Saturday 20 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము: 545 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)











సామాన్యంబుగ నేరికే నుపకృతిన్ సల్పన్ గడుంబుణ్యమౌ
సౌమిత్రీ ! యది యన్నగారయిన బెల్చన్ వాడు ధర్మాఖిల
శ్రీమన్మోహనమూర్తియైన మఱి యా సేవాఫలంబెట్టిదో
రామున్ రామను గొల్చుచుం జనుమురా ! రామానుజా ! లక్ష్మణా

పోవుచు రాముఁడీ మునులపోడుము లెల్లను జిత్రమయ్యెఁ
ద్భావము లింత మెత్తనగుఁ పాటికి నేమి మనోజ్ఞ సృష్టియో
యీ విధ మల్లగ్రామముల నెచ్చటఁ దోఁపదు వారలైన
ర్మావృత చిత్తవృత్తులయి యక్కట నేరరు కేవలత్వమున్.

శరభంగముని శరీర త్యాగం తరువాత, సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుని ఆశ్రమానికి వెళ్ళారుమునులకిచ్చిన అభయం మేరకు మున్యాశ్రమాలను సందర్శిస్తూ, వారికి రాక్షసబాధ తప్పిస్తూ పదేండ్లు గడిపారుతరువాత, అక్కడ నుండి బయలుదేరి అగస్త్యాశ్రమానికి వెళ్ళటానికి సుతీక్ష్ణుని అనుమతి కోరారు. సందర్భంలో, దండకారణ్యంలో సీతారాములను, వన్యమృగాల, రాక్షసుల బారి నుండి కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న లక్ష్మణుడిని  ఉద్దేశించి ఇలా అన్నాడు.

" సుమిత్రానందనా ! లక్ష్మణా ! మామూలుగా ఎవరికైనా సహాయం చేస్తే, అది చాలా పుణ్యప్రదమైనది. అదే అన్నగారి సేవ చేస్తే, ఇక దానిని గురించి వేరే చెప్పాలా
అన్నగారు, మూర్తీభవించిన ధర్మమూర్తి అయితే, ఇక సేవాఫలం ఎంతటిదో చెప్పశక్యం కాదు. రామానుజా, లక్ష్మణా! రాముడిని, వదినగారు సీతను సేవిస్తూ తక్కిన వనవాసకాలాన్ని గడుపు నాయనా ! "

దండకారణ్యంలో ఉన్నంతకాలం మునుల,సుతీక్ష్ణుని, ఆతిథ్యాన్ని, అభిమానాన్ని, ఆప్యాయతను, హృదయ మంజుల భావాన్ని చవి చూసిన రాముడు మార్గమధ్యంలో తమ్ముడితో ఇలా అన్నాడు.

" మునుల మనస్తత్వం చూస్తే చాలా చిత్రంగా ఉంటుంది. వారి భావాలు ఇంత మృదువుగా ఉండటానికి వారి సృష్టి ఎంత మనోజ్ఞమైనదో కదాఇక్కడ మున్యాశ్రమాల్లో ఉన్నట్లుగా గ్రామాల్లో ఉండదుమునులు కూడా ధర్మాచరాణ మీద మనస్సు లగ్నమై ధర్మగ్లానిని చూసీచూడనట్లు ఉండలేరు. "

లక్ష్మణుడిని గురించి సుతీక్ష్ణుని ప్రశంసావాక్యాలు, లక్ష్మణుని రామోపాసనను తెలియజేస్తాయిఇక రాముడుమునుల సంరక్షణ పనిలో పదేండ్ల కాలం గడపటం వల్ల, అతడికి వారితో ఏర్పడిన అనుబంధాన్ని, వారి ఎడబాటు వల్ల కలిగిస్తున్న బాధను సూచిస్తున్నది.   

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.





No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like