Thursday 4 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 489 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)
















ఇంతయినట్టి ధైర్యము వహించితి నీవును ధైర్య మూనవే
గొంతునఁ బ్రాణమున్న యెడ క్షోణిసుతన్ వెదకించి తెచ్చి యి
ప్పింతున యీయలేనియెడఁ బిల్వకు నన్నును నాఁదుపేరఁ బ్రా
ణాంతకమయ్యె నీదు విరహస్థితి నాకు సుమిత్రబిడ్డకున్.

తెచ్చినయట్టి ధైర్యమును దేల్పకు నీదగు పున్నెమాయె నీ
పచ్చని నీడచూచుకొని భార్యయుఁ బిల్లలుగా సుఖంపడన్
వచ్చునటంచు నెంచితిని వచ్చితి నీవుగ నీవు మైత్రికై
వచ్చినపైని నీవెవరివాఁడవు మా కధికార మున్నదిన్.

శ్రీరామచంద్రుడు సీతాదేవి నగలను చూడగానే తాత్కాలికమైన మోహావేశానికి, ఉద్వేగానికి లోనయ్యాడురాముని దుఃఖోపశమనం కోసం సుగ్రీవుడు  ఇలా అన్నాడు.  

" భార్యను, రాజ్యాన్ని పోగొట్టుకొని అతి దీనమైన స్థితిలో ఉన్న నేను ధైర్యం తెచ్చుకున్నాను. నువ్వు కూడా ధైర్యం తెచ్చుకోనా గొంతులో ప్రాణమున్నంత వరకు, సీతాన్వేషణ చేయిస్తానుజానకిని వెదికి తెచ్చి, నీ కిప్పిస్తాను. పని చెయ్యలేనినాడు, నన్ను నా పేరుతో పిలువవద్దురామా ! నీ వియోగదుఃఖం చూస్తే, నాకు, లక్ష్మణుడికి ప్రాణాలమీదికి వచ్చినట్లవుతున్నదయ్యా

నీకు పుణ్య ముంటుంది. ఉన్న కాస్త ధైర్యాన్ని పోగొట్టుకోకునీ పచ్చని నీడ చూసుకొని, భార్య పిల్లలతో సుఖపడదామనుకుంటున్నానురామా ! నీ అంతట నీవు నా స్నేహాన్ని కోరి వచ్చావు (చాలా సంతోషంగా ఉంది).  ఇక వచ్చిన తరువాత నువ్వు ఎవరివాడివి (మా వాగ్వ్డివి).   నీ మీద మాకా హక్కు ఉంది. "

సుగ్రీవుని ప్రియవచనాలు, ఎంత గుండె జారిపోయినవాడికైనా ఊరట కలిగిస్తాయి. విశ్వనాథవారు తెలుగు నుడికారంతో, జనజీవితంలో ఉన్న సహజమైన ప్రేమానురాగాలని పండించారు. " గొంతున ప్రాణ మన్న యెడ, పిల్వకు నన్నును  నాదు పేర, ప్రాణాంతకమయ్యె, నీ దగు పున్నెమాయె, నీ పచ్చని న్ నీడ చూసుకొని, వంటి తెలుగు లోగిళ్ళలో వాడబడే మాటలు, ఇరువరి మధ్య గల ఆప్యాయతానుబంధాలని ఇనుమడింపజేస్తున్నాయి.

ఇంత చక్కని పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండంలో ఉన్నాయి.





No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like