Thursday 6 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 690 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: కిష్కింధా కాండము: గజపుష్పి ఖండము)



అనినన్ శ్రీరఘురామమూర్తి దరహాసాంకూరమాస్యాంత సం
జనిత జ్యోత్స్నయుగా శశాంక వదనచ్ఛాయాసనాథంబుగా 
ననియెన్ నమ్మకమన్న యట్టి దినుసాహా ! స్వచ్ఛమై కూడ నే
చిన వక్రంబగు సన్నివేశమున వంచింపంబడున్ స్వచ్ఛతన్

సుగ్రీవుడిని సులువుగా గుర్తుపట్టేటందుకు వీలుగా, శ్రీరాముడు లక్ష్మణుడి చేత అడవిలో పూచిన గజపుష్పముల మాల కట్టించి, అతడి మెడలో వేయించాడుసుగ్రీవుడు, కిష్కింధా నగర ద్వారం వద్దకు వచ్చాడువాలి బలపరాక్రమాలను గురించి మరొక్కసారి చెప్పి, ఎవరైనా తాము నేర్చిన కళలను నమ్ముకోకుండా, ఇతరుల కళలను నమ్ముకొని, కయ్యానికి కాలు దువ్వితే, అది మూర్ఖత్వమౌతుందని, అటువంటి మూర్ఖశిరోమణినైన తనను వాలి నుండి రక్షించమని వేడుకొన్నాడు సారి కూడా సుగ్రీవుణ్ణి గుర్తుపట్టకుండా ఉంటే, చేజేతులా సుగ్రీవుడికి నీళ్ళు వదులుకొనమని చెప్పాడువాలి బలవంతంగా తన మెడలోని పుష్పమాలను త్రెంచివేసినా త్రెంచివేస్తాడని, అందుచేత, శీఘ్రంగా పనిని ముగించమని రాముడికి చెప్పాడుఅంతేకాదు, తనకు చేతిలో చేయి వేసి చెప్పమన్నాడుసుగ్రీవుని భయాందోళనలకు శ్రీరాముని సమాధానమే యీ పద్యం.

" సుగ్రీవుడు విధంగా అనగానే, రఘురామమూర్తి, చిరునవ్వు మొలకలు ముఖమంతా వెన్నెలలాగా అలుముకొనగాచంద్రబిబం వంటి ముఖారవిందంతో, విధంగా ప్రత్యుత్తర మిచ్చాడు.

ఆహా ! నమ్మకమన్న దినుసు ఎంతో నిర్మలమై ఉండి కూడా, బాధల వలన, అసలు విషయంలో వక్రీకరింపబడి నిర్మలత్వం అనే దాని నుండి వంచింపబడుతున్నది  కదా ! "

సుగ్రీవుడు వాలి చేతిలో పలుమార్లు దెబ్బలు తిని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఋష్యమూక పర్వత ప్రాంతంలో కాలం వెళ్ళబుచ్చుతున్నాడుశ్రీరాముని వంటి మహాధానుష్కుని, ధర్మాత్ముని అండతో, ఒకసారి వాలితో తలపడి, వాలిసుగ్రీవుల పోలికలు ఒక్కటిగా ఉండటం వల్ల, భంగపడ్డాడుగుర్తుపట్టడానికు వీలుగా గజపుష్పమాలాంకృతుని చేసినా కూడా, వాలిబలపరాక్రమాలను తలచుకొని, సుగ్రీవునికి బెదురుపాటు వచ్చి, నమ్మకం సడలింది. జీవితంలో కష్టాలు పడినవానికి, నమ్మకం అంత తొందరగా కుదరదు. నమ్మకం అన్నది స్వచ్ఛమైనదైనా కూడాసన్నివేశాన్ని బట్టి, దానిని చూసేవాడి దృష్టి మారుతుందిఅదే రాముడు చెప్పింది.

పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనిది.



No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like