Wednesday 1 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 372 (శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద: షష్ఠాశ్వాసం)










కల డొకరుండు పేరుకొన గాని కులంబు మదీయ భక్తు డి
య్యిల మును వాడు వామనత నే వసియించిన పుణ్యభూమి నం
దుల కొక యోజనత్రయపుటూర వసించిబ్రాహ్మవే
ళల జనుదెంచిపాడు మము లాలస మంగళ నామ కైశికిన్.

సంభాషణాప్రాధాన్యత కలిగిన  పద్యంలోఅర్థాన్ని అన్వయించుకొనడానికి వాక్యనిర్మాణం ఒక క్రమంలో లేదుఅయితేకృష్ణదేవరాయల ప్రౌఢమైన శైలికి భిన్నంగాపద్యం సరళంగాసుందరంగా ఉంది.  భగవంతుడైన మన్నారుస్వామి విష్ణుచిత్తునితో చెబుతున్న మాటలు ఇవి.

నా భక్తుడొకడు చెప్పరాని కులంలో పుట్టాడు.  అది ఇక్కడకు మూడు కోసుల దూరంలో ఉంది.  అది నేను వామనావతార మెత్తినప్పుడు నివసించిన పుణ్యభూమిఅతడు  గ్రామంలో ఉంటూరోజూ  తెల్లవారుజామునే వచ్చి మంగళకైశికి గానంతో నా పాటలు పాడేవాడు. " 

పద్యం మొదటిపాదంలోని మూడు విరుపులు పద్యానికి ఒక చెప్పలేని అందాన్ని తెచ్చాయని ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర్రావుగారు విశ్లేషణ చేశారు.   మూడు విరుపులుబ్రాహ్మీముహూర్తాన్ని ధ్వనించే మువ్విరుపుల కోడికూతలాఏమో

పద్యం సాధారణంగా కనిపిస్తున్నాదీనిలో ఆనాటి వర్ణవ్యవస్థచారిత్రకాంశాలు నిక్షిప్తమై ఉన్నాయి.

పేరుకొన గాని కులంబు ' అనగా పంచమకులం.  దీనిని బట్టి అప్పుడు అంటరానితనం బాగా ఉన్నదని అర్థమౌతున్నది.  విష్ణుమూర్తితనకు భక్తుడైన పంచముని గురించి చెప్పింది  సద్బ్రాహ్మణుడైన విష్ణుచిత్తునితో.  దీనిని బట్టిపరమాత్ముని చేరడానికి భక్తి ముఖ్యం గానికులప్రాధాన్యత లేదని సుస్పష్టమౌతున్నది.

శ్రీవైష్ణవులకు అతిపవిత్రమైన 108 దివ్యతిరుపతులలో ఒకటైన ' కురుంగుడి ' అనే పుణ్యక్షేత్రంవామనమూర్తి నివసించిన ప్రదేశం అని భక్తుల నమ్మకం.

ఇక చరిత్ర ఆధారంగాశ్రీవైష్ణవంవీరశైవంమహారాష్ట్రలోని భక్తుల కథలు పరిశీలిస్తేకడగొట్టు జాతిలో పుట్టినవారు మహాభక్తులై భారతీయ భక్తి తత్త్వానికి ఊపిరిపోయడం మనందరికీ తెలిసిన సత్యమే.

 పద్యం శ్రీకృష్ణదేవరాయలచే రచింపబడిన ' ఆముక్తమాల్యద ' షష్ఠాశ్వాసంలో ఉంది.



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like