Tuesday 16 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 535 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)












 కొని యాహా! యిది నీడపట్టుకొని లాగున్ నన్ను భీచేష్టగా
నినుపారన్ మముఁబంచునాఁ డపుడు దీనింగూర్చి కాఁబోలుఁ జే
ప్పెను సుగ్రీవుఁడు సిం హికాఖ్య యిది దర్వింగూర్చి వేల్వంగనై
తననీడే తనుఁబట్టి మ్రింగుననఁ జేతఃక్లిష్టతం గూర్చెడున్

మఱియున్ మారుతి క్లుప్తదేహుఁడయి సమ్యగ్వజ్రగాఢాంగ బం
ధురుడై రాక్షసిమోమునం దుఱికెఁ జండుం డా మహాలంఘనో
ద్ధురతన్ రాక్షసిలోని యంగిలి భిదాధూపాయితంబై పొరిం
బొరి నిప్పుందిన నార్చుకొంచుఁ దిననౌపోల్కిన్ దలంపూనఁగన్.

  తొడిఁదనయంతఁదానుగనె దూఁకెనొ రక్కసి లాగెనొక్కొ యి
ర్వడి కనుచుండి నేర్వరు సుపర్వులు గాఢవిషణ్ణభావు లే
ర్పడఁ గపిరాజు లోనఁ జని రక్కసి గుండియ వ్రక్కలించి వె
 ల్వడె నిముసంబులో దితిజ బాహిరవోయిన ప్రాణమైచనన్.

గుండె యాఁగి చత్తురుఁగాని గుండెలోనఁ
జట్టుపొడియయి చచ్చిన చావులేదు
దానిచచ్చినచావు సంద్రంబునందు
బాములకుఁ దెప్పయైన శవంబుచెప్పు.

సింహిక పెద్ద రాక్షసి. అది సముద్రగర్భంలో ఉంటుంది. అది ఆహారాన్ని వేటాడాలన్నప్పుడు, ప్రాణి నీడను పట్టి లాగితే, ప్రాణి వచ్చి దాని నోట్లో పడుతుంది. వియత్పథంలో వెళ్తున్న హనుమ నీడను చూసి అది గుంజటం మొదలుపెట్టిందిఅప్పుడు, హనుమ ఇలా అనుకొన్నాడు.

" ఆహా ! ఒక రక్కసి నీడ పట్టుకొని లాగుతుందని సుగ్రీవుడు నన్ను పంపేటప్పుడు చెప్పింది దీనిని గురించే అనుకుంటాఇది సింహిక అనే పేరు కలదినీడను పట్టి సముద్రంలోకి లాగి ప్రాణిని మ్రిగుతుందంటే, దీనిని తప్పించుకోవటం కష్టమైన పని. " 

ఇలా అనుకొంటూ హనుమ, రక్కసి నోటిని ఎంత పెంచితే తన శరీరాన్ని అంత పెంచుతూ వచ్చాడుఅది చూసిన రాక్షసి తన నోటిని పాతాళమంత పెద్దదిగా చేసింది.

" ఇదే అదననుకొన్న మారుతి తన దేహాన్ని కుంచించుకొని, వజ్రసమానమైన దేహంతో, రక్కసి నోటిలోకి ఉరికాడుదూకటంలోని వేగానికి, రాక్షసి లోపలి అంగిలి నిప్పుకణికె మ్రింగినట్లయి, దానిని ఆర్చుకొంటూ తినాలన్నట్లుగా ఆలోచన చేయబూనింది.

హనుమ తనంతట తానే రాక్షసి నోట్లో దూకాడా, లేకపోతేరాక్షసి హనుమను లాగిందా అని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు తీవ్రమైన విషాదానికి, విస్మయాని లోనయిన మరుక్షణంలోనే, హనుమ లోపలికి వెళ్ళి, రాక్షసి ప్రాణాలు కడబట్టేటట్లుగా , దాని గుండెను ముక్కలు ముక్కలుగా చేసి, ఒక్క ఉదుటున బయటికి వచ్చాడు

లోకంలో ఎవరైనా గుండె ఆగి చస్తారు కానీ, గుండె పొడిపొడి అయి చచ్చిన దాఖలా లేదుసింహిక చచ్చిన చావు ఎట్లా ఉందంటే, దాని శవం, సముద్రంలోని పాములకు తెప్పగా మారింది. " 

ఇదివరకు నాగమాతను మెప్పించిన మహాద్భుత చర్య అయినా, సింహిక ను చంపిన తీరయినా, హనుమ యొక్క సూక్ష్మబుద్ధిని తెలియజేస్తున్నాయి


విశ్వనాథ, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండం లోని యీ సన్నివేశాన్ని  అద్భుతంగా చిత్రించారు.




No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like