Saturday 6 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 496 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)












నీ చెలికారమున్ హృదయనిర్మలమైనది వాక్యధోరణీ
ధీచతురత్వమున్ నరపతిప్రకటోన్నత భావరమ్యమై
తోఁచిన దేమి మిత్రుఁడవు తోఁచితి తమ్ముఁడు నీవు నాకు దో
శ్శ్రీ చెలువారు వేఱయిన చేతులుగాఁగఁ జతుర్భుజత్వమై.


 క్షితిసుత నేమియైన వెదకింతును దెత్తునటన్న మాట నీ
మతి పరికింపగా నతిప్రమాణము నీ వనినట్లు నాపయిన్
గతమయి నాకులేద యధికారము జానకి యేలుచుండెఁ

త్కృతముగ మీరలేలుదురు కేవల మీ విరహార్తునిన్ననున్.


సుగ్రీవుడు మాట్లాడిన దుఃఖోపశమన వాక్యాలు శ్రీరాముని హృదయం లోనికి చొచ్చుకుపోయాయిఆయన సుగ్రీవుని మైత్రీబంధానికి ముచ్చటపడ్డాడు. అందుచేత ఇలా అన్నాడు.

" మిత్రమా! నీది గుండె లోతుల్లో నుంచి వచ్చిన నిర్మలమైన స్నేహం. ఇక నీ మాట తీరు, ధైర్యం, చతురత సమ్మిళతమై, ఒక రాజు ఎంత భావరమ్యంగా మాట్లాడుతాడో, అట్లా మాట్లాడినట్లుందిఆహా ! ఏం స్నేహితుడివయ్యా ! నాకు తమ్ముడిలాగా అనిపించావు. నువ్వు, లక్ష్మణుడు, నా బాహుబలాన్ని పెంచుతూ, నాకు ఇంకొక రెండు చేతులు వచ్చినట్లుగాచతుర్భుజత్వం వచ్చినట్లుగా అనిపిస్తున్నది..

ఏదేమైనా కూడా సీతమ్మను వెతికి  తెచ్చిస్తానని నువ్వు చెప్పింది చిత్తశుద్ధితో చెప్పిన మాటనువ్వన్నట్లు నా మీద నా కధికారo లేదన్నది నిజంఇప్పుడు నా మీద అధికారం జానకిది. విధంగా సీతాన్వేషణ పరంగా, అధికారం మీ చేతుల్లోకి వచ్చింది. నేను కేవలం విరహంతో బాధపడుతున్నవాడిని. "

రామసుగ్రీవుల మైత్రీబంధాన్ని బలపరిచే మరికొన్ని పద్యాలివి. జానకీవిరహంతో బాధపడుతున్న రామునికి, లక్ష్మణునికి తోడు, ఇంకొక తమ్ముని వంటివాడు దొరకటం, అతడు సీతాన్వేషణకు పూనుకొనటం, రామకథలో కీలకమైన మలుపన్నది విస్మరించరానిది.

ఇంకొక చమత్కారమైన విషయంశ్రీరాముడు శ్రీమహావిష్ణువు అవతారం. మహావిష్ణువు శంఖచక్రగదాద్యాయుధాలను ధరించే చతుర్భుజుడు.

పద్య్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా ఖాండము, నూపుర ఖండము లోనివి.










No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like