Tuesday 9 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 509 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)





మున్నే యెందఱొ రాక్షసుల్ మడిసి రంభోజాక్ష ! నీ చేతిలో
నెన్నన్ భావిని జత్తు రేమయిన గానీ ! స్వామి ! నిన్ గౌఁగిలిం
న్నేనైతిని దుంబురుండనఁగ నే వర్తింతు గంధర్వుఁడన్
నన్నున్ ఎరుంగరొ వైశ్రవణుండు తిట్టినదిగా నర్తించితిన్ దైత్యుడై.

అంపంగాఁ బినతల్లి స్వామియు వనీయాత్రాగతిన్ వచ్చి నిన్
జంపున్ నీ సహజంపురూపము గడించంజాలు దంచుం బ్రసా
దింపన్ నీకయి వేచియుంటిఁ బ్రభువా ! దీవ్యద్భుజా శ్రీధను
శ్శంపానీరదమూర్తి ! నిన్ను గుఱుతింపంజాల కెట్లయ్యెడున్.

నీ మార్గణం బపూతపు
నామేనునఁ బడకమున్న నాథా ! వైదే
హీ మహిత తనూస్పర్శ
వ్యామిశ్రముగాఁగఁ బూతపఱచితిఁ దండ్రీ !

విరాధుడు శస్త్రాస్త్రాల చేత చంపబడనట్లుగా, వానిచేత ఖండింపబడనట్లుగా, విడదీయబడకుండునట్లుగా బ్రహ్మదేవుని వద్ద నుండి వరాలు పొందాడు వరప్రభావంతో, రామలక్ష్మణులు బాణప్రయోగం చేసినా వాడు చావలేదువాడు, వారిద్దరిని చెరొక బుజాన వేసుకొని పరుగెత్తసాగాడురామలక్ష్మణు లిద్దరూ విరాధుడి మెడ మీద అటూఇటూ కాళ్ళు వేసి కూర్చొని, రాక్షసుడి రెండు బుజాలను కత్తితో నరికారు. విరాధుడు బాధతో  పెద్దగా అరచి క్రిందబడ్డాడురామలక్ష్మణులు లాఘవంగా క్రిందకు దూకి, వాడు లేవకుండా మీద కూర్చొని, వాడి శరీరమంతా బాణాలతో తూట్లుతూట్లుగా పొడిచారువిరాధుడి దేహమంతా నెత్తురుముద్దయింది కానీ, వాడు మాత్రం చావలేదు.

రాముని కప్పుడు బ్రహ్మ  వరాలు గుర్తుకొచ్చి, వాడి గొంతును ఊపిరాడకుండా గట్టిగా నొక్కి పట్టుకొనివాడిని పూడ్చటానికి, లక్ష్మణుడిని ఒక గొయ్యిని త్రవ్వమన్నాడు. మాటలు వినగానే విరాధుడు " శ్రీరామా ! మంచియూహ చేసితివయ్యా ! " అని మెచ్చుకొన్నాడువిరాధుడు రామునితో ఇంకా ఇలా అన్నాడు.

" పద్మనేత్రారామా ! ఇప్పటికే నీ చేతిలో ఎందరో రాక్షసులు చచ్చిపోయారు. రాబోయే కాలంలో ఏది ఏమైనా కానీఇంకెంతోమంది చచ్చిపోతారునా పూర్వజన్మపుణ్యం వల్ల నిన్ను కౌగలించుకోగలిగాను. స్వామీ ! నేను తుంబురుడనే గంధర్వుడినికుబేరుని శాపంతో రాక్షసజన్మ నెత్తాను

  ఆజానుబాహుడా ! నీలమేఘవర్ణా ! కోదండరామా ! నిన్ను గుర్తుపట్టకుండా ఎలా ఉండగలను? పినతల్లి కోరిక మీద, వనవాసానికి వచ్చిన నువ్వు నన్ను చంపుతావని, విధంగా నాకు సహజ రూపం వస్తుందని, కుబేరుడు చెప్పినందువల్ల, నీ కోసం కళ్ళు కాయలుకాసేటట్లు ఎదురుచూస్తున్నాను

నీవు ప్రయోగించిన బాణాలు నా రాక్షసదేహాన్ని తాకి అపవిత్రం కాకుండా, తల్లి వైదేహి తనుస్పర్శతో నా దేహాన్ని పునీతం చేసుకొన్నాను తండ్రీ ! "

మీరు రామలక్ష్మణులమని చెప్పేటంతవరకు, నేను ఎంతో మథన పడ్డానుమీరు మీరని తెలిసిన తరువాత ప్రాణాలు కుదుట పడ్డాయిఅందుకనే, నేను ఎంత ఒదిగి మాట్లాడానో చూశారు కదా ! "

గంధర్వుని జీవలక్షణము, దైత్యుని దేహభావము కలగలిసిన విరాధుని పాత్రను, విశ్వనాథ  మలచిన తీరు అనన్య సామాన్యమైనది. సన్నివేశం, శ్రీమద్రాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.




No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like