Sunday 14 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 531 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: ఇష్టి ఖండము)










లడ్లు జిలేబు లిచ్చిన బళా యని లడ్డులు వన్యబర్హివౌ
గ్రుడ్లని చూచుచున్ దొడిమఁ ద్రుంచుట తోఁచదు మూతిలేని వీ
బుడ్లనుచున్, జిలేబులను బూని విచిత్రపు టిప్పపూవులా
యొడ్లకు మీదు నాశ్రమ ఫలోన్నతి కల్గునె యంచు మెచ్చుచున్.

వహ్వా యంచు జిలేబి లడ్డులను నాస్వాదించి యానందమై
జిహ్వాతర్పణమై పురే యనుచు మీ చిత్రాశ్రమస్థానిలో 
బహ్వానందము లింక నెన్నికలవో వత్తున్ నిజం బేను
న్నాహ్వానించుట కేదియైనఁ గలదాఁ యభ్యంతరంబన్నచో.

శ్రీమద్రామాయణ కల్పవృక్షములో విశ్వనాథ ఋష్యశృంగుని పాత్రను మలిచిన తీరు నాన్యతో దర్శనీయం

ఋష్యశృంగుడిని నృత్యగాన విశేషాలతో ఆకట్టుకొని, వారుండే కుటీరాలకు తీసుకువెళ్ళారు వారకాంతలురాజుగారి కూతురికి కాబోయే పెనిమిటి అనే భావంతో చాలా ఆరాధనా భావంతో మెలిగారు. ఋష్యశృంగుడు తనను వారి ఆశ్రమాలకు తీసుకు వెళ్ళమని, అక్కడ తమ ప్రాంతాల్లో దొరికేటటువంటి పండ్లు దొరుకుతాయా అని అడిగాడుదానికి సమాధానంగా, వారకాంతలు లడ్లు, జిలేబులు మొదలైన తీపివంటకాలను అతడి ముందు పెట్టారువాటిని చూసి అబ్బురపడిన ఋష్యశృంగుని అమాయక హృదయ వర్ణనమే యీ పద్యాల భావం.

" లడ్లు, జిలేబులు ఇవ్వగానే, వాటిని అటూఇటూ త్రిప్పి చూచి, అవి అడవి నెమళ్ళ గ్రుడ్లనుకొన్నాడుపండ్ల వలె వాటికి తొడిమ త్రుంచనక్కర లేదనుకొన్నాడు లడ్లు మూతి లేని బుడ్లంటూ ఆశ్చర్యపోయాడుజిలేబులను చేతితో పట్టుకొని, అవి విచిత్రంగా ఉన్న ఇప్పపువ్వు లన్నాడుతన వంటివారికి, వారి ఆశ్రమాలలో ఉన్న చక్కని పండ్లు దొరుకుతాయా అని వారిని మెచ్చుకున్నాడు.

ఆహా ! ఎంత రుచిగా ఉన్నాయంటూ లడ్లు, జిలేబులను తిని, జిహ్వకు ఆనందం కలిగి, వారి చిత్రమైన ఆశ్రమాలలో ఆనందం కలిగించే వస్తువు లింకెన్ని ఉన్నాయోనన్నాడు. తాను తప్పకుండా వారి ఆశ్రమానికి వస్తానన్నాడుతనను ఆహ్వానించటానికి వారికేమైనా అభ్యతరం ఉందా ? అని అడిగాడు. "

బాల కాండము, ఇష్టి ఖండము లోని పై పద్యాలు ఋష్యశృంగుని నిర్మలమైన హృదయాన్ని, అమాయకపు మునివాసాన్ని తెలియజేస్తాయి.





No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like