Friday 7 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 704 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధ కాండము: సంశయ ఖండము)





విల్లునఁ జెప్పరానిదియు వెక్కసమై చను నేరుపుండగాఁ
జెల్లున, యగ్ని వాయు సరసీరుహసూతి ముఖాస్త్ర విద్యయుం
జెల్లున, తక్షకాది పరిషించిత వాంతవిషానలాస్త్ర వి
ద్యోల్లసనంబు తా నెటుల నుండెనొ యీతని వద్దఁ జిత్రమై.

ఎన్నో యేండ్లు భుజంగలోకమున భోగీంద్రాళి బంధుత్వమై
కన్నాఁడీ పటుశక్తి యింద్రజి తిరస్కారంబుగా శత్రురా
జిన్నిల్పోపననన్య సాధ్యముగ నీ శ్రీరాముఁ డే రీతిగాఁ 
బన్నాగంబులు పన్నెనిట్లుఁ విదలింప న్నాగబంధంబులన్.

ఎన్నెన్నింటికి నెంతయెంత యగునో యీ రాఘవుం డక్కటా 
మిన్నాగుం గొనితెచ్చికొంటిని సమున్మీలత్ఫణా సాధువున్ 
మిన్నేర్గేదఁగిరేకుగాఁ బొదువు సామిం గొల్చి యీ రీతిగా
నున్నాఁడన్ మఱి యేమికావలయు నోహో యల్ప తేజస్కులై.

శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు రామలక్ష్మణులను నాగపాశాల నుండి విముక్తులను చేశాడుసూర్యోదయానికల్లా రామలక్ష్మణులు స్పృహ లోనికి వచ్చారు. రాముడు లేచి నిల్చొని అల్లెత్రాటిని మ్రోగించాడు. మహాధ్వనిని విన్న రావణుడు అదిరిపడ్డాడుదానితో, రాముని గురించి రావణునిలో సంశయం మొదలయిందిఅతడు తనలో తా నిట్లా అనుకొన్నాడు.

విలువిద్యలో చెప్పలేనంత నేర్పు ఉన్నంత మాత్రానఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, బ్రహ్మాస్త్రము మొదలైన అస్త్ర విద్య లున్నంత మాత్రాన, తక్షకుడు మొదలైన మహాసర్పముల విషాగ్నిని తట్టుకోగలిగిన, ఒళ్ళు గగుర్పొడిచేటంతటి విద్యా నైపుణ్యం రాముడి వద్ద చిత్రంగా యెట్లా ఉన్నదో !

ఇంద్రజిత్తు ఎన్నో ఏళ్ళు పాతాళలోకంలో మహాసర్పాలతో బంధుత్వాన్ని నెరిపి, అమోఘమైన శక్తిని సంపాదించాడు. దానిని తలకిందులు చేస్తూ, శత్రువులు తేరిచూడటానికి కూడా సాధ్య మవని అనన్య సామాన్యమైన రీతిలో, శ్రీరాముడు నాగబంధాలను విడిపించుకో గలిగినంతటి పథకాలను ఎలా పన్నగలిగాడు

వీటన్నింటినీ సాధించాడంటే రాముడు ఎంతటి వాడో? నేను మిన్నాగుని తెచ్చి ప్రక్కన పెట్టుకొన్నాను. ఆకాశగంగను మొగలిరేకుగా ధరించిన స్వామిని కొలిచిన నేను యీ విధంగా మిగిలిపోయానుమరి అల్పమైన పరాక్రమం కలిగి ఉంటే, ఏమవుతుందో, ఏమిటో? "

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోని యీ పద్యాలలో రావణుని మనసుని తొలుస్తున్న అనుమానాన్ని తెలియజేస్తున్నది. రావణుని మనస్సుని రాముడు, యుగాల నుండి తనతో శత్రుత్వమున్న శ్రీ మహావిష్ణువా లేక సామాన్య మానవుడా అన్న సంశయం కలచివేస్తున్నదిశ్రీ మహావిష్ణు వన్న అనుమానం కలిగిన ప్రతిసారి, ఏదో ఒక సంఘటన ఆధారంతో, దానిని నిద్ర పుచ్చుతూ వస్తున్నాడు. కానీ, రాముడు అవతారపురుషు డన్న అనుమానం బలపడుతుండటంతో, రావణుడు సంశయ నిస్సంశయాల మధ్య నలిగిపోయాడు. విధమైన రావణుని మానసిక సంఘర్షణ శ్రీమద్రామాయణ కల్పవృక్షాంతర్గత రావణుని పాత్రను శిల్ప దృష్ట్యా మహోన్నత స్థాయికి తీసుకువెళ్ళింది.









No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like