Saturday 6 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 495 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)












పితృవియోగాదులవి  దుఃఖపెట్టు బిట్టు
గాని జానకి దుఃఖము కరణిఁ గావు
తల్లివరములు జానకిఁ దగులవలెనె
నిన్నుఁ దగిలినయది చాలద్దన్న యట్లు.

సర్వజీవలోక సంత్రాణశీలుండ
వంతలోన నిట్లె యటమటించు 
ధరణి సర్వవలయధానుష్కరత్నంబ

వసి మొగంబె  తెలియనట్టు లుందు.

విరాధుని బారిన పడ్డ జానకి తన దీనావస్థకు దుఃఖిస్తున్నది. రాముడు తనకు దగ్గరగా నడుస్తూ ఉంటే అనర్థం జరిగేది కాదుగదా అనుకొన్నది. ఏదో మాటవరసగా అన్న మాటలను విధంగా పట్టించుకుంటే, ఇక అరణ్యంలో ఏమవుతుందో, ఏమయిపోతానో అని పలువిధాల వాపోయింది సీత. తలిదండ్రులంటేనే  ప్రేమానురాగాలు లేని మనిషికి భార్యంటే ప్రేమ ఎక్కడుంటుందని, బాధలో నిష్ఠురంగా కూడా మాట్లాడింది.

సీత దీనాలాపాలు విన్న రాముడు దుఃఖవివశుడయ్యాడుకైకకు ఎంతో సేవ చేసిన సీతను దురవస్థల పాలు చేయటానికే పినతల్లి  తనను అడవులకు పంపిందా అని నిర్వేదం పొందాడు.  

" తండ్రిని పోట్టుకొన్న దుఃఖం భరించలేనిది. కాని, జానకీవిరహ దుఃఖం వంటిది కాదుతల్లి కోరిన వరాలు  నాకు తగిలింది చాలక, జానకికి కూడా తగలాలా? " అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు రాముడురాముడి దుఃఖాన్ని చూసి, ఒక్క బాణంతో విరాధుడిని మట్టిముద్దలాగా చేయగల తన అన్న, యెందుకిలా బేలగా మాట్లాడుతున్నాడని, లక్ష్మణుడికి ఆశ్చర్యం వేసిందిఅన్నకు ధైర్యం చెబుతూ లక్ష్మణుడు ఇలా అన్నాడు.

" సర్వజీవలోకానికి రక్షణ కలిగించే సౌశీల్యమున్న నీవు విదంగా దుఃఖపడటం వింతగా ఉందిధానుష్కులలో ఉత్తమోత్తమ శ్రేణికి చెందిన నువ్వు, అసలు బాణం, కత్తి మొహం చూడనట్లు మాట్లాడుతున్నావు. "

దుఃఖం పలు విధాలుగా ఉంటుంది. మాతృవియోగం, పితృవియోగం భరించరానివివీటన్నిటికంటె, భార్యాబియోగం దుర్భరమయినది. సనాతనధర్మం, దాంపత్యజీవితంలోని, అర్థనారీశ్వరతత్త్వాన్ని, స్త్రీ ఔన్నత్యాన్ని బలపరుస్తున్నది.

భార్యావియోగ దుఃఖాన్ని అనుభవించి, " వరలక్ష్మీ త్రిశతి " అనే స్మృతికావ్యంలో నిబద్ధం చేసిన విశ్వనాథకు రాముడు అనుభవించిన జానకీవిరహ దుఃఖతీవ్రత తెలుసు. అందుచేత, రాముని నోట మాట పలికించగలిగారు.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి










No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like