Tuesday 7 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 599 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)












తెరువులు కాఁచి తాదృశు వ్రతింగని స్వామి ! భవాదృశుండు మా
యిరవున కేగుదెంచి యొక యిన్ని జలంబులు పుచ్చుకోనిచో
బరువయినట్టి కుక్షికిని బాపపుఁదిండి భుజింపలేమ నీ
ష్ఠురము గృహస్థధర్మము కడున్ మిముఁబోలినవారు లేనిచో.

నలిఁ బ్రతినిత్యమున్ వ్రతము నాకిది గుండిగయందు మిక్కిలిం
బలిసిన గొఱ్ఱెపోతు రుచివంటకమున్ బొనరించి త్వాదృశుం
బిలిచెద మంచి భోజనము పెట్టెద మీకును మాకుఁ దృప్తి యా
వలను గృహస్థధర్మపరిపాలన మీకిది స్వర్గహేతువౌ.

వాకిట బలిసిన గొఱ్ఱియ
మీకే కనిపించు నంచు మేదకుని ద్విజున్
గైకొని పోవు నెవండేన్
రాక యెదేఁజెప్ప, వాడు రాకాసి మఱిన్.

సీత, రామలక్ష్మణులకు వాతాపి ఇల్వలుల కథ చెపుతున్నది

ఇల్వలుడు, వాతాపి అనే వారిద్దరన్నదమ్ములు. వాళ్ళు కామరూపులు, క్రూరకర్ములు. నరమాంసం మరిగారువాతాపి గొర్రెపోతై వాకిట్లో కట్టివేయబడి, అతిథులకు కనిపిస్తాడుఇల్వలుడు దారికాచి బ్రాహ్మణుడి నెవరినో ఒకరిని ఇంటికి భోజనానికి పిలిచేవాడు. వాకిట్లో ఉన్న గొఱ్ఱెను కోసి, వండి, భోజనం పెట్టేవాడుతరువాత, " వాతాపి ! బయటకు రా ! " అని పిలిచేవాడు. వాతాపి అతిథి పొట్ట చీల్చి బయటకొచ్చేవాడు.  

ఇల్వలుడు దారులు కాచి, కనిపించిన బ్రాహ్మణులతో విధంగా అనేవాడు.

" స్వామీ ! మీ లాంటి సద్బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చి ఇన్ని నీళ్ళు పుచ్చుకోకపోతే, వెధవ పొట్టకి పాపపుకూడు తిన్నట్లు యేమిటో బరువుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే, మీ లాంటి వాళ్ళు దొరక్కపోతే, గృహస్థధర్మం పాటించడం చాలా కష్టంగా ఉంటుంది సుమా !

ప్రతిరోజు నాకిదో వ్రతం. గుండిగ నిండా గొర్రెమాంసం రుచిగా వండి, మీలాంటి వారికి భోజనం పెడితే, తిన్న మీకు తృప్తి, పెట్టిన మాకు తృప్తిఇక ఆపైనంటారా ! గృహస్థధర్మం పాటించినందుకు మాకు ఆనందం, మీకేమో స్వర్గం చూసినట్లుంటుంది.

వాకిట్లో కొచ్చేటప్పటికి గొర్రెపోతు మీకే కనిపిస్తుందిగా ! "

విధంగా చెప్పి, ఎవడో ఒకడు అమాయక బ్రాహ్మణున్ని తీసుకువెళ్ళేవాడువాడీ పన్నాగం కనిపెట్టి రానన్నాడనుకో, వాడసలే రాక్షసుడు, బలవంతంగా లాక్కెళ్ళేవాడు.

విశ్వనాథ కథ చెప్పే తీరు రమ్యంగా ఉంటుంది. వారే అవతారికలో చెప్పినట్లుగా, మనం ఇళ్ళలో మాట్లాడుకొనే రోజువారీ భాషను కావ్యంలో చొప్పించి, రసజ్ఞుల హృదయాలకు గిలిగింతలు పెట్టించారు.

మూడు పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.











No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like