Tuesday 16 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 536 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము:యుద్ధ కాండము: సంశయ ఖండము)











దొంగతనంబుగా నిటకు దొయ్యలిఁ దెచ్చిన నీకునెంచగా
సంగరనీతిపద్ధతికిఁ జాలినయోగ్యత లేదుగాని యీ
ముంగిలి నిల్చి దుర్గమును ముట్టడి వేసిన నాకు యుద్ధ నీ
తిం గొని నీకుఁ గార్యపుగతిన్ వచియించుట ధర్మమై చనున్.

ఇప్పుడు వచ్చి నీదుసతి నిచ్చెద నన్ను క్షమింపు మంచునుం
జెప్పిన నేను బోరు విరచించక ముట్టడి నెత్తివేసి పో
నొప్పుదు నంచుఁ జెప్పుటయుఁ నూరక చెప్పుట, నీవు రావు, రా
నప్పుడు రావటం చెఱిఁగి యాడుట యూరక నాల్కయాడుటే.

 దైవాధీనము విజయము,
దైవంబన వేఱలేదు ధర్మము న్యాయ్యం
బేవో పూజలఁదనిసెడి
దైవం బొక ధర్మబుద్ధి తాల్పించుటకై.


అంగదుడు వానరసామ్రాజ్యానికి యువరాజుపినతండ్రి సుగ్రీవుని నెయ్యం కంటే, మేఘవర్ణుడైన శ్రీరామచంద్రునికి భక్తిభావంతో ఎక్కువగా వశుడైనవాడు. అటువంటి అంగదుడిని రావణుడి వద్దకు రాయబారిగా  సుగ్రీవుడు పంపాడురావణుడు మంత్రులతో  కొలువున్న సమయంలో, అంగదుడు అక్కడకు వెళ్ళాడు. తాను రాముని దూత అంగదుడిననీశ్రీరాముడు పంపగా వచ్చాననీ చెప్పాడు.

అంగదుడు శ్రీరాముడి మాటలను  యధాతథంగా ఇలా చెప్పాడు.

" దొంగతనంగా నా భార్యను  ఇక్కడకు తెచ్చిన నీకు నిజానికి యుద్ధనీతి పద్ధతిని పాటించే యోగ్యత లేదు. అయినప్పటికీ, లంకకు సైన్యంతో వచ్చి, నీ దుర్గాన్ని ముట్టడి చేసిన నేను, యుద్ధనీతి ననుసరించి, నీకు ఉచితమార్గాన్ని చెప్పటం, ధర్మమని భావించి చెబుతున్నాను.

నిన్ను వధించి, నీ తమ్ముడు విభీషణుడిని దైత్యసామ్రాజ్యానికి రాజును చేస్తున్నందుకు నీ ప్రేతాత్మ దుఃఖించకుండా, నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినునేను చెప్పినట్లుగా, దానవసామ్రాజ్యలక్ష్మి ధర్మాభిరతుడైన విభీషణుడి చేతిలో క్షేమంగా ఉంటుంది.

నీ వంటి దుర్జనశేఖరుడు మంచి మాటనేది వినడుఅట్లా అయినా కూడా, సపుత్రబాంధవంగా నిన్ను వధించకుండా, నేను నీతో రాయబారం జరుపుతున్నానంటేమర్యాదామార్గంలోతప్పు సరిదిద్దుకొన్నవాడిని  రక్షించటం ధర్మం కనుక, విధంగా చేశాను.

ఇప్పుడు నువ్వు వచ్చి, నా భార్యను అప్పగిస్తున్నాననిక్షమించమని అడగటం, నేనేమో యుద్ధాన్ని విరమించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతానని చెప్పటం, ఏదో మాటవరసకు ఊరకే చెప్పటం తప్పితే, నీ మూర్ఖత్వానికి, నీ కున్న గర్వానికి నువ్వట్లా  రానే రావని నాకు తెలుసు. నువ్వు రానప్పుడు, రావని తెలిసి కూడా, నేను మాట్లాడటం, ఊరకే నాలుక ఆడించటం తప్పితే ఇంకొకటి కాదు

ఇంకొక విషయం. యుద్ధంలో గెలుపనేది దైవాధీనం. దైవమంటే ఎక్కడో వేరుగా లేదు. ధర్మం, న్యాయం అనేవే దైవమంటేఇక మనం చేసే పూజలను దైవం స్వీకరించటం 
 ధర్మబుద్ధి కలిగించటానికే. "


అంగద రాయబారం, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనిది








No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like