Monday 13 April 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 297 (తిక్కన భారతము: ఉద్యోగపర్వం: ద్వితీయాశ్వాసం)

కోపము, నుబ్బును, గర్వము
నాపోవక నునికియును, దురభిమానము, ని
ర్వ్యాపారత్వము నను నవి
కాపురుషగుణంబు లండ్రు కౌరవనాథా

శ్రీమదాంధ్ర మహాభారతము, ఉద్యోగపర్వం, ద్వితీయాశ్వాసంలోని పద్యం విదురనీతిలో భాగం.

కాపురుషులు అంటే చెడ్డవారు. చెడ్డవారి లక్షణాలను గురించి విదురుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు.

విదురుడు ముందు కోపాన్ని గురించి చెప్పాడుఇది అరిషడ్వర్గాల్లో ఒకటిఇది మనిషి లోపల నున్న శత్రువుకోపం చాలా చెడ్డదికోపం వల్ల విచక్షణాజ్ఞానం పోతుందిమంచిచెడుల విచక్షణ కోల్పోతే మనిషి పశువుగా మారతాడు. ఇది తనకే గాక, సమాజానికి కూడా చాలా ప్రమాదం.

రెండోది, ఉబ్బుఉబ్బు అంటే పొంగిపోవడం.   సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు క్రుంగిపోవడం ధీరుల లక్షణం కాదుఅది అల్పమానవులు చేసే పని. భగవద్గీత కూడా 

దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగ భయక్రోధో స్థితధీ ర్ముని రుచ్యతే.-------- అంటుంది.

మూడవది, గర్వంగర్వం మనిషి పతనానికి దారితీస్తుందిమహానుభావులైన యయాతి, నహుషుడు వంటి వారు గర్వంతో మిడిసిపడి విధంగా పతనమయ్యారో మనం పురాణాల్లో  చూసాము.

సంతృప్తి లేకపోవడం కూడా దుర్గుణమే. ఉన్నదానితో తృప్తి పడుతూ, ఇతరులకు ఉన్నంతలో సాయపడటం మానవుని కర్తవ్యంసంతృప్తి లేని మనుజుడికి సప్తద్వీపాలు కట్టబెట్టినా కూడా ఆనందంగా ఉండడని పెద్దలు ఎబుతుంటారు. ప్రతిభాతో పైకి వచ్చి సమాజానికి ఉపయోగపడాలి కానీఅందని మావిపండ్లకు  అర్రులు చాచకూడదు.  

అభిమానం మంచి లక్షణమయితే, దురభిమానం చెడ్డ లక్షణందుర్యోధనుడు దురభిమానిఅందుకనే చెడిపోయాడుదురభిమానంతో దుష్టుల మాట విని చెడిపోయాడుసజ్జనులైన భీష్మాదుల మాట వినక చెడిపోయాడు. " చెబితే వింటివ గురూ గురూ, వినకే చెడితిర శిష్యా శిష్యా! " అన్నది  ఎక్కడ చెప్పినా, నిజమే కదా!

చివరగా, నిర్వ్యాపారత్వంఅంటే, సోమరితనం. సోమరులు, అంటే, పనీపాట లేకుండా, ఆంబోతుల్లా ఊరిమీద పడి తిరిగేవారుఇటువంటివారుకుటుంబానికే గాక, సంఘానికి, దేశానికి ప్రమాదకారులుసోమరితనం ఒక అంటువ్యాధి వంటిదిఅటువంటి చీడపురుగులకు దూరంగా ఉండాలి.

దుర్యోధనుడి దుష్టత్వాన్ని, ధర్మరాజు మంచితనాన్ని మనసులో పెట్టుకొని అప్పుడు చెప్పిన విదురనీతులు ఇప్పటి  సమాజానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like