లా రుచిరాతపత్ర పరిలంబినియై రథనేమి నిస్వన
స్ఫోరకహేతువై యుఱుముచున్ వెనుకన్ దెసలన్ బ్రపాత ధా
రా రమణీయవాఃకణధురా పరితర్పితదేశమై చనెన్.
అదివర కేమియుం దెలియఁడాముని చూచుచుఁ జూచుచుండియే
మరినెఱిఁగెన్ సమస్తమును మానినులుం బురుషుల్ పురావళుల్
సదనములున్ బొలంబులును సాగులు పంటలు కర్షకుల్ నవాం
బుదములు ధర్మముల్, సహజబోధలు నిశ్చలతత్త్వమానసుల్.
" వేశ్యలతో పాటు ఋష్యశృంగుడు రథంలో అంగదేశానికి వస్తున్నాడు. రథం వెళ్తున్నంత మేర త్రోవలో, ఆకాశంలో నల్లని మేఘాలు గొడుగు పట్టాయి. మేఘాలు ఉరుముతున్నాయి. అవి రథనేమి ధ్వనిని స్ఫురణకు తెస్తున్నాయి. రథానికి వెనుక వైపు, ప్రక్కల, అన్ని దిక్కులా, అనావృష్టితో శోషిల్లిన అంగదేశాన్ని పులకింపజేస్తూ, వానజల్లులు పడుతున్నాయి.
అదివరకు ఋష్యశృంగుడికి ఏమీ తెలియదు. ఎప్పుడూ అడవి దాటి బయటికి వచ్చినవాడు కాదు. స్త్రీ పురుష భేదం కూడా తెలియదు. అటువంటివాడు, రథంలో వస్తూ , పరిసరాలను చూస్తూ చూస్తుండగానే - స్త్రీలు, పురుషులు, నగరాలు, ఇళ్ళు, పొలాలు, సాగుచేయటం, పంటలు, రైతులు, తొలకరి మేఘాలు, ప్రకృతి ధర్మాలు - అన్నీ అతనికి తెలియసాగాయి. నిశ్చలతత్త్వమానసులకు సమస్తమూ వాటంతట అవే అర్థమవుతాయి కదా ! "
" సహజబోద్ధలు నిశ్చలతత్త్వ మానసుల్ " అన్నది నన్నయ వలె, విశ్వనాథ సూక్తినిధిత్వానికి చక్కని ఉదాహరణ.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, ఇష్టి ఖండము లోనివి.
No comments:
Post a Comment