Friday 26 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 559 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)





  





కృతసంస్మేరుఁడు రామచంద్రుఁడనె సుగ్రీవా ! మఱిన్ జీవి సం
స్కృతి చిత్రంబగు మూలభూతమగు దుష్కృత్యంబు ప్రాణంబు నం
దతుకున్ బ్రాణియొనర్చు సర్వమగు కార్యంబందు దీపించు బో
కృతులౌ మౌనులు సూక్ష్మదర్శులును దర్శింపంగ మూలాఘమున్.

మఱియును నవ్వి శ్రీరఘుకుమారకమౌళి ధనుర్దరిద్రమీ
ధరణి మహావిచిత్రముగదా యిది మీకును వాలి  నేర్పటం
చురవడి నమ్ముదూసి పతి యొక్కటి చిత్రవిచిత్రవేగ బం
ధురతర తీవ్రచంక్రమణ ధూననవైఖరి నేసినంతటన్.

ఒక విచిత్రమైన ఖడ్గక కేళియో యనంగ
ఫుల్లపత్రావళిన్ దుల్చి బోద నఱకి
తీవ్ర ఝంఝా మహామరుత్ప్రేరకముగ
నావెనుక ధాత్రి పెకలిచి యమ్ముతూఱె.

 సుగ్రీవునితో మైత్రీబంధం ఏర్పడిన తరువాత, వాలిని సంహరించి, వానరసామ్రాజ్యానికి అతడిని రాజును చేస్తానన్నాడు రాముడుఅయితే, వాలి బలపరాక్రమాలు తెలిసిన సుగ్రీవుడికి, రాముడి మీద ఇంకా నమ్మకం కుదరలేదువాలి విధంగా ఒక్కొక్క బాణంతో తాటిచెట్టు ఆకులను దులిపివేశాడో చెప్పి, దానికి గుర్తుగా ఏటేటా జరిగే సప్తతాళ మహోత్సవాల గురించి తెలియజేశాడురాముడు చిరునవ్వు నవ్వి, సుగ్రీవునితో విధంగా అన్నాడు.

" సుగ్రీవా ! జీవుని యొక్క సంసార లక్షణం చిత్రంగా ఉంటుందివాడొక దుష్కృత్యం చేశాడనుకోమూలకారణమైన చెడ్డపనికి వాడి ప్రాణానికి లంకె ఉంటుంది. ఇక ప్రాణి చేసే మొత్తం పని దుష్కృత్యంలోనే తెలుస్తూ ఉంటుంది. ద్రష్టలు, లోతుగా విషయ వివేచన చేయగలిగిన మునులకు మూలహేతువైన పాపం తెలుస్తుంది. "

 రాముడు చిరునవ్వు నవ్వుతూ మళ్ళీ ఇలా అన్నాడు.

" భూమి మీద చాపవిద్యా కౌశల్యానికి దరిద్రం పట్టుకున్నట్లుందిఇది విచిత్రం కదా ! వాలి చేసిన సప్తతాళభంజనం చాలా గొప్ప దాని మీరనుకుంటున్నారు. " 

అని మాట్లాడుతున్నవాడు మాట్లాడుతూనే, అమ్ములపొదిలో నుంచి ఒక బాణం తీసి, చిత్రవిచిత్ర వేగంతో, చంక్రమణలు చేస్తూ, విభిన్నమైన రీతిలో దూసుకొంటు వెళ్ళేలాగా, బాణాన్ని సంధించాడు.

ఖడ్గవిద్యానిపుణుడు విచిత్రంగా కత్తిని ఝళిపించినట్లు, ఏడు తాడిచెట్ల ఆకుల నన్నిటినీ దులిపి, బోదలను నరికి, తీవ్రమైన గాలి చేత ప్రేరేపింపబడినట్లు, భూమిని పెళ్ళగించి, బాణం చొచ్చుకుపోయింది.

రాముడు చేసిన అద్భుతమైన ధనుర్విన్యాసాలలో, సప్తతాళభంజన మనేది ఒకటి.  

 ధనుస్సు యొక్క మధ్య భాగాన్ని లస్తకం అంటారు ధనుర్ధారి అయినా, లస్తకం నుండి బాణాన్ని సంధిస్తాడుకానీ, రామునికి ధనుస్సులోని భాగమైనా లస్తకమేకోదండములోని మూల నుండైనా బాణాన్ని సంధించి, లక్ష్యాన్ని ఛేదించగల, జగత్తులోని ఏకైక ధనుర్ధారి రాముడుఅందువలననే కోదండరాముడనే మాట ఆయన ఎడలనే సార్థకమయింది..

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండము లోనివి.







No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like