Friday 12 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 522 (కల్పవృక్ష ఖండాంత పద్యాలు: అయోధ్యా కాండము: అనసూయ ఖండము)





ప్రోవౌ సర్వకవిత్వ మర్మవిదుడన్ భూభృత్సుతానాయక
గ్రైవేయీకృతు శోభనాద్రిసుతుఁడన్ గారుణ్యమాధుర్యరే
ఖావి త్తిర్పతివేంకటేశ కవితాగంగా హిరణ్యాబ్జమా
లా వైకక్షకమూర్తి సాధుసుజనాలాప ప్రయుక్తాత్ముఁడన్.

నైకోద్రిక్త జనుర్నిమిత్తక మదేనఃపుంజమున్ దా నయో
ధ్యాకాండ మ్మిది సాహితీవిమలతీర్థం బార్పుతన్ వెండికొం
డై, కైలాసము నందమూ రగుట మేలై, నీవు నీవై, యుమే
శా ! కైలాసము కాదొ నీ యెచట ను న్నాచోటు విశ్వేశ్వరా

 చేయగలన్ని పాపములు చేసితి మున్ వెనుకల్ గణింపకే
చేయఁగనైన పున్నెములు చేసితి నీ దయకల్గుదాఁక దూ
రాయితమయ్యె నీ జనిదురాత్మత, రామకథాప్రపూర్తి వే
ళాయుతిగాఁగ దేహ మవలంబనచేయుము చాలునో ప్రభూ


మహాకావ్యాలను చదివిన పండితులు, విమర్శకులు, కావ్యాల పట్ల వారి స్పందనను సాహిత్య పరిభాషలో చక్కగా వెలిబుచ్చుతారు. సామాన్య పాఠకుడి పరిస్థితి వేరు. కానీ, సగటు పాఠకుడికి కూడా హృదయస్పందన ఉంటుంది కదా

పూర్వజన్మ పుణ్యఫలమో, విశ్వనాథ గురువర్యుల అనుగ్రహమో, వారికి  ఏకలవ్య శిష్యుడినైన నాకు, కల్పవృక్షచ్ఛాయలో సేదదీరే, భాగ్యం లభించింది.

శ్రీమద్రామాయణ కల్పవృక్షము లోని ఖండాంత పద్యాలు చదువుతుంటే, కొంత ఆత్మానాత్మవిచారణ చేయగలిన సంసారజీవుడు, తన జీవిత పరమార్థ మేమిటని ప్రశ్నించుకొనక మానడు.

అనసూయ ఖండము చివరలో  నున్న  పద్యాలు, అయోధ్యా కాండ రచన పూర్తి చేసిన సందర్భములో చెప్పినవివిశ్వనాథ, పరమేశ్వరునికి, ఏం నివేదించుకుంటున్నారో చూద్దాము.

" శివా ! మహాకవులచేత పోషింపబడిన సర్వ కవిత్వ రహస్యాలను తెలిసినవాడినిపుట్టుక చేత శోభనాద్రి కుమారుడినిజానకీపతి రాముడు, సర్పాంగదకంఠభూషణుడు శివుని చేత తీర్చిదిద్దబడినవాడినితిరుపతివేంకటకవుల శిష్యుడిగా, వారి కారుణ్యం తో పాటు కవితామాధుర్యమనే  గంగాస్నానం చేసి, కవితా గంగలోని బంగారం రంగులో కల పద్మముల పూదండను జందెంగా వేసుకున్నవాడినిస్వాదువు, సుజనాహ్లాదకరమైన కవిత్వాన్ని వ్రాసేవాడిని.

ఉమాపతీపుట్టుకతో అనేక విధాలైన ఉద్రిక్తతలు వస్తాయి ఉద్రిక్తతలతో, నేను ఎన్నో పాపాలు చేశాను పాపాగ్నిని ఆర్పగల సాహితీవిమలతీర్థం నేను వ్రాసిన అయోధ్యా కాండం. అటువంటి  అయోధ్యా కాండం వెండికొండై, నందమూరు కైలాసమై, నందమూరు లోని శివలింగం నీవై, నువ్వెక్కడ కొలువుంటే అది కైలాసం కాదా

ప్రభూ ! ముందు వెనకలు చూడకుండా, చేయగలిగినన్ని  పాపాలు నేను చేశాను. నీ దయతోచేయగలిగినన్ని పుణ్యకార్యాలు చేశాను భవరోగం భరించరానంత దుర్భరంగా ఉంది. నేను మొదలుపెట్టిన రామకథారచన పూర్తయ్యేంతవరకు,   మహాకావ్యాలను చదివిన పండితులు, విమర్శకులు, కావ్యాల పట్ల వారి స్పందనను సాహిత్య పరిభాషలో చక్కగా వెలిబుచ్చుతారు. సామాన్య పాఠకుడి పరిస్థితి వేరు. కానీ, సగటు పాఠకుడికి కూడా హృదయస్పందన ఉంటుంది కదా

పూర్వజన్మ పుణ్యఫలమో, విశ్వనాథ గురువర్యుల అనుగ్రహమో, వారికి  ఏకలవ్య శిష్యుడినైన నాకు, కల్పవృక్షచ్ఛాయలో సేదదీరే, భాగ్యం లభించింది.

శ్రీమద్రామాయణ కల్పవృక్షము లోని ఖండాంత పద్యాలు చదువుతుంటే, కొంత ఆత్మానాత్మవిచారణ చేయగలిన సంసారజీవుడు, తన జీవిత పరమార్థ మేమిటని ప్రశ్నించుకొనక మానడు.

అనసూయ ఖండము చివరలో  నున్న  పద్యాలు, అయోధ్యా కాండ రచన పూర్తి చేసిన సందర్భములో చెప్పినవివిశ్వనాథ, పరమేశ్వరునికి, ఏం నివేదించుకుంటున్నారో చూద్దాము.

" శివా ! మహాకవులచేత పోషింపబడిన సర్వ కవిత్వ రహస్యాలను తెలిసినవాడినిపుట్టుక చేత శోభనాద్రి కుమారుడినిజానకీపతి రాముడు, సర్పాంగదకంఠభూషణుడు శివుని చేత తీర్చిదిద్దబడినవాడినితిరుపతివేంకటకవుల శిష్యుడిగా, వారి కారుణ్యం తో పాటు కవితామాధుర్యమనే  గంగాస్నానం చేసి, కవితా గంగలోని బంగారం రంగులో కల పద్మముల పూదండను జందెంగా వేసుకున్నవాడినిస్వాదువు, సుజనాహ్లాదకరమైన కవిత్వాన్ని వ్రాసేవాడిని.

ఉమాపతీపుట్టుకతో అనేక విధాలైన ఉద్రిక్తతలు వస్తాయి ఉద్రిక్తతలతో, నేను ఎన్నో పాపాలు చేశాను పాపాగ్నిని ఆర్పగల సాహితీవిమలతీర్థం నేను వ్రాసిన అయోధ్యా కాండం. అటువంటి  అయోధ్యా కాండం వెండికొండై, నందమూరు కైలాసమై, నందమూరు లోని శివలింగం నీవై, నువ్వెక్కడ కొలువుంటే అది కైలాసం కాదా

ప్రభూ ! ముందు వెనకలు చూడకుండా, చేయగలిగినన్ని  పాపాలు నేను చేశాను. నీ దయతోచేయగలిగినన్ని పుణ్యకార్యాలు చేశాను భవరోగం భరించరానంత దుర్భరంగా ఉంది. నేను మొదలుపెట్టిన రామకథారచన పూర్తయ్యేంతవరకు, శరీరానికి ఊతమివ్వు. "

శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో, విశ్వనాథ, తన తండ్రి ఆజ్ఞ, జీవుడి వేదన రెండూ కలిసి, రామాయణాన్ని వ్రాయటానికి తనను ప్రేరెపించాయని చెప్పారు జీవుని వేదన ఖండాంత పద్యాలలో ప్రతిబింబిస్తున్నది.














No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like