Saturday 4 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 580 : (మా స్వామి: 1)











శ్రీ మంజూషిక, భక్తరక్షణకళా శ్రీ చుంచు, వానంద
ల్లీమంజుప్రసవంబు, చిద్గగన ప్రాలేయాంశువున్, మోక్ష
క్ష్మీ మాణిక్య వినూత్న మేఖల, కటాక్షీభూత నీహారరుక్
శ్రీమంతం బయి పొల్చు వెలుగు నొకఁడే సేవింతు విశ్వేశ్వరా

పద్యం, ' మా స్వామి ', ' విశ్వేశ్వర శతకం ' అని రెండు పేర్లతో పిలువబడే శతకరచన లోని మొదటి పద్యందీనిని, విశ్వనాథ, తమ బృహద్గ్రంథం, శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో మొదటి పద్యంగా చేర్చారు.

పదకొండవ శతాబ్దానికి చెందిన యథావాక్కుల అన్నమయ్యగారి ' సర్వేశ్వర శతకం ', కృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని ధూర్జటి మహాకవి రచించిన ' శ్రీకాళహస్తీశ్వర శతకం ', కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి ' విశ్వేశ్వర శతకం ', శివభక్తిప్రధాన శతకాలలో అగ్రగణ్యమైనవని నా వ్యక్తిగత అభిప్రాయం

విశ్వనాథవారి విశ్వేశ్వర శతకంలోని పద్యాలు కొన్ని దీర్ఘసంస్కృత సమాసాలతో, నా వంటి వారికి పూర్తిగా  అర్థం కాకుండా ఉంటాయి. ఇబ్బందంతా ఇక్కడే ఉంది. అసలు అర్థం కాకపోతే, ప్రక్కన పెట్టేస్తాముకానీ, తెలిసీతెలియక ఉన్న పరిస్థితిలో, పద్యం యొక్క శబ్దమాధుర్యానికి, కొంచెమో తెలిసిన అర్థగాంభీర్యానికి, ఉక్కిరిబిక్కిరై పోయి, పెద్దల వల్ల ఎప్పటికైనా తెలియకపోతుందా అన్న ఆశతో, చదివిందే పదిసార్లు చదువుతుంటామువిశ్వనాథ వారన్నట్లు, జీవనదులు, మహాపర్వతశ్రేణుల్లో పుట్టి, క్రిందకు మహాప్రవాహంతో జాలువారుతుంటాయి ప్రవాహం నుంచి చిన్న చిన్న పాయలు తీసి, మహాపండితులు, వ్యాఖ్యాతలు లోకానికి అందిస్తారు. పెద్దల వ్యాఖ్యానం నుండి సామాన్య పాఠకులు కొంతో  గ్రహించగలుగుతారు. ఇది నా స్వానుభవం

నేనెన్నో సార్లు అనుకుంటుంటాను. భగవంతుడు నా చేత పొట్టకూటి చదువులు చదివించకుండా, విశ్వనాథవారి ఇంట్లో పనివాడిగా పుట్టించినా, వారి సాంగత్యం చేత ఒకమోస్తరు పండితుడినయ్యేవాడిని కదా ! అని మహాకవి ఆకర్షణ అటువంటిది, వారి కవిత్వము అటువంటిదిఇక ఉపోద్ఘాతం ఆపి, నేను అర్థం చేసుకొన్నంత వరకు, నా ఆత్మతృప్తి కోసం, ' మా స్వామి ' లోని పద్యాలకు వ్యాఖ్యానం వ్రాస్తున్నానువిశ్వనాథవారిపై భక్తిభావం, తెలుగుభాషపై ఎనలేని మక్కువ తప్ప ఇంకొక అర్హత లేని నన్ను మన్నించమని ప్రార్థిస్తున్నాను.

" మంజూషిక అంటే పెట్టె. పూర్వం మన ఇళ్ళలో పెద్ద భోషాణాలుండేవి. ఏంత సామానైనా దాచుకోవచ్చుపరమేశ్వరుడు సంపదల నిచ్చే పెద్ద పెట్టె వంటివాడుఆయనను నమ్ముకుంటే, ఆయనకు మనను అమ్ముకొంటే, ఎంత సంపదనైనా ఇస్తాడు, రకమైన సంపదనైనా ఇస్తాడుభక్తరక్షణకళా శ్రీ చుంచువుభక్తులను రక్షించటమనేది ఒక కళకళలు ఎవరికి పడితే వారికి అబ్బవు. అవి అబ్బాలంటే మంచి హృదయముండాలి. ఇతరులకు మేలు చేయాలనే మంచి మనస్సుండాలి. పరమేశ్వరుడు భక్తులను రక్షించడమనే కళలో నిష్ణాతుడు. అందుకేనేమో, ఆయనకు బోళాశంకరుడని పేరు సార్థకమయిందిఇక్కడ విశ్వనాథచుంచువు ' అనే పదాన్ని వాడారు. దానికి అర్థం నాకు సరిగా తెలియలేదు. చుంచువు అంటే పిల్లజుత్తు అని నిఘంటువు లోని అర్థం. అంటే, శంకరుడు, భక్తులను రక్షించి, వారికి బలాన్ని, శక్తిని, ప్రసాదించే వాడని అన్వయించుకొన్నానుఆనందవల్లీమంజుప్రసవంబు. ఆనందమనే తీగకు పూచిన అందమైన పువ్వు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఆనందమయుడు. ఆనందమే ఆయన స్వరూపం. చిద్గగన ప్రాలేయాంశువు. చిదాకాశంలో వెలసిన కాంతిరేఖ. పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు. మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల. మేఖల అంటే నడుముకు చుట్టుకొనే త్రాడు. పరమేశ్వరుడు మోక్షప్రదాత అని అర్థం. కటాక్షీభూత నీహార రుక్కు. దీనిని రెండు రకాలుగా అన్వయించుకోవచ్చని అనుకుంటానుపరమేశ్వరుడు కటాక్షించి, మనస్సుకు ఆహ్లదం కలిగించే ప్రాభాతతుషారకిరణం వంటివాడు లేక సర్వప్రాణులను కటాక్షించే ప్రాభాతతుషార కిరణం వంటివాడు. నీహార రుక్ అంటే మంచుబిందువుఅటువంటి, శుభములను కలిగించే, వెలుగు రూపాన్ని నేను సేవిస్తున్నాను అని మహాకవి మొదటి పద్యంలో ఆత్మనివేదన చేసుకొన్నారు.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like