Friday 3 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 577 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)










అవివేకం బగునేమొ నే నేఱుఁగ దోషాచారుఁడన్ గాను ని
న్నవానించెడునంత దుష్టమతిఁగా నస్మత్పురాభక్తి నీ
వవలోకింపుము నీకు నీడవలెఁ దోడైతింగదా సర్వమౌ

వ్యవసాయంబున నంత దాఁచుకొని తా నన్నాళ్ళులెట్లుండనౌ.

కిష్కింధాపురి దుర్గద్వారం దగ్గరకు వచ్చి, యుద్ధానికి రమ్మని రంకెలు పెడుతున్న దుందుభిని వెంబడించాడు వాలిఅన్నతో పాటు సుగ్రీవుడుమంత్రులందరూ వెళ్ళారుపరుగెత్తుకొని పోయిన దుందుభి ఒక కొండబిలంలో దూరాడుదుందుభిని చంపటానికి వాలి కూడా వాడితో పాటు కొండబిలం లోనికి వెళ్ళాడు. వెళ్తూ, బిలద్వారం దగ్గర సుగ్రీవుణ్ణి  ఉండమన్నాడు. సుగ్రీవుడు  బిలద్వారం దగ్గర కళ్ళలో వత్తులు వేసుకొని, రాత్రనక పగలనక కాపలా కాస్తూ, ఒక సంవత్సరం పాటు అక్కడే ఉన్నాడుఉన్నట్టుండి ఒకరోజు బిలంలో నుండి వికృతమైన ఆర్తనాదాలతో పాటు, నెత్తురుటేరులు కనిపించాయిసుగ్రీవుడికి ఏం చేయాలో తోచలేదువాలిని దుందుభి చంపాడేమోనని అనుకొన్న సుగ్రీవుడు, రక్కసి మూకలు ఊరిమీద పడతారేమో నన్న భయంతో, బిలద్వారాన్ని, తొలగించటానికి వీలులేని ఒక పెద్ద రాతితో మూసి, నగరానికి తిరిగివచ్చాడు. అన్న మరణించాడన్న దుఃఖంతో   ఉన్న సుగ్రీవుడుని మంత్రులు ఓదార్చి, రాజ్యం అరాచకం కాకుండా ఉండటానికి అతడిని కీశరాజ్యానికి పట్టాభిషిక్తుడిగా చేశారు.

ఇలా ఉందగా, ఒక రోజు హఠాత్తుగా వాలి ప్రత్యక్షమయ్యాడుసుగ్రీవుడు వణికిపోతూ, సిం హాసనం నుండి దిగి అతడికి ప్రణామం చేశాడువాలి, అదేమీ పట్టించుకోకుండా, సుగ్రీవుని మాటలేవీ వినకుండా, అతడిని కాలితో ప్రక్కకు తోసేసాడుసుగ్రీవుడు తనను మన్నించమని వేడుకొంటూ వాలితో ఇలా అన్నాడు.

" అన్నా ! మహావీరుడవైన నీన్ను  దుందుభి చంపాడనుకోవటం నా అవివేకమైతే కావచ్చుకానీ, తెలిసి నేను అపరాధం చేయలేదు. ఇక నిన్ను అవమానించేటంతటి దుష్ఠబుద్ధినీ కాదునేను పూర్వం నీపై చూపించిన భక్తిభావం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోఅన్నీ పనుల్లోను, నీడలాగా నిన్ననుసరించుకొని ఉన్నాకదా  ! లోపల ఏదో దుర్బుద్ధి పెట్టుకొని ఎవరైనా అన్నాళ్ళు అట్లా బయటపడకుండ ఉండటం సాధ్యమౌతుందా? " 

పై వృత్తాంతమంతా సుగ్రీవుడు రామునికి పూసగుచ్చినట్లుగా చెప్పి, వాలి తనను నగర బహిష్కరణ చేయటమే కాకుండా, తన భార్య రుమను బలవంతంగా తీసుకొని పోవటాన్ని వివరించాడు.

పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా ఖండము, నూపుర ఖండములో ఉంది.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like