Thursday 19 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 207 (తిక్కన భారతము: అశ్వమేధపర్వము: ప్రథమాశ్వాసము)

అమ్మెయి బంధుమిత్రుల సహాయత కల్మి ప్రయోజనంబు లే
దమ్మహనీయ యుద్ధమున కాత్మయ తోడు, మనంబు శత్రు డీ
వెమ్మెయినైన శాంతి ఘటియింపుము లోపగ దీర్పు మెందు శాం
తమ్మ చుమీ మనోజయము దాన వెలుంగుము శాంతబుద్ధివై.

శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధపర్వము, ప్రథమాశ్వాసములోని పద్యము అద్భుతమైనది.

రాజ్యం కోసం బంధుమిత్రులను కురుక్షేత్రసంగ్రామలో చంపవలసివచ్చిందని చింతాక్రాంతుడై ఉన్న ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తత్త్వబోధ చేస్తున్నాడు.

కురుక్షేత్ర సంగ్రామం మిథ్యాయుద్ధమని, అది నిజమైన యుద్ధం కాదని చెప్పి శ్రీకృష్ణుడు దానికి వివరణ ఇస్తున్నాడు.

" నీవు భావిస్తున్నట్లుగా, అంత మంది బంధుమిత్రులను కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదుఎందుకనగా, మానవునికి తన ఆత్మ అన్నదే తోడు, మనస్సనేది శత్రువుఅందువల్ల, నీవు బాహ్య శత్రువులను చంపావని బాధపడతావెందుకు? నీ లోపలి శత్రువులను జయించి, మనస్సుకు శాంతిని తెచ్చుకోమనస్సును జయించడమంటే యేమిటిశాంతంగా ఉండటమే కదా! అందువల్ల, శాంతబుద్ధితో ఉండడానికి అభ్యాసం చేయి. "

సందర్భంగా, పద్యాన్ని అర్థం చేసుకొనడానికి,తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, అశ్వమేధపర్వము, ప్రథమాశ్వాసానికి డా.హెచ్.ఎస్.బ్రహ్మానందగారి విశేష వ్యాఖ్య కూడ ఎంతో ఉపయోగపడుతుంది.


కౌరవులు పాండవులు లోకం దృష్టిలో శత్రువులు. అందువల్ల యుద్ధం చేశారు. జయాపజయాలను ప్రక్కన పెడితే, ఎవరి అంతఃశ్శత్రువులు వారికున్నారుదుర్యోధనునికి లోభం, మదం, మాత్సర్యం ఇవన్నీ శత్రువులుఇక పాండవులకు, రాజ్యకాంక్ష, తమ పరాక్రమంపై నమ్మకం, కౌరవులపై పగ శత్రువులుఅటు కౌరవులు తమ ద్వేషానికి తామే బలైపోయిఅశాంతితో మరణించారుగెలిచిన పాండవులు, మనశ్శాంతి లేక శోకంతో కుమిలిపోతున్నారుశ్రుతివాక్యం వలె " మనయేవ కారణం బంధ మోక్షామి ఏవచ ".  శోకానికి కారణం మనస్సు. శోకానికి కారణం ఆత్మనిత్యత్త్వాన్ని తెలుసుకొనకపోవడం శోకానికి కారణం తమోగుణం, అజ్ఞానంఅందువల్లనే, వివేకంతో శాంతబుద్ధిని అభ్యసించమని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు హితవు పలికాడు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like