Tuesday 2 June 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 483 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)















లెక్కం జనఁగా మరుత్సుతుఁడు తానైలంకలోఁ జొచ్చుచోఁ
వేళాదుష్టముగాఁ గనంబడి మదిన్ వేల్పుల్ ముహూర్తంబు తా
మాలస్యంబు ఘటింపనెంచి సురసాఖ్యన్ నాగమాతన్ ద్యుతి
వ్యాలోలాగ్ర సహస్రభానుసమ సంప్రార్థించి రాబద్ధులై.

      నిన్నుపాయంబుగాఁ దప్పికొన్నసరియె 
కాద యేనియు రామ కార్యోదయంబు
నుండి తొలఁగినసరియె వాయుసుతుపటిమ
మే మెఱుంగను గోరుచున్నాము తల్లి.


హనుమంతుడు ఆకాశమార్గంలో సముద్రాన్ని దాటి  దక్షిణ దిక్కుగా  లంక వైపు ప్రయాణం చేస్తున్నాడు. దేవతలు, ఋషులు భావనాసమాధి స్థితిలో హనుమకు కార్యసాఫల్యం కలగాలని ధ్యానం చేస్తున్నారు. హనుమ పయనించే వేగం చూస్తే, అతడు లంకలో దుర్ముహూర్తంలో ప్రవేశించేటట్లున్నాడు. సమయాన్ని లెక్కగట్టిన దేవతలు, హనుమ లంకకు ఆలస్యంగా చేరేటట్లు ప్రణాళిక రచించారువారు, వేయిసూర్యులకాంతితో ప్రకాశించే  సురస అనే నాగమాతను ఇలా  ప్రార్థించారు.

     " అమ్మా ! హనుమ అని వాయుదేవుని కుమారుడున్నాడుఆయన సముద్రాన్ని దాటి లంకకు వెళ్తున్నాడు. కొంచెంసేపు నీవు భయంకరాకారం ధరించి, ఆయన శత్రువులాగా వ్యవహరించి, ఆయనను ఆపు, అడ్డగించువాడి కోరలు, పదునైన దంతములతో కూడిన నీ ఘోరమైన ముఖద్వారం నుండి ఆయన తెలివిగా ఎట్లా తప్పించుకూంటాడో చూడాలని ఉంది. త్వరగా వెళ్ళమ్మా ! ఉపాయంగా నీ నుండి తప్పించుకున్నాడా సరిలేకపోతే రామకార్యం నుండి వైదొలగినా సరేఅసలు వాయుసుతుని శక్తిసామర్థ్యా లేమిటో తెలుసుకోవాలనుందమ్మా ! "

లోకంలో, నలభై రోజులపాటు హనుమంతుని గుడిలో ప్రదక్షిణం చేయటం, సుందర కాండము పారాయణం చేయటం అందరికీ తెలిసిన విషయమేఇది మంచిదే. దానితో పాటు, సుందర కాండములో హనుమ ప్రదర్శించిన బుద్ధివిశేషాలను, సునిశిత వివేచనా శక్తిని, సూక్ష్మగ్రాహ్యతను అలవరచుకొనడమే పైన చెప్పిన కార్యక్రమాల పరమార్థంహనుమంతుని సునిశిత బుద్ధి విశేషం బహిర్గతమైన సన్నివేశాల్లో సురసను  ఉపాయంగా తప్పించుకొని పోవటం ఒకటి.

పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండములో ఉన్నాయి.





No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like