Saturday 29 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము- 736 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము)




తొలుతను రాక్షసేశ్వరుడు దొంగిలితెచ్చిన మానవాంగనా
వలి యతిలోక సుందరులు వారల మధ్య నయోనిజాత యు
జ్జ్వలతప ఊర్జితచ్ఛవి దృశావివృతత్వము లేనివేళ  నే
వలనునఁ జూడగాఁదగును వల్లభమౌ నతిలోకతేజమున్.

అని తలపోసి పుష్పకమునం దొకచోటను నిల్చియుండి యి
ట్లని మంది నెంచె భూమిసుత యాకృతి యంజనసూనుఁ డామె
పచ్చని పసినిమ్మపండు మెయిచాయగ  నుండును బొట్టికాదు కా
దని పొడుగైనగా దుచితమైన ప్రమాణము బొమ్మ యుండెడిన్.

ఆమె పదంబులం గనినయంతన పాదములందు వ్రాల్తలం
పామెయి గల్గునం చెడద నంకురితం బయి నిద్రపోవు కాం
తామణిలోక మంజుల పదంబులు చూచుచు బోవ నెంచి యా
ధీ, మహనీయులై చను పతివ్రతలన్ సమమంచు మానుచున్.

హనుమంతుడు పుష్పకవిమానంలో నిద్రిస్తున్న స్త్రీలలో సీతాదేవి ఉండవచ్చునేమో అనే ఆలోచనతో, ప్రదేశమంతా నిశితంగా పరిశీలిస్తున్నాడుఆయన విధంగా అనుకొంటున్నాడు.

" ఇంతకుముందు రావణుడు  దొOగతనంగా ఎత్తుకువచ్చిన మానవస్త్రీలు అతిలోక సౌందర్యవతులువారందరి మధ్యలో నున్నటువంటి భూసుత సీతను గుర్తుపట్టాలంటే గొప్ప తపస్సు చేత పొందినటువటి అంతర్దృష్టి కాంతిప్రసారం లేకపోతే, చాలా గొప్పదైనటువంటి ఆమె అతిలోకతేజాన్ని చూడటం విధంగా సాధ్యపడుతుంది

విధంగా ఆలోచించిన హనుమ పుష్పకవిమానంలో ఒకచోట నిల్చొని, భూమిసుత ఆకారము, పచ్చని బంగారం రంగు నిమ్మపండు వంటి దేహచ్ఛాయతోను, పొట్టి, అలాగని పొడుగు కానటువంటి ఉచితమైనటువంటి దేహప్రమాణంతోను ఉండవచ్చని తలపోశాడు.  

సీతాదేవి పాదాలను చూడగానే, ఆమె పాదాల మీద వ్రాలాలనే కోరిక హృదయంలో మొలకెత్తుతుందని అనుకొన్నాడుఅందుచేత, నిద్రపోతున్న స్త్రీల కోమలమైన పాదాలను పరీక్షగా చూస్తూ వెళ్ళాలనుకొన్నాడుకానీ, పతివ్రతలైన అందరు స్త్రీల యొక్క పాదాలు విధంగా మంజులంగా, మనోజ్ఞంగానే ఉంటాయనే భావనతో ఆలోచనను మానుకొన్నాడు. "

సీతాదేవిశ్రీమహాలక్ష్మి యొక్క అవతారంఋగ్వేదాంతర్గతమైన  శ్రీసూక్తంలో అమ్మవారు " హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం | చంద్రాం హిరణ్మయీo లక్ష్మీం  | " అని వర్ణించబడ్డది. వేదవేదాంగాలను, గురూత్తముడైన, వెల్గులనిధియైన, జగదక్షియైన, సూర్యభగవానుని దగ్గర అభ్యసించిన హనుమకు అమ్మవారి యొక్క స్వరూపం అవగతమే.

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోని పై పద్యాలలో ఆంజనేయుని నిశిత పరిశీలనాశక్తి, విషయ పరిజ్ఞానము, ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.







No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like