Monday 1 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 478 ((శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాలకాండము: అవతారిక)
















దృశంబుగ మహాకావ్యరచనా ప్రసూనవన బంభరాయమాణ చిత్తుండనై సర్వధర్మ మూలబీజంబుగ నవిచ్ఛిన్న సంప్రదాయార్థినై.

శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలోని వచనం ఎంతో ప్రాధాన్యత కలిగినది.
ఏకవాక్య వచనం మహాకవిగా విశ్వనాథ అంతరంగాన్ని బహిర్గతం చేస్తున్నది.

విశ్వనాథ రామాయణం ఎందుకు వ్రాయవలసి వచ్చింది? ఎవరికోసం వ్రాయవలసి వచ్చింది? ఒక మహాకవి రచనలు ఎవరికోసం, ఉద్దేశ్యంతో చేస్తాడుఇలాంటి పలు ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమౌతాయి. నాగరక సమాజమని పిలువబడే నేటితరంలో, రామాయణం చదువవలసిన అవసరం  ఎవరికుందిఅసలు, నేటి తరానికి రామాయణం ఏమి చెబుతున్నది?

ప్రశ్నలకు సమాధానమా అన్నట్లు, విశ్వనాథ తాను రామాయణాన్ని " దృశంబుగ మహాకావ్యరచనా ప్రసూనవన బంభరాయమాణ చిత్తుండనై, సర్వధర్మ మూలబీజంబుగ నవిచ్ఛిన్న సంప్రదాయార్థినై " వ్రాస్తున్నానన్నాడు.

ఇందులోని కొన్ని పదాలను విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం.

విశ్వనాథ, " మహాకావ్యరచనా ప్రసూనవన బంభరాయమాణ చిత్తుండనై " వ్రాస్తున్నానన్నాడుపూలతోటలోని మధువులొలికే పూల మీదనే తుమ్మెదలు వ్రాలతాయి. పిచ్చి మొక్కల పూల జోలికి పోవు. మహాకావ్యమనేది పరిమళభరితమై, పొట్టనిండా మధువును నింపుకొన్న పూలు గల పూదోట పూదోటను ఫలవంతం చేయాలంటే విశ్వనాథ వంటి గాఢప్రతిభ కలిగిన మహాకవి కావాలి. విశ్వనాథ మహాకవి. ఆయన చేబట్టినది మహాకావ్యరచన.

మహాకావ్యరచన ఎందుకు చేయాలి? సర్వధర్మమూలబీజంబుగ అవిచ్ఛిన్న సంప్రదాయార్థిగా చేయాలిఅనగా సర్వధర్మములకు మూలసూత్రముగా నిరంతరం కొనసాగే సంప్రదాయం ఒకటుండాలిఅది దేశకాలాతీతమై, మానవాళికి ఆనందసంధాయకంగా, అభ్యుదయకారిగా ఉండాలి. ఇక్కడ సర్వధర్మములకు అంటే అన్ని మతములకు, వర్ణములకు, వర్గములకు, అతీతంగా, బీజప్రాయంగా ఒకటుండాలి. అది నిత్యమై, మార్పు లేనిదై కొనసాగాలి. అదే అవిచ్ఛిన్న సంప్రదాయం. అది అనాదిగా, ఋషిమార్గంగా, సనాతనంగా వస్తున్నది. దానిపేరే ధర్మము. యుగాలు మారినా, తరాలు మారినా, సనాతనధర్మం అవిచ్ఛిన్నంగా సాగాలన్నది విశ్వనాథ ఆకాంక్ష.

నేటి సమాజానికిది అవసరమా? గతించిన తరాల కన్నా, నేటి తరాలకే సంప్రదాయం యొక్క, సనాతన ధర్మం యొక్క అవసరం ఎక్కువ. నాగరకత, ఆడంబరాలు, స్వప్రయోజనాలు, ప్రచారాలు, లాభార్జన ఇత్యాది విషయముల సుడిగుండంలో పడి యువత కొట్టుకుపోతున్నదిమానవీయ విలువలను మరచిపోతున్నది. అటువంటి తరుణంలో, విశ్వనాథ రామాయణాన్ని మరల వ్రాశారు. ఆచార్య జీ.వీ.సుబ్రహ్మణ్యం గారన్నట్లు నవ్యసంప్రదాయంలో వ్రాశారు
రామాయణ కావ్యానికి కథానాయకుడు రాముడురాముడు తాను " జ్ఞానపథవిహారి " నని చెప్పుకొన్నాడుజ్ఞానం యొక్క మార్గం ధర్మానుష్ఠానంఅనగా ధర్మాన్ని ఆచరించటంఆచరించి ఇతరులకు మార్గదర్శిగా ఉండటం.   రామావతార లక్ష్యమే ధర్మ పరిరక్షణ. " రామో విగ్రహవాన్ ధర్మః " అని ఐంద్రజాలికుడైన మారీచుని వంటి రాక్షసుని చేత పలికించారు వాల్మీకి. రామాయణంలోని రాముని ప్రతి అడుగూ ధర్మం కోసమే. " ధర్మో రక్షతి రక్షితః ".  ధర్మమే మానవుని మనుగడకు మూలస్తంభంమూలస్థంభం ఒరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మానవాళి మీద ఉంది. అది జరగాలంటే, అవిచ్ఛిన్నంగా సంప్రదాయాన్ని కొనసాగేటట్లు చేయాలి. ధర్మ మూలబీజంబుగా, అవిచ్ఛిన్న సంప్రదాయాన్నే విశ్వనాథ తన రామాయణ రచన ద్వారా అర్థించింది.

అందుకే, " పక్షి ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగిరినా, రాత్రి గూటికి చేరవలసిందే. అదే సంప్రదాయం. " అన్నారు విశ్వనాథ.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like