Monday 6 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 592 (మా స్వామి: 13)











అంతా వ్యర్థము వట్టి యాశ, పెను మాయావల్లి, దివ్యంబు సీ
మంతిన్యర్థము నీదు మూర్తి యొకఁడే మా తండ్రి ! నిక్కంబు నా
కింతా తోఁచియు నీ మహార్థ మెపుడేనీ రూఢి కాలేదు శా
మంతీకుట్మలవత్సుధాకరశిరోమాణిక్య ! విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి ' శతకం లోని పదమూడవ పద్యం

ఇందులో మనముంటున్న దృశ్యమాన జగత్తు ఎంత అశాశ్వతమో, గడుపుతున్న సంసార మెంత సారవిహీనమో తెలుపుతూ, తత్త్వాన్ని బోధించమని పరమేశ్వరుణ్ణి వేడుకొంటున్నారు విశ్వనాథ.

" ప్రపంచంలో మనం చేసేదంతా వ్యర్థంఅది చేద్దాం, ఇది చేద్దాం అనే ఆశ, మనిషిని పట్టి కుదిపేస్తూ ఉంటుంది ఆశతో, మాయ అనే పెద్ద వలయంలో చిక్కుకుపోతున్నాడు జీవుడుమాయ కల లాంటిదిఅది నిజం కాదు. కల లాగా కరగిపోతుంది. మరి యదార్థ మేమిటిఅర్థనారీశ్వరస్వరూపంలో నీదైన దక్షిణ భాగంఅర్థనారీశ్వర రూపంలో, నీ తలపాపట లోని సగమైన  నీ దివ్యతత్త్వం. నీ యదార్థ రూపం, తెలిసి కూడా, నీ రూపం వెనుక దాగి ఉన్న మహార్థం, మహా తత్త్వం నాకింకా రూఢి  కావటం లేదు. అమృతాంశుడిని శిరోరత్నంగా ధరించి, లోకానికి శాంతిని ప్రసాదించే విశ్వేశ్వరా ! నాకు నీ తత్త్వాన్ని బోధించు. "

అర్థనారీశ్వరునిలో, దక్షిణ భాగం పరమేశ్వరుడు, వామభాగం ప్రకృతిస్వరూపిణి పార్వతి. తలపాపిట నుండి దక్షిణపార్శ్వం అయ్యవారిది. తత్త్వప్రధానమైనది అయ్యవారి స్వరూపంమోహింపజేసే మాయస్వరూపిణి అమ్మవారు. అందువల్ల, మోహింపజేసే దృశ్యమాన జగత్తు నుండి విముక్తుడై తత్త్వస్వరూపుడైన భగవంతుడిని దర్శించటమే మహార్థముకానీ, అది తెలుసుకొనటం అంత సులభం కాదు. అందుకే, " మహార్థ మెపుడేనీ రూఢి కాలేదు " అనటంఅది రూఢి కావాలంటే, ' శామంతీకుట్మలవత్సుధాకరశిరోమాణిక్య " విశ్వేశ్వరుడి అనుగ్రహం కావాలి.

విశ్వనాథవారు పరమేశ్వరుని పరంగా వాడే విశేషణాలు చాలా లోతైన అర్థం కలిగి ఉంటాయిపరమేశ్వరుడు ' సుధాకరశిరోమాణిక్యం ' తలపై కలవాడుచంద్రుడు అమృతకిరణాలను విరజిమ్మేవాడు. అటువంటి అమృతాంశుడిని తలపై ధరించి, అరమూసిన/అరవిచ్చిన కళ్ళతో ధ్యానసమాధిలో కూర్చొని, లోకానికి శాంతిని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like