Saturday 4 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 582 (మా స్వామి: 3)




నీవే రాజువు నేను సత్కవిని దండ్రీ ! నిన్ను వర్ణించెదన్
నీవే దైవమ నేను భక్తుడను దండ్రీ ! నిన్ను ధ్యానించెదన్
నీవే భూమివి నేను గర్షకుడఁ దండ్రీనిన్నుఁ బండించెదన్ 
నా వైదగ్ధ్యము నీవ జూతుకృప సంధానించు విశ్వేశ్వరా !

' మా స్వామి ' లోని మూడవ పద్యమిది.

కవులు రాజుల నాశ్రయించి, వారిని కీర్తించి, అగ్రహారాలు, ధనధాన్యాదులు, సత్కారాలు పొందుతారుఇది లోకసామాన్యమైన విషయం. లౌకికమైన సుఖజీవనానికి కావలసిన సంపదలను ఇచ్చే రాజులు, శాశ్వతానందాన్ని కలిగించే సంపదను ఇవ్వలేరుఅటువంటి శాశ్వతమైన సచ్చిదానందాన్ని ఇవ్వగల రాజు శివు డొక్కడేఅందుకనే, విశ్వనాథ, సత్కవిగా అటువంటి రాజైన శివుని వర్ణిస్తానంటున్నాడుభక్తులకు కొంగు బంగారమైన దేవుడెవరన్నా ఉన్నారంటే అది శంకరుడే. ఆయన భక్తపరాధీనుడుబోళాశంకరుడు. శంకరుని వంటి దైవం లేడని లోక ప్రతీతిఅందుకనే, కవి అటువంటి దైవాన్నే ధ్యానిస్తానంటున్నాడుభూమిని నమ్ముకున్న రైతు, అందులో బంగారాన్ని పండిస్తాడు. ఇది లోకవ్యవహారంఅదే శివుడనే భూమిని నమ్ముకున్న భక్తుడు మోక్షమనే బంగారాన్ని పండించుకుంటాడుభవబంధ విముక్తుడౌతాడుఅంతకంటే, జీవునికి కావలసినదేముందిఅందుకనే, శివుడనే భూమిని నమ్ముకున్న కవితాసేద్యం చేసే కర్షకుడు ఆధ్యాత్మికత అనే బంగారాన్ని పండిస్తానంటున్నాడుఇక చివరగా తన కవిత్వ లక్షణాలను, ప్రతిభను, నేర్పును చూడగలిగిన పరీక్షకుడు ఒక్క పరమేశ్వరుడే నని, అందువలన తన మీద దయ చూపించమంటున్నాడు విశ్వనాథ

పద్యం పరంగా ఒక స్వీయానుభవం ఉందిఅది మీతో పంచుకుంటున్నాను. నేనొక కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిజేస్తున్న రోజులలో, సాహిత్యాభిలాషియైన ఒక మిత్రుడు ఒక మంచి పద్యాన్ని చెప్పమన్నారు పద్యం గుర్తుకొచ్చి చదువుతున్నానుమూడవ పాదం " నీవే భూమివి నేను కర్షకుడ తండ్రీ ! నిన్ను పండించెదన్ " అన్నది చెప్పి, పద్యం పూర్తిచేసేటప్పటికి, మిత్రుడు నన్ను గాఢాలింగనం చేసుకొని, గాద్గదిక కంఠంతో, " ఇటువంటి ప్రయోగం చేసిన కవి సామాన్యుడు కాదు, మహా కవి అయి ఉంటాడని " అన్నాడునేను కవిసమ్రాట్టుల పేరు చెప్పానుఅతడు పులకించిపోయాడు. అదీ, విశ్వనాథవారి కవిత్వానికున్న శక్తి

ఇన్ని విషయాలను అడిగి, ఆర్ద్రతను ప్రకటించిన మిత్రుడు అన్యమతస్థుడన్నది కొసమెరుపు. మహాకవిత్వాన్ని ఆస్వాదించటానికి కులాలు, మతాలు అడ్డురావనటానికి ఇది చక్కని నిదర్శనం.



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like