Wednesday 1 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 370 (శ్రీనాథుని కాశీఖండము: చతుర్థాశ్వాసం)












సచ్ఛోత్రియులు ననూచానులు సోమ పీ
          థులు నైన కులము పెద్దల దలంచి
రాజమాన్యుడు సత్యరతుడు వినిర్మలా
          చారవంతుడునైన జనకు దలచి
భాగ్యసంపద బుణ్యపతిదేవతలలోన
          నెన్నంగ దగియెడు నన్ను దలచి 
వేదశాస్త్ర పురాణ విద్యానిరూఢులై 
          వాసికెక్కిన తోడివారి దలచి 


చెడ్డయింటి చెదారమై శివుని కరుణ
నివ్వటిలు నిర్వదేనేండ్ల నిన్ను దలంచి
పదియునార్వత్సరంబుల భార్య దలచి
గోరతనములు మానురా ! కొడుకు గుఱ్ఱ ||

గోరతనములు = చెడు నడతలు

 పద్యంభారతీయ కుటుంబ వ్యవస్థలో తల్లికి ఉన్న రెండు కోణాలను ఆవిష్కరిస్తుందిమొదటిదితల్లికి తన సంతానంపై  అపారమైన ప్రేమ.  రెండవదిపిల్లలను మంచివారిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత.  అయితేతల్లి ప్రేమ అవధులు దాటిఆమె బాధ్యతను విస్మరింపజేస్తేదుష్పరిణామాలకు దారితీస్తుంది

గుణనిధి విషయంలో జరిగింది ఇదేగుణనిధి భ్రష్టత్వానికి ఒక రకంగా తల్లి కూడా కారణమే.  కొడుకు చేసిన తప్పులన్నిటినీ తండ్రికి తెలియకుండా దాచిపెట్టిందిపరిస్థితి చేయి దాటిన తరువాతమారతాడేమోననే ఆశతోచివరి ప్రయత్నంగా కొడుక్కి సుద్దులు చెబుతున్నది.

గుణనిధిని తల్లి " కొడుకు కుఱ్ఱ " అని పిలిచిందిఅంటే ' వయసులో ఉన్న నా తండ్రీ ! అని అర్థం. ' చేతికి వచ్చిన కొడుకువికానీ చేతికి అందకుండా ఉన్నావు ' అని వ్యంగ్యం. ' అది ఆమె మితిమీరిన ప్రేమనుఅదుపులో పెట్టలేని నిస్సహాయతను ధ్వనిస్తున్నది.  ఇక  తల్లి ఏమి చెబుతున్నదో విందామా ! 

ఒరే నాయనా ! మన వంశంలో అందరూ శ్రోత్రియులువేదవేదాంగవేత్తలుయజ్ఞాలు చేసి సోమయాజులైన వారున్నారురా.  అటువంటిమన పెద్దవాళ్ళని తలచుకొనైనా  తిరుగుళ్ళు మానుకోరా.  మీ నాన్నరాజుగారి గౌరవాదరాలు పొందుతున్నవాడుసత్యసంధుడుకల్లాకపటం తెలియనివాడు.  మీ నాన్న ప్రతిష్ఠను చూసైనా  అల్లరి పనులు  మానుకోరా!  ఎప్పుడూ భర్తయే దైవం అని భావించే భాగ్యశాలిని నన్ను చూసైనా మారరా.  నాన్నాప్రక్క ఇంటి పిల్లలను చూడుఅప్పుడే వేదవేదాంగాలుపురాణాలుసమస్తశాస్త్రాలలోను  రకంగా పాండిత్యం సంపాదించారోవాళ్ళను చూసైనా నీ బుద్ధి మార్చుకోరా.  వరప్రసాదివిఒక్కగా నొక్క కొడుకువిశివుని అనుగ్రహంతో పుట్టినవాడివి.  ఇదిగో  రకంగా చెత్త ఇంటి చెదారమయ్యావు.  ఒంటి మీదికి ఇరవై అయిదేళ్ళు వచ్చిపడ్డాయి.  నీకు తోడు పదహారేళ్ళ  నీ భార్య ఒకత్తె.  బంగారంలాంటి  పిల్ల.  దాని ముఖం చూసైనా నీ చెడ్డ పనులు మానుకోరాఇప్పటికైనా బాధ్యత తెలుసుకోకపోతే ఎలారా! " 

చాలామంది ఇళ్ళలో జరిగే తతంగం ఇదే.  తండ్రి భయం ఉన్న పిల్లలు ఎక్కి వస్తారుతల్లి వెనకేసుకొచ్చిన పిల్లలు పాడయిపోతారుభయమంటేప్రేమగౌరవంతో కూడిన భయం.  వర్తమాన సమాజంలో  అభినవ  గుణనిధులను చాలామందిని చూస్తుంటాము.  పిల్లలకు తల్లి ప్రేమ చవి చూపించాలి గానీగారాబం చేసి  పాడుచేయకూడదు

తల్లి మితిమీరిన గారాబాన్నిపాడయిపోయిన కొడుకును చూసి ఆమె పడే మానసిక క్షోభనుకళ్ళకు కట్టినట్లు చూపించిన  పద్యం శ్రీనాథ కవిసార్వభౌముని కాశీఖండము కావ్యం చతుర్థాశ్వాసంలో ఉంది.

భాష విషయంలో సహజత్వం కోసంఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారి ' పద్యకవితా పరిచయం-1 ' గ్రంథాన్ని పరిగణనలోకి తీసుకొన్నానని చెప్పడానికి  మాత్రం సంశయించడం లేదుగురువుగారికి నమస్కారములు.



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like