Wednesday 24 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 553 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)










నామాత్రపు టూహ నేరవనికానీ నేఁ  బ్రతిజ్ఞాత్రి నం
చైనంగాదు వచించెదం జనవుచే నా దైత్యసంతాన మే
మైన న్నీకపరాథమున్ సలిపెనా యౌఁగాని నిర్హేతుక 
ప్రాణాపాయము వారికేటికి ఘటింపంజూతువో చెల్లరే

క్రమ మొప్పంగను నాల్గు ధర్మములలోఁ గైపూనగా క్షత్ర
ర్మము కోదండము, పూని యార్తజన సంరక్షావిధానంబు ధా
ర్మము వాగ్దానము తీర్చుటో పరమ ధర్మం, బీ త్రయీధర్మ ము
త్తమ మస్పత్ప్రియ మీ తపస్విజన మద్దా ! యేమికానౌనొకో.

పైనిన్ మీ సకలాస్త్ర వైభవము విశ్వామిత్ర దత్తంబు, తా 
నైనన్ గాధిజుఁడన్న మాౠషియ, నీ కస్మద్వధద్రోహిసం
తానంబూడ్చుట తప్పదన్న బలవంతంబైన నేమందు, వా
గ్దానంబిచ్చితి నట్లెచేతునని సత్యం బేమిచేయన్ వలెన్.

వలసిన నిను వదలెదనో
వలసిన  సౌమిత్రిఁగూడ వదలెదనో మై
థిలి ! తనచేయుఁ బ్రతిజ్ఞా
స్ఖలనము ప్రాణంబుతోడఁ గానీకుండన్.

శ్రీరాముడు దండకారణ్యం లోని మునిసంఘాలకు, రాక్షస బాధ నుండి వారిని కాపాడతానని వాగ్దానమిచ్చాడు. మాట చెప్పవచ్చా, చెప్పకూడదా అన్న ఊగిసలాడి, చివరకు ధైర్యం కూడగట్టుకొని, సీత రామునితో ఇలా అన్నది.

" నా కొచ్చిన మాత్రము ఊహ నీకు రాలేదని గానీ, నీ కంటె తెలిసినదాన్నని గాని చెప్పటం లేదు. నీ భార్యననే చనువుతో చెపుతున్నాను రాక్షసులు నీ కేమైనా అపకారం చేశారా పెట్టారాఅది సరేగాని, కారణం లేకుండా వాళ్ళకి ప్రాణహాని ఎందుకు తలపెడతావు?

ఇది విన్న రాముడు, సీతతో ఇలా అన్నాడు.

" ఒక క్రమంలో చెప్పాలంటే, నాల్గు వర్ణాశ్రమ ధర్మాలలో, క్షత్రియుని యొక్క మొదటి ధర్మం విల్లుని చేబూనటంఇక విల్లుని చేబూని చక్కగా  శిష్టరక్షణం చేయటం ధర్మంఇచ్చిన మాటకు కట్టుబడి దానిని తీర్చటం పరమ ధర్మం మూడు ధర్మాలు చాలా ఉత్తమమైనవి. ఇక యీ  తపస్విజన మంటావా నాకు చాలా  ఇష్టమైనవారుఏమవుతుందో చూద్దాం.

పైగా, మును లేమన్నారో తెలుసామా దగ్గరున్న సకల అస్త్ర సంపద వాళ్ళ ఋషికులం వాడైన గాధేయు డిచ్చినదేనట. కారణం చేత, వాళ్ళను చంపుతున్న దితిసంతానాన్ని సంహరింపక తప్పదని బలవంత పెట్టారు. ఇక నే నేమంటాను? సరేనని మాట ఇచ్చాను. ఏం చేయాలిఆడి తప్పకూడదు కదా

సీతా ! ఇంకొక మాట చెబుతాను వినుకావలసివస్తే, నిన్ను వదలుకొంటాను, లక్ష్మణుడిని కూడా వదలుకొంటానుకానీ, ప్రాణముండగా, నేను చేసిన ప్రతిజ్ఞకు భంగం వాటిల్లనీయను. "

ధర్మం పట్ల శ్రీరాముడెంత నిర్దయుడో, ఉదంతం తేటతెల్లం చేస్తుంది.

విశ్వనాథను పాషాణపాకప్రభువని మెత్తని హృదయం కలవారెవరైనా అనగలరా? సామాన్యమైన  తెలుగు లోగిళ్ళలో మాట్లాడుకొనే రీతిలో, గుండెకు హత్తుకొనే రీతిలో, భార్యాభర్తల మధ్య సంభాషణను, సన్నివేశానికి తగ్గట్లుగా, ఒక మహాకావ్యంలో నడపటం, ఒక్క విశ్వనాథకే చెల్లింది

విశ్వనాథ ఋషీ ! మా తెలుగు జాతి కింతకంటె ఇంకేం కావాలి

ఇంత చక్కని పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండములో ఉన్నాయి.






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like