Wednesday, 20 May 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 435 (శ్రీమద్భగవద్గీత: సాంఖ్య యోగం: శ్లోకం:16)













నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత
ఉభయోరపి  దృష్టోన్తస్త్వనయో స్తత్త్వదర్శిభిః ||

లేని దానికునికి లేనె లేదిలలోన
నున్న  దానికి లేమి యెన్న లేదు
ద్వయంబు  తత్త్వ మెఱుగ గల్గినయట్టి
తత్వవిదులచేత దర్శితంబు.

లోకంలో అసద్వస్తువు, సద్వస్తువు అని రెండు రకాల వస్తువులను గురించి చెప్పుకుంటుంటాము. అసద్వస్తువు అంటే లేనిది, నశించేది. ఏదైతే పుడుతుందో, అది తప్పక నశిస్తుందిశాస్త్రవిజ్ఞానం కూడా దీన్ని ధృవీకరించిందిఇక సద్వస్తువుకు అంటే " ఉన్నది " , నాశనం లేనిదిఅదే ఆత్మపదార్థం రెండింటి యొక్క యదార్థ స్వరూపం తెలిసినవాడు " తత్త్వదర్శి " ,  జ్ఞాని.

విషయాన్ని భగవానుడు చెబుతున్నాడు.

" లేని దానికి ' ఉనికి ' ,  ఉన్నదానికి ' లేకుండటం ' లేదు. రెండింటి యొక్క వాస్తవ స్వరూపం ఒక్క జ్ఞానికి మాత్రమే తెలుసు. "

కనపడే ప్రపంచంలోని ప్రతి వస్తువూ నశించేదేకాబట్టి, అనిత్యములైనటువంటి వానిని ఉన్నాయనుకోవటం అజ్ఞాన మనిపించుకుంటుందిఇక ఏదైతే నిత్యమైనదో, దేహంతో పాటు నశించదో, అదే ఆత్మపదార్థం అనేదిఅటువంటి ఆత్మకు లేకపోవడ మనేది లేదని భగవానుడు చెబుతున్నాడు. నిత్యమైన దానిని లేదనుకోవటం కూడా అవివేకమే నిత్యానిత్య వివేచన కలిగినవాడు తత్త్వదర్శనుడు, యదార్థ వస్తుస్వరూపం తెలిసినవాడు. వానిని మనం జ్ఞాని అని పిలుస్తాం.

శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు " తత్త్వదర్శి " కి " తత్త్వవాది " కి ఉన్న తేడాను చక్కగా విడమరిచి చెప్పారుతత్త్వదర్శి యదార్థజ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూసినవాడువారే ద్రష్టలు. తత్త్వవాదులు ఊరకే నోటితో చెప్పేవారుతత్త్వదర్శినులకు నిత్యానిత్యవస్తు పరిజ్ఞానం బాగా ఉంటుంది. విషయాన్ని భగవానుడు " ఉభయోరపి (రెండింటి యొక్క) అన్న పదప్రయోగం ద్వారా విడమరిచి చెప్పాడు.

శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాల వంటి వాటికి అతీతంగా ఉండే సమదర్శినులే తత్త్వదర్శినులని భగవానుని భావం.

శ్రీమద్భగవద్గీత, సాంఖ్యయోగం లోని  పదహారవ శ్లోక మిదిశ్రీ లొల్లా సుబ్బరామయ్యగారు దీనికి తెలుగులో పద్యానువాదం చేసారు.



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like