దైన్యాన్ని నేను తట్టుకొనగలనా? రాజు యొక్క కోపానికి కారణమైన పాపం నేనేమి చేసి ఉంటానోనని తెలియక మనసంతా అల్లకల్లోలమౌతున్నది. "

దశరథుడికి రాముడు బహిఃప్రాణం. అటువంటి ప్రేమాస్పదుడైన తండ్రి మాటాపలుకూ లేకుండా దుఃఖమూర్తిగా ఉండటం  రాముడు చూడలేకపోయాడు

రాముని హృదయం లోని ఆవేదనను ప్రతిబింబిస్తున్నది శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోని యీ పద్యం.


ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like