Wednesday 3 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 484 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధరంగంలో కాండము: సంశయ ఖండము)
















కూడి మును హనుమ కూర్చున్న చోటనే
కోరి హంస వచ్చి కూరుచుండె
హంసఁ గాంచినంత నవనీజ గుండెలో
 నమృతకుల్య యుబ్బినట్లు తోఁచె.

మానసమందు లజ్జవడి క్ష్మాసుతచూచెను  హంస దిక్కునన్
జానకిలో నదొక్క నిముసంబున గాఢ సమాధి పొల్చినన్
దానల యీశ్వరేశ్వరియుఁ దాను సనాతని యంచుఁ దోచినన్
జానకిదేవి క్రీఁబెదవి చాయలఁ జిర్నగ వంకురించినన్.

చిఱునవ్వు నవ్వనినయట్టులు లే దతిలోక మోహ
నంబై  చెలువారు  మోహనత యన్నదలౌకికమై సురారి దృ
గ్రోచులు మందగించినవి, గుండియ యాగినయట్టులై త్రియా
మా చర సార్వభౌమునకు మానసమంతయుఁ గోపమై చనెన్.


రావణుని సేనానులలో విద్యున్మాలి అని ఒక మహా మాయావి ఉన్నాడు. అతడు కల్పించిన, రక్తంతో తడిసిన రామలక్ష్మణుల మాయాశిరస్సులను, ధనుర్బాణాలను రావణుడు సీతకు చూపించాడుదుఃఖిస్తున్న సీతకు ఇంతలో చెట్టుపైన రాజహంస కనిపించిందిరాజహంస లంకలోని అశోకవనంలో ఒక చెట్టుకొమ్మ పైన, సీతాన్వేషణకు వచ్చినప్పుడు హనుమ ఎక్కడ కూర్చున్నాడో సరిగా  అక్కడే కూర్చున్నదిరాజహంసను చూడగానే సీత హృదయంలో అమృతపు మడుగు ఉబికినట్లయింది.

హంస, రామలక్ష్మణులు సమస్త వానరసైన్యంతో లంకకు చేరిన సంగతిని, రాముని చేతిలో రావణునితో పాటు రాక్షస సంహారం తథ్యమని చెప్పి ఊరట కలిగించిందికొంతసేపటికి, విద్యున్మాలికృత మాయాశిరస్సులు, ధనుర్బాణాలు మాయమయ్యాయి. రావణుడు వికవికా నవ్వి ప్రేలుతూనే ఉన్నాడురావణునికి, హంస రాముని వద్ద నుండి సందేశాన్ని మోసుకు వచ్చిందని అర్థమయిందికపటి అయిన రావణుడు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడుసీత మూర్ఛపోయినప్పుడు ఆమెకు రాముని మీద కొంత ప్రేమ ఉందేమోనని అనుకున్నాడని, కానీ ఇప్పుడు మూర్ఛ నుండి తేరుకొనడం వల్ల, మిగిలి ఉన్న భోగవాంఛలను తీర్చుకోవాలన్న ఆమె అంతర్గత భావం అర్థమయిందనీ, యుద్ధంలో రాముడిని చంపి, భోగవాంఛలకు పరిపూర్ణత కలిగిస్తానని, ప్రేలాపలనాడాడు రావణుడు.  

ప్రేలాపనలకు మనసులో సిగ్గుపడి, సీత హంస కూర్చున్న వైపు చూసింది చూసిన ఒక్క క్షణంలో తాను సమాధి స్థితిలోకి వెళ్ళినట్లనిపించి, అందులో తాను పరమేశ్వరి అనీ, సనాతని అని అనిపించింది. భావం రాగానే, ఆమె క్రింది పెదవి మీద చిరునవ్వు అంకురించింది.

చిరునవ్వు, నవ్వులాగా లేదుఅది అతిలోకసుందరంగా ఉంది. సౌందర్యం అలౌకికమై, రావణుని దృష్టిని హరించివేసిందిఒక్కసారి రాక్షస సార్వభౌముడి గుండె ఆగినట్లయి, అది కోపంగా మారింది. "

రాజహంస రూపంలో వచ్చిన పరమేశ్వరుని దర్శనం కాగానే, సీతకు సమాధి స్థితి కలిగింది. అందులో, ఆమె సాక్షాత్తు పరమేశ్వరి అని, దేశకాలాతీతురాలని  అనిపించింది. శ్రీమహాలక్ష్మి, మహాసరస్వతి, మహేశ్వరి రూపాలు పరమేశ్వరి యొక్క స్వరూపమే. భావం కలుగగానే, ఆమె ఇప్పటి స్థితి తళుక్కున స్మృతిపథంలో మెరిసి, ఆమె చిరునవ్వు నవ్వింది చిరునవ్వు వెనుక రావణునికి అర్థం కాని నిగూఢవ్యూహం దాగున్నదా

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనివి.





No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like