Tuesday 31 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 245 (శ్రీమదాంధ్ర మహాభాగవతము: ఏకాదశ స్కంధము)

దారలయందు, బుత్ర ధన ధాన్యము లందు ననేక భంగులం
గూరిమి సేయు మర్త్యు డతి ఘోర వియోగజ దుఃఖమగ్నుడై 
నేరుపు దక్కి, చిక్కువడి నీతి వివేక విహీనుడై మనో
భారముతో గపోతపతి భంగి నిజంబుగ బోవు నష్టమై.

యదుసంక్షయం తరువాత శ్రీకృష్ణుడు వైకుంఠానికి మరలిపోతాడని విన్న ఉద్ధవుడు చాలా బాధ పడ్డాడుశ్రీకృష్ణునితో సన్నిహితంగా మెలిగిన తన వంటి వారు అతనితో ఎడబాటును విధంగా భరించ గలరని చింతాక్రాంతుడయ్యాడు. అప్పుడు కృష్ణుడు ఉద్ధవునికి తత్వాన్ని బోధించి, " అవధూత యదు సంవాదం " అనే పురాణేతిహాసాన్ని చెప్పాడు

ఒకనాడు యదురాజు దగ్గరకు శంకరవేషధారియైన ఒక అవధూత వచ్చాడు. యదురాజు అవధూతను " ఎక్కడ నుండి వచ్చారు? " అని అడిగాడుదానికి సమాధానంగా యోగి " తనను ఇరవై నలుగురు గురువులు విజ్ఞానఖనిగా తీర్చిదిద్దారని " చెప్పాడుమళ్ళీ యదురాజు, దేహి అరిషడ్వర్గాలను ఏవిధంగా జయించి జనార్దనుని చేరతాడని అడిగాడు. అప్పుడు అవధూత చెప్పినదే పద్య విశేషం.

" భార్యాబిడ్డల పైన, ధన ధాన్యాల మీద విపరీతమైన మోహాన్ని పెంచుకుంటాడు మానవుడుఎప్పుడైతే అవి దూరమౌతాయో, అప్పుడు అమిత దుఃఖానికి లోనవుతాడుఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోతాడుదాని వలన నీతిని, వివేకాన్ని కోల్పోతాడుచివరకు కథలో చెప్పిన పావురంలాగా నష్టపోతాడు. " అని పావురం కథ చెప్పాడు.

" అడవిలో ఒక పావురాల జంట, పిల్లలతో పాటు సుఖంగా గడుపుతూ, ఒకరి మీద ఒకరికి విపరీతమైన వ్యామోహంతో ఉండేవివిధివశాత్తు, ఆడపావురం, పిల్లలు ఒకరోజు బోయవాడి వలలో చిక్కుకున్నాయి దుఃఖాన్ని భరించలేక, కపోతపతి కూడా, వలలో దూరి, నశించిపోయాడు.   మమకారం పెద్ద శత్రువుఅందువల్లనే, యోగీంద్రులు సంతత హరి ధ్యానంలో ఉంటారు. " అని చెప్పి తనకు " భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెదలు, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుముకిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ " అనే ఇరవై నలుగురు గురువులని, వారి గుణగణాలను తెలిసికొని మెలుగుతుంటానని చెప్పాడు.


మహాభారతం, అశ్వమేధపర్వంలో, శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చేసిన తత్త్వబోధ కూడా ఇక్కడ గమనార్హంమానవుని జీవితంలో " మమ (నాది) " అనే రెండక్షరాలు మృత్యువనీ, " మమ (నాది కాదు) " అనే మూడక్షరాలు మోక్షహేతువని నిర్ద్వంద్వంగా చెప్పాడు మమకారం పోనంతకాలం, నమః అనే శరణాగతి తత్వం రానంతకాలం, ఎన్ని భారత, భాగవత, రామాయణాలు చదివినా, విన్నా, విముక్తికి దారి కనుచూపు మేరలో కనపడదుఅంతవరకు, జీవితమనే నాటకంలో, మానవుడు విషాదాంత నాయకుడిగా మిగిలిపోతాడు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like