Thursday 4 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 486 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: ఇష్టి ఖండము)
















అతనికి లోకమే తెలియ దగ్నియుఁ దండ్రియు నిద్రఱే జగ
మ్మతనికి, బ్రహ్మచర్య మిపుడైనను నట్లె ద్విధాగతి ప్రసా
రితముగఁ బొల్చు నవ్వనిఁ జరించును, దూరపుదోఁట పోఁడు
లోభితమతి కాఁడు, స్త్రీ పురుషభేదము కూడ నెఱుంగఁడింతయున్.

శ్రీమద్రామాయణ కల్పవృక్షములోని  ఉపాఖ్యానాలలో ఋష్యశృంగుని వృత్తాంతం ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నదిరామావతారానికై నిర్వహింపబడిన పుత్రకామేష్టికి ఋష్యశృంగుడు అథ్వర్యుడు. విధంగా ఋష్యశృంగుని కథ ప్రధాన కథతో అనుసంధానమై ఉందిఅయితే, ఋష్యశృంగుని కథను విశ్వనాథ మలచిన తీరు ఆంధ్ర మహాభారతంలో నన్నయగారి ఋష్యశృంగునికి మెరుగులు దిద్దుతూ, కవిసమ్రాట్టుల కథాకథనశక్తికి అద్దం పడుతున్నది.

" మహాతపస్వి యగు కాశ్యపునకు విభాండకుండు పుట్టె, నవ్విభాండకునకు ఋష్యశృంగుడను కుమారుండు కలిగెను ఋష్యశృంగుండు విభాండకుని కన్నులకు వెన్న్నెలవత్తి; తండ్రి యాయననట్లు పెంచె. " 

ఇదీ, విశ్వనాథ ఋష్యశృంగుని గూర్చి వ్రాసిన వచనంఇక పద్యంలో, ఋష్యశృంగుడు విధంగా వర్ణింపబడ్డాడో తెలుసుకుందాము.  

" ఋష్యశృంగునికి లోకమంటే, జనసంచారమంటే తెలియనే తెలియదు. అగ్నిహోత్రుడు, తండ్రి విభాండకుడు - వీరిద్దరే అతనికి తెలిసిన లోకంఇప్పుడు కూడా, బ్రహ్మచర్యాన్ని పాటించటం, అడవిలోకి వెళ్ళి సమిధలు తీసుకురావటం రెండు పనులే అతని దినచర్య ఋషికుమారుడు అడవిని దాటి దూరప్రదేశాలకు పోడు. అతనికి లోభమనేది లేదు. అన్నిటికంటె ఆశ్చర్యకరమైనది, అతనికి స్త్రీ పురుషభేదం తెలియదు. "

తండ్రి విభాండకుడు అతడినట్లా పెంచాడు

ఇప్పుడు ఋష్యశృంగుని కథలో కీలకమైన  పూర్వరంగాన్ని పరిశీలిద్దాము.

అంగదేశాన్ని రోమపాదుడనే రాజు పరిపాలిస్తున్నాడుదశరథుడు తన కుమార్తె శాంతను ఆయనకు దత్తత ఇచ్చాడుఅంగదేశంలో ఒకసారి భయంకరమైన అనావృష్టి ఏర్పడింది. చెరువులు, వాగులు, వంకలు, నదులు ఎండిపోయి, భూమి బీటలు వారిందిగ్రాసం లేక పశువులు చచ్చిపోయినాయి. ప్రజలందరూ రాజు దగ్గర మొరబెట్టుకున్నారు. రోమపాదుడు ఎంతో బాధపడ్డాడుమంత్రులను, పురోహితులను సంప్రదిస్తే, వారు, స్త్రీ పురుషభేదం తెలియకుండా, తండ్రి కనుసన్నల్లో పెరుగుతున్న ఋష్యశృంగుడిని అంగదేశానికి ఏదో విధంగా తీసుకురాగలిగితే, దేశం మళ్ళీ సస్యశ్యామలమౌతుందని మంత్రులు సలహా ఇచ్చారుకానీ, అతడిని అంగదేశానికి తీసుకురావడానికి ఎవరూ సాహసించలేదు.

ఇంతవరకు చెప్పిన కథంతా శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండములో ఉంది.





No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like