Monday 8 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 507 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: ఇష్టి ఖండము)




తన గొంతులోన నూఁగు నినాదముల పూర్వనినదితంబులు వచ్చి నిట్టపొడిచి

తన గుండెలోన డాఁగిన మెత్తనగుచోట్లు భావరూపము లంది పైకి వచ్చి
తన సృష్టిలోన నుండిన క్రొత్త మాధుర్య సీమలు క్రేళ్ళుగాఁ జెంగలించి
తన యాత్మఁ దానెఱుంగని యొక్క యానందపరిధి రేఖా స్వయం వ్యక్తి కలిగి

కనుఁగొలుకులందుఁ గన్నీళ్ళుగార్చి మై
గుర్పొడువఁ దనదేహ మా క్రొత్తబిగువు
లెచటదెచ్చొనొ యని కనులింతగను
వచ్చి చూచుచు మునికుఱ్ఱ బిగువు చెడియె.

ఋష్యశృంగుడు విభాండకుని కొడుకు.   తండ్రి అతడిని స్త్రీపురుష భేదం తెలియకుండా పెంచాడుఅతడికి అగ్ని, తండ్రి - వీరిద్దరే ప్రపంచంఅడవిని దాటి అత డెప్పుడూ బయటికి పోలేదుఅటువంటి ఋష్యశృంగుడిని అంగదేశానికి తీసుకువస్తే కానీ, అక్కడి దుర్భిక్ష పరిస్థితులు చక్కబడవని పురోహితులు చెప్పారుఋష్యశృంగుడిని, అతడి తండ్రి కన్ను గప్పి తీసుకు రావటం కష్టసాధ్యమైన పని సంగతి తెలిసి ఋష్యశృంగుడిని తీసుకు రావటానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు, కొందరు వారకాంతలు, దేశక్షేమాన్ని కోరి, ఋష్యశృంగుడిని తీసుకురావటానికి నడుం కట్టారువారు అరణ్యంలో ఋష్యశృంగుడు ఉండే చోటికి కొంచెం దూరంలో కుటీరాలు నిర్మించుకొని నృత్య, గాన, వినోదాలతో కాలం గడపసాగారు

ఇలా ఉండగా, ఒకరోజు తండ్రి అడవిలో చాలా దూరం పోయినప్పుడుఋష్యశృంగుడు వారకాంతలు విడిది చేసిన సమీప ప్రాంతానికి వచ్చాడు. అదే సరైన సమయమని భావించి, వేశ్యలు గొంతెత్తి పాడుతూ, వీణ వాయిస్తూ, నృత్యం చేయసాగారు.   అప్పుడు ఋష్యశృంగుని అంతరంగంలో జరిగిన కదలికలను విశ్వనాథ అద్భుతంగా చూపించారు.


" తన గొంతులో ఎన్నో మధురగీతాలు దాక్కొని ఉన్నాయిఇప్పుడు వీరి గానాన్ని వినగానే, అవి వెలుపలికి పొడుచుకొని వచ్చాయితన హృదయంలో గానానికి, నృత్యానికి స్పందించే ఎన్నో మెత్తనైన చోట్లున్నాయివీరి నృత్యాన్ని చూడగానే, అవి భావరూపంలో పైకి వచ్చాయితన జీవలక్షణంలో ఎన్నో మధుర సీమలున్నాయిఅవి ఇప్పుడు ఆనందం రూపంలో పైకుబికి, తన ఆత్మను తాకుతున్నాయితనలో దాగి ఉన్న సాత్విక భావాలన్ని ఒక్కసారిగా పైకి వచ్చాయిఋష్యశృంగుడు భౌతిక పరిధులను దాటి ఒక అలౌకికమైన స్థితి లోనికి వెళ్ళాడుతెలియకుండానే ఋష్యశృంగుని కనుకొలకుల్లో నీళ్ళు తిరిగాయితన దేహంలో యీ క్రొత్త మార్పులెలా వచ్చాయోనని, కళ్ళు ప్రత్తికాయల్లగా చేసుకొని చూస్తున్న, కుఱ్ఱమౌని అదివరకున్న బిగువు కోల్పోయాడు. "  

విశ్వనాథ యొక్క ఋష్యశృంగుడు మనవలె ప్రపంచానికి చెందినవాడే. అయితే అతని జీవసంపుటిలో ఒక దివ్యమైన సంస్కారం దాగి ఉంది. ఎప్పుడైతే వారకాంతల మధుర గానాన్ని, కనులవిందుచేసే నృత్యాన్ని చూశాడో, అతని లోని ఉత్తమసంస్కారం ఆనందం రూపంలో బయటికి వచ్చి, అతడిని అలౌకికమైన బ్రహ్మానంద స్థితికి తీసుకువెళ్ళింది.

విశ్వనాథవారి ఋష్యశృంగుని పాత్రచిత్రణ దానికదే ఒక మాధుర్య కావ్యం.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like