Thursday 11 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 521 ((కల్పవృక్ష ఖండాంత పద్యాలు: అయోధ్యా కాండము: పాదూ ఖండము)




అకట ! ప్రతీపసంస్థితికి నైతిన యీ గతి నాదు తల్లక్రిందుతీ
రు కెడపి తొల్లినాటిది స్వరూపజగత్తునఁ జేతనత్వ మో
డకయ క్రియాజగత్తున జడత్వము వైఖరి చేసిపెట్టవే
ప్రకుపితశైలరాడ్డుహితృ పాణి నిమీలిత లోచనచ్ఛవీ !

జీవుడు యదార్థంగా ఆత్మస్వరూపుడుతన స్వరూపమదేఆత్మ నిత్యము, చైతన్యవంతమైనది. కానీ, కర్మఫలంగా లభించిన దేహాన్ని నిత్యమని భావించి తన తొలుతటి జగత్తును మరచిపోతున్నాడుఇదే తలక్రిందుల తీరంటేఅందుచేత, స్వస్వరూపసంధానం కలిగించి, క్రియాజగత్తులో జడత్వం వంటి స్థితిని ప్రసాదించమని విశ్వనాథ పరమేశ్వరుడిని వేడుకుంటున్నాడు

" పరమేశ్వరా! అయ్యో ! నేను ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాను కదా ! నిత్యమైన, చైతన్యస్వరూపమైన తొలుతటి ఆత్మజ్ఞానాన్ని, స్వస్వరూపసంధానాన్ని పోగొట్టుకొనకుండా, క్రియాజగత్తులో, కర్మలను ఆచరిస్తూనే, నిష్కామంగా, జడుని వలె ఉండేటట్లు చేసిపెట్టు. " 

జీవుడు సంసారబద్ధుడు. పశువు రకంగా అయితే కట్టుకొయ్యకు కట్టబడి, విడిపించుకొనే మార్గం లేక, దాని చుట్టూ తిరుగుతూ, ఇంకా రెండు చుట్లు ఎక్కువగా వేసుకుంటుందో, అదే విధంగా, జీవుడు తన యదార్థ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక, ఇంద్రియలోలుడై, విషయ వాంఛలకు బానిసై, జననమరణచక్రంలో పడి తిరుగుతుంటాడుఅందువల్ల  జీవుడు, తన తొలుతటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, క్రియాజగత్తులో, కర్మాచరణం చేస్తూనే, జడుడు యెట్లా ఉంటాడో రకంగా ఉండేటట్లు చేయమని పరమేశ్వరుడిని వేడుకుంటున్నాడుపశువుకు కట్టుకొయ్య నుండి విముక్తి లభించాలంటే, పశుపతి అనుగ్రహం కావాలి.

శివుని పరంగా, విశ్వనాథ " ప్రకుపిత శైలరాడ్డుహితృ పాణి నిమీలిత లోచనచ్ఛవీ !" అని చాలా పెద్ద విశేషణం వాడారు. పైకి కనిపించే " బాగా కోపించిన పార్వతి చేతిని మూసినకన్నులతో చూచుటయందు రక్తి కలవాడా ! " అన్న అర్థానికి లోపల దాగి ఉన్న భావం తెలియటం లేదు. పెద్దల ద్వారా తెలియబడుతుందని ఆశిస్తున్నాను.

విస్మరించరాని ఇంకొక విషయం ఖండాంత పద్యాలకు, నా అల్పబుద్ధికి తోచిన అర్థాన్ని మాత్రమే వ్రాశానని సవినయంగా మనవి చేసుకొంటున్నానువిశ్వనాథ వంటి ఒక ఋషి ఆత్మనివేదన, జీవుని వేదన రూపంలో, నా వంటి అల్పజ్ఞులకు అంత సులభగ్రాహ్యం కాదు


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like