Monday 15 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 532 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అయోధ్యా కాండము: అభిషేక ఖండము)




చచ్చుటకైన సిద్ధపడు  సాహసముం బచరింపకున్నచో
మెచ్చరు రాజు, లూరకయ మేలిమిపూఁతల మాటలాడినన్ 
మెచ్చరు , ప్రాణదఘ్నమయి  మిత్తికిఁ దెచ్చినఁగాని దేవతల్ 
మెచ్చరు, భూమిపాలకులు మెచ్చరు కోర్కులు తీర్చు వేళకున్.

గట్టిగఁ జూచి మంథరను గైకయి యిట్లనెఁ బొట్టిదానికిన్
బుట్టెఁడు బుద్ధులన్న నుడి పోలును నీ మతివైభవంబు నీ
పట్టినపట్టు నీతివిభవంబు లోకరహస్యవేత్తృ సా
మ్రాట్టుతనంబు చెల్లును సుమా ! యొక్క నీకె తలంచి చూచినన్.

ఒక పదకమ్మెత్తితివా
యొక కొలికికిఁ దేనుగలవ యుర్విసకలమున్
వికృతుఁడు విధాత నినుఁ గు
బ్జక చేసినా దానికే విచారము సుమ్మీ !

క్షితికిని నెల్ల నీ తెలివికిన్ సితచామర మొక్కఁడెల్లి యొం
డతుకులు లేని వుండవలె, నంతటిదానవు, మెచ్చవచ్చు నీ
మతి విభవమ్ము నీ సొగసు, మంథరమైన వివేకహేతుతా
న్వితవయి మంథరాఖ్యను గణించితి వూరక నీకు వచ్చెనా?

వెలగల దుస్తులను ధరించిన బిచ్చగాడికి ఎవరూ బిచ్చం  పెట్టరనీ, అందువలన, నగలన్నీ తీసేసి, పాత చీర కట్టుకొని, కోపగృహంలోకి వెళ్ళమని మంథర కైకకు సలహా ఇచ్చిందిరాజైనవాడు భర్త అయితే, అతడిని ఎలా  ఒప్పించాలో, మంథర కైకకు నూరిపోసిందిభర్త బెదిరించినా, బతిమాలినా, విదిలించి కొట్టాలని చెప్పింది. భర్త ఎక్కడలేని ప్రేమ ఒలికించినా కూడా, తప్పదని ఒప్పించేవరకు వదలకూడదని చెప్పింది. మంథర ఇంకా కొన్ని సూత్రాలు చెప్పింది

" చావటానికైనా సిద్ధపడేటంత సాహసాన్ని ప్రదర్శించకపోతే, రాజులు దిగిరారు. ఊరకే పై పై మురిపించే మాటలకు మెచ్చుకోరుదేవతలైనా, భూమిని పాలించే రాజులైనా సరే, చావు వరకూ వెళితే గానీ వరాలివ్వరు. " 

అంతా విన్న కైక మంథరను తీక్షణంగా చూసి  ఇలా అన్నది

" పొట్టిదానికి పుట్టెడు బుద్ధులన్న సామెత ఊరకే వచ్చిందటే ! నీ బుద్ధివైభవం, నీ ఉడుం పట్టు, నీ నీతివిశారదత్వంలోకరహస్యాలను ఆకళింపు చేసుకొన గల నీ సామ్రాట్టుతనము - ఇవన్నీ ఒక్క నీకే సరిపోతాయి సుమా !

ఏదన్నా ఒక పదక మెత్తావా, దాన్ని ఒక కొలిక్కి తేగల సామర్యం నీకుంది సృష్టికర్త బ్రహ్మ నిన్ను పొట్టిదానిగా చేసినందుకే నేను విచారిస్తున్నాను.

భూమి మొత్తం మీద, నీ అంతటి తెలివిగలదానికి  గుర్తింపు ఉండాలంటే, అతుకులు లేనటువంటి తెల్లని వింజామరలు ఒకటి రెండుండాలినువ్వంతటిదానివి. అహో ! ఏం బుద్ధివైభవం? ఏం సొగసు? నిన్ను నిజంగా మెచ్చుకోవచ్చు. వక్రమైన నీ వివేకాన్ని బట్టి మంథర అనే పేరు వచ్చింది గానీ, ఊరకే వచ్చిందా? " 

వ్యంగ్యంగా కైక మాట్లాడిన మాటలు, ఆమె నిరాదరభావాన్ని సూచిస్తూ, తన కిష్టమున్నా లేకున్నా, మంథర పదకాన్ని అమలు చేయక తప్పని పరిస్థితిని తెలియజేస్తున్నాయి.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.








No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like