Tuesday 16 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 534 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: నూపుర ఖండము)





ప్రసన్న వార్థి యిట్లనియె రాక్షసరాజ ! మఱేమి నిన్ను నే
నన్నదిలేదు మున్నెఱిఁగి యాడుట యెట్టులు? నీదు క్ష్వేడముల్ 
విన్న చెవుల్ బడల్వడఁగ వెక్కసపాటయి కూడ, నింతలోఁ
తున్నది నేను నీ పటిమయు న్నిజ మింత యెఱుంగలేమికా !

ధాతయు నిన్నువంటి సముదారభుజాపరిపాకదీపనో
పేతమహోనిధానమును బృధ్వితలంబున సృష్టిచేసి
ట్టా ! తగువాని శౌర్యప్రకటత్వము కోసము సృష్టిచేయునే
కా తగునెవ్వఁడో వెదకఁగావలె నెచ్చట నుండియుండునో.

అదికాదు నే నదెప్పుడు
విదితంబుగఁ జెప్పికొనఁగ వినుటయె కానీ
కదలి చనలేద యిట,
నాది కా దాతనిఁ దుషారనగపరమేశున్.

అతఁడు బలశాలి యందుర యౌషధీ
మూహముల చేతనేకాక మొదలులేని
మంచుచేఁగూడ బిగిసిన మల్లుఁడందు
రట్టి బిగువు గలానిపై నరుగవలయు.

" అల్పు  డెపుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను " అన్నాడు సుమతీ శతకకారుడునిజమే ! మూర్ఖత్వం ముదిరిపోయిన దున్నపోతు రాక్షసుడు దుందుభికి అది తెలియటంలేదు కానీ, సముద్రుడికి తెలుసుసముద్రుడి మీద కాలు దువ్వి యుద్ధానికి రమ్మని, అంతగా కావాలంటే అల్లుడు విష్ణువును సాయం తెచ్చుకోమని పళ్ళు బయటపెట్టి కహ కహ నవ్విన దుందుభికి, పిచ్చి బాగా ముదిరిపోయిందని సముద్రుడు అర్థం చేసుకొన్నాడుఅయినా భయపడుతున్నట్లు నటిస్తూ  (పాపం, ఏడిపిస్తున్నాడని తెలియదు దుందుభికి), ప్రశాంతవదనంతో, సముద్రుడు ఇలా అన్నాడు.

" రాక్షసరాజా ! నే నెప్పుడూ నిన్నొక మాట అన్నదిలేదు. నీ సంగతి తెలిసి కూడా నేనట్లా మాట్లాడతానని ఎలా అనుకున్నావుఇంత లోతున్న నేను నీ బలం లోతు తెలియని వాడినా
బలపరాక్రమాలున్న నీ అంతటివాడిని సృష్టించిన బ్రహ్మ నీకు సమ ఉజ్జీని  ఎక్కడో అక్కడ సృష్టించే ఉంటాడుకాకపొతే, ఓపికగా వెతకాలిఅంతేఅది సరే, వాళ్ళూవీళ్ళూ చెప్పుకొంటూ ఉంటేవినటమే కానీ, నేనిక్కడనుంచి ఎప్పుడన్నా కదిలానా, చూసానాఎవరో, హిమవత్పర్వతమటమహాబలశాలటఅతడి దగ్గర ఔషధాలుండటం వల్లనే కాదు, శరీరం మొత్తం మంచుతో బిగదీసుకొని ఉండటం వల్ల కూడా, అతనికంత బల మొచ్చిందంటారుఇదిగో ! వెళ్తే, అటువంటి వాడి మీదికి వెళ్ళాలయ్యావెళ్ళాల్సిన దారి తెలుసు కదా ! "

అంతా నిజమే ననుకున్నాడు దున్నపోతు.

" సరిగా ఉత్తరం వైపే కదా ! " అని పరుగుదీయటం మొదలుపెట్టాడు.

అల్పులైన వారి సంగతి ఇట్లా ఉంటుంది. సముద్రుడికీ, వీడికీ పోలి కెక్కడ ? "  అయినా, చేతకానివాడివి ఎందుకంతంత ఎత్తున  ఎగిరిపడతావు అనగానే, కెరటాలను ఒడ్డున విరుచుకున్నాడట సముద్రుడుగంభీరంగా ఊండేవాళ్ళ సహజ గుణమది.

ఒకింత హాస్యాన్ని మేళవిస్తూ చెప్పిన సన్నివేశం, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, నూపుర ఖండంలో ఉంది.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like