Tuesday 24 March 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 225 (శ్రీమదాంధ్ర మహాభారతము: ఆదిపర్వము: షష్ఠాశ్వాసము)

కురుకులజుండు పాండునకు గుంతికి బుత్రుడు, రాజధర్మబం
ధురచరితుండు; నీ వతనితోడ రణం బొనరించెదేని వి
స్తరముగ నీదు వంశమును దల్లిని దండ్రిని జెప్పు; చెప్పినన్
దొరయగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు సూపెడిన్.

కుమారాస్త్ర విద్యాప్రదర్శన జరుగుతుండగా, కర్ణుడు రంగ ప్రవేశం చేసి తన శస్త్రాస్త్ర విద్యను ప్రదర్శించాడుదుర్యోధనుని ప్రోత్సాహం లభించగానే, అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి సన్నద్ధుడయ్యాడుఅప్పుడు, కృపాచార్యుడు కర్ణునితో విధంగా అన్నాడు.

" అర్జునుడు కురుకులంలో పుట్టినవాడు, పాండురాజు కుంతీదేవి కుమారుడురాజధర్మం చేత ఒప్పిన ప్రవర్తన కలవాడు. ఇప్పుడు నీవు ఇతనితో యుద్ధం చేయదలచుకుంటే, నీ వంశం గురించి, తల్లిదండ్రులను గురించి చెప్పుఅప్పుడు, (పైన చెప్పిన విధంగా) నీవు  సమానుడవైతే, ఇతడు నీకు ఎదురునిలిచి భుజబలాన్ని ప్రదర్శిస్తాడు. "

పద్యం చాలా తేలికగా అర్థమవుతుందికానీపై పైన అర్థం చేసుకుంటే, పద్యం సొగసు తెలియదు. మహాకవుల లక్షణ మంతే. " లోనారసి మేలు " అనాలి.  

అందువల్ల, పెద్దలు చెప్పిన దానినే, నాకు అర్థమయిన రీతిలో వివరిస్తాను.

శబ్దం యొక్క శక్తి అమోఘమైందిఅది అడుగున దాగి ఉన్న ప్రాణభూతమైన అర్థాన్ని బయటకు లాక్కొస్తుందిఅటువంటి శబ్దాలు పద్యంలో కృపాచార్యుడు ప్రయోగించినవి మూడు ఉన్నాయిఅవి కుల, రాజ, దొర, అనే మాటలుకులమంటే వంశమనీ, వర్ణమనీ రెండర్థాలు ఉన్నాయిఅర్జునుడు, కురువంశానికి చెందినవాడు, క్షత్రియుడుఇక, రాజ్యమున్నవాడు రాజు, క్షత్రియుడు అని కూడ అర్థంవంశాన్ని, తలిదండ్రులను పేర్కొని, కర్ణుడిని అర్జునునితో సమానమైన వాడిగా నిరూపించుకొనమని కృపాచార్యుడు చెప్పాడు.   దొర అంటే ప్రభువు, సమానుడు అని రెండర్థాలు ఉన్నాయి. దొర అన్న పదానికి ప్రభువు అన్న  అర్థాన్ని తీసుకొని, దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి అధిపతిని చేశాడుపరాక్రమంలో, కర్ణుడు అర్జునునకు సమానుడని సూచించాడుపరాక్రమం ప్రసక్తి వచ్చినప్పుడు, తల్లిదండ్రులను, కులాన్ని పట్టించుకొనగూడదని వాదించాడు. అందుకే, భీముణ్ణి ' అనిలజుడు ' అని ఎత్తిపొడిచాడు

పద్యంలోని సొగసంతా ' దొర ' అన్న శబ్దంలోని వాచ్యార్థ, వ్యంగ్యార్థాల్లో ఉందివాచ్యార్థ మంటే పైకి కనపడే అర్థంవాచ్యార్థంలో కర్ణుడు అర్జునునికి సమానుడైతే కావచ్చు గాని, వ్యంగ్యార్థంలో, తల్లి దండ్రుల నుంచి సంక్రమించే గౌరవం, ఉత్తమ కులగౌరవం ఎన్నటీకీ లభించవని  కృపాచార్యుని భావన విధంగా, కృపాచార్యుని చేత వాడబడిన శబ్దగత ధ్వని సౌరభం, పద్యాన్ని గుబాళింపజేసింది సందర్భంగా, " దొర యగుదేని " అన్న కృపాచార్యుని మాటల పొందిక కూడా గమనార్హం.

పద్యం చదివే వారికి కర్ణుని జన్మవృత్తాంతం తెలుసు, కానీ, సన్నివేశంలో ఉన్నవారికి అది తెలియదు. అందువల్ల, చదివేవారికి కర్ణుడి పట్ల సానుభూతి కలుగుతుంది. ఇది రస విషయకమైన పరమ రహస్యం.

ఇందులో చెప్పబడిన అంశములన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, షష్ఠాశ్వాసములో కనిపిస్తాయి. విశేష వ్యాఖ్యను డాక్టరు అప్పజోడు వేంకటసుబ్బయ్యగారు, సంపాదకవర్గము వారు అందించారువారికి కృతజ్ఞతలు.



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like