Friday 3 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 576 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)










ముదురు తొండ యొకఁడు ముంగాళ్ళపై నిక్కి
నిశ్చలంబుగాఁగ నిలచియుండి
కాళ్ళ నడుమనుండి కధలు చీమలబారు

చెదురు చీమలను గ్రసించునట్లు.

విశ్వనాథ సత్యనారాయణగారి బృహద్గ్రంథం శ్రీమద్రామాయణ కల్పవృక్షములో ప్రధాన కథలకు అనుసంధానంగా ఎన్నో చిన్న కథలను చెప్పారుఇందులో, ఒక్కొక్క కథ చెప్పే తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది

అరణ్య కాండములోని వాతాపి ఇల్వలుల కథను సీత చేత చెప్పించారు విశ్వనాథ. అయితే, కథలు చెప్పటానికి ముందు, దానికి పూర్వరంగాన్ని నిర్మించటం విశ్వనాథ రచనలోని  కథాకథన శిల్పరహస్యం

సుతిక్ష్ణుని ఆశ్రమం నుండి అగస్త్యాశ్రమం వైపు బయలుదేరారు సీతారామలక్ష్మణులుమార్గమధ్యంలో, ఒక పాము శరీరం మీద కాలువేసి త్రొక్కిపట్టి, పడగపై ముక్కుతో పొడుస్తున్న నెమలిని సీతకు చూపించాడు రాముడు. దానిని ఆధారంగా చేసుకొని, " ఎంత కష్టం వచ్చినా కూడా, ఎదిరించగల ప్రతిభ ఉన్నదని, కష్టాలను ఎవరైనా కొనితెచ్చుకుంటారా? లోకకళ్యాణం కోసం అగస్త్యుని వంటి మహాత్ములు పనిని ఎలాగూ మానరు. అటువంటివారి వల్లనే కదా లోకాలు కష్టాలు తీరి సుఖపడుతున్నాయి. " అని సీత రాముడితో అన్నది

" మన సుతీక్ష్ణులవారి ఆశ్రమంలో ఒక గున్న మామిడి చెట్టు మొన్న పూతకొచ్చిందే ! , దాని ప్రక్కనున్న పర్ణశాలలో ఉంటున్న వృద్ధగార్గేయి నాకు ఒక కథ చెప్పిందిఅది నీకు చెప్పనా? " అని సీత రాముడిని అడిగిందిరాముడు చెప్పే కథేమిటో తెలియాలి కదా అన్నాడు. అది ప్రసంగసాధువుగా ఉన్న అగస్త్యుడి కథ అనీ, వృద్ధగార్గేయి చెప్పినట్లుగానే చెబుతాననీ అన్నది. కథ సమయంలో వినాలని లేదని రాము డనగా, కథ చెప్పాలన్న కుతూహలంతో ఉన్న సీత, " సరే లక్ష్మణుడు వింటాడులెండి " అని, కథ చెప్పడం మొదలుపెట్టింది.

సీత కథ చెప్పటం ఎలా మొదలుపెట్టిందిబాగా ముదిరినటువంటి తొండ ఒకటి ముందుకాళ్ళపై నిల్చొని, నిక్కి చూస్తూ, దాని కాళ్ళ సందుల్లో నుంచి బారుగా వెళ్తున్న చీమలదండులో నుంచి చెదిరినటువంటి చీమలను పట్టుకొంటున్నట్లుగా, ఒకడు అరణ్యంలో ఒంటరిగా వేళ్తున్న బాటసారులను అన్నానికి పిలిచి, వారిని చంపి దొంగతిండి తింటున్నాడట.

పద్యంలో సీతారాముల మధ్య జరిగిన సంభాషణ, చెప్పబడిన ఉపమానం, వాతాపి ఇల్వలులతో ముడిపడి ఉన్న అగస్త్యుని కథకు పూర్వరంగంగా విశ్వనాథ అద్భుతమైన కల్పన చేశారువిశ్వనాథ కథలు చెప్పే పద్ధతిలో విధంగా పూర్వరంగాన్ని కల్పించటం ఒక ప్రత్యేకత. దానివలన, కథలకు సహజత్వం, బిగువు, సమకూరుతాయి.

పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.




No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like