Thursday 2 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 575 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: అభిషేక ఖండము)








దశరథపుత్రు నేత్రములఁ దారక లీరిక లెత్తినట్లుగన్
బ్రశమితమై యెదో స్మరణభావము కొట్టినయట్లు తోఁచి ధీ
దశ పులకించి యిట్లనియెఁ దల్లి ! యహల్యకు గౌతమర్షిదే
వి శమితలాలసాహృదయవీధికి నీకును నాత్మ యొక్కఁడా !


సుమంత్రుని వెంట శ్రీరాముడు తండ్రి దశరథుని వద్దకు వెళ్ళాడుకోపగృహంలో, దైన్యస్థితిలో ఉన్న తండ్రిని చూసి మొదట నిర్విణ్ణుడైనా కూడా, ముందుగా తండ్రి పాదాలకు, తరువాత పినతల్లి కైకకు నమస్కరించాడుతండ్రి దుఃఖానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. తనవైపు నుండి ఏదో పెద్ద అపచారం జరిగుంటే గాని, తండ్రి ఇంత దుఃఖానికి లోనవడని, అదేంటో చెప్పమని కైకను వేడుకొన్నాడు   తండ్రి తనకు ప్రత్యక్ష దైవమని, ఆయన ' ' అంటే నిప్పుల్లో దూకమన్నా దూకుతానని, మహావిష సర్పాలున్న చోట నిద్రించమన్నా నిద్రిస్తానని చెప్పాడు.

విధంగా మాట్లాడుతున్న రాముడు, ఒక్కసారిగా కైక వంక చూసాడుఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉండటం చూసి, వారివురికీ తానేమి ద్రోహం చేసాడో తెలియక తల్లడిల్లిపోయాడుఇక కైక, తన గొంతులో నుంచి వస్తున్న దుఃఖాన్ని, కోపావేశాన్ని అదిమిపట్టికొని, " తండ్రి  మాట మీద యౌవరాజ్యపట్టాభిషేకానికి ఒప్పుకొన్న వాడివి, ఇప్పుడు నేను చెప్పేది చేయగలవో లేదో బాగా ఆలోచించి జవాబివ్వ " మని రాముడితో అన్నది

" పినతల్లి కైక మాటలు వినగానే, దశరథపుత్రుడైన రాముడి నక్షత్రాల వంటి కళ్ళు మొలకలెత్తినట్లయ్యాయి. శాంతిభావం వహించిన రాముడి మనస్సుకు ఏదో గుర్తుకొచ్చినట్లుగా అనిపించిందిరాముని హృదయం పులకించిపోయి, పినతల్లి కైకతో, ' అమ్మా ! శాంతరసాధిదేవత, గౌతమమహర్షి భార్య అహల్యాదేవికి, నీకు ఆత్మ ఒక్కటేనా ? " అని అడిగాడు.

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోని యీ సన్నివేశం అద్భుతమైనది

అహల్యా శాపవిమోచనం తరువాత, మిథిలా నగరానికి ప్రయాణమౌతున్న  రాముడిని, తిరుగుప్రయాణంలో మరల ఆశ్రమానికి రమ్మని వేడుకొంటూ, కళ్యాణమూర్తులైన సీతారాముల కోసం నారచీరలు సిద్ధంగా ఉంచుతానని అన్నది.


అహల్య మహాపతివ్రత. ఆమె కౌసల్య, అరుంధతుల కోవకు చెందినదని రాముని భావన. అప్పుడు అహల్య మాటలు, ఇప్పుడు కైక మాటలు, సర్వ దేవతల, ఋషుల భావాలు, అన్నీ  తూకం తూచినట్లుగా సరిపోతున్నాయని భావించిన రాముడు, పినతల్లి మాటలతో పులకరించిపోయాడురాముని అవతార లక్ష్యం రాజ్యాల నేలటం కాదు గదా !


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like