Wednesday 1 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 375 (శ్రీమద్భగవద్గీత: సాంఖ్యయోగం)









అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి  పణ్డితః.

శోకింపన్ దగనట్టి వారి కొరకై శోకించుచున్నావు ! హే
వాకంబేర్పడ బుద్ధివాదముల సంభాషించు చున్నావిటన్ 
నీకీ శోకము నొందగా దగదు విన్మీ ! యర్జునా ! పండితుల్
శోకం బందరు చచ్చినన్ బ్రతికినన్ సుంతైన ధాత్రీస్థలిన్.

 శ్లోకం శ్రీమద్భగవద్గీతకు బీజం లాంటిదని యతీశ్వరులు శ్రీశ్రీశ్రీ విద్యాపరకాశనందగిరిస్వామివారు సెలవిచ్చారు.  ఎందుకనగాగీతాబోధ నిజంగా  శ్లోకం నుండి ప్రారంభమౌతున్నది.  విత్తనం మొలకెత్తిమొక్కైమహావృక్షమై శాఖోపశాఖలుగా నలు దిక్కులా విస్తరించునట్లుగీతాబోధ మున్ముందు కర్మజ్ఞానఆత్మసంయమనభక్తి యోగాలుగా విస్తరిల్లిపరమాత్ముని విభూతిని విశ్వమంతా ప్రసరింపజేసిచివరకు మోక్షసన్యాసయోగంలో అద్వైత సిద్ధిని ప్రాపింపజేస్తున్నది.

శోకసంతప్తహృదయుడైన అర్జునుడికి భగవానుడు చెబుతున్నాడు.

 అర్జునా ! నీవు శోకింపదగనివారికై శోకించావు.  పైగాపండితులు మాట్లాడినట్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.  జ్ఞానులైనవారు మరణించినవారిని గురించి గానిబ్రతియున్న వారి గురించి గాని దుఖింపరు. "

 ప్రపంచములోని ప్రతి పదార్థం ఐదింటితో ఏర్పడుతున్నది.  అవి అస్తిభాతిప్రియనామరూపాలు.  అస్తి (సత్అంటే ఉండటంభాతి (చిత్అంటే ప్రకాశించటంప్రియ (ఆనందంఅంటే అవధులు లేని ప్రేమ.   మొదటి మూడుఅనగా సచ్చిదానందములు భగవంతుని స్వభావములుచివరి రెండుఅనగానామ రూపములు గుణాలు.  అవి మానవుడు తాను కల్పించుకొన్నవి.  కావునఅశాశ్వతముఅస్థిరమైన శరీరం యొక్క క్షీణతనశించటం గురించి జ్ఞానసంపన్నులు దుఃఖించరని భగవానుడు చెబుతున్నాడు.  దుఃఖింప కూడని దానికై దుఃఖించేవారు ' ప్రజ్ఞావాదాంశ్చ భాషణులు ' అంటున్నాడు.  అంటే బుద్ధిని ఆధారంగా చేసుకొని మాట్లాడేవారు.  బుద్ధికి పరిమితులున్నాయి.  అది కొంతదూరం మాత్రమే పోగలదుఅది ఆత్మతత్త్వాన్ని తెలుసుకోలేదు.  అందుచేతబుద్ధివాదం చేయవద్దంటున్నాడు భగవానుడు.

సామాన్య పరిభాషలో ' పండితుడు '  అంటే సమస్తశాస్త్రాలను చదివినవాడుతెలిసినవాడుఅని అర్థం.  కానీఇక్కడపండితు డనగా జ్ఞానిద్వంద్వాలకు అతీతుడు.


ఇది సాంఖ్యయోగం లోని పదకొండవ శ్లోకం.



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like