Wednesday 12 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 722 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: అరణ్య కాండము: దశవర్ష ఖండము)




శ్రీయుతు వింధ్యాచల శి
క్షాయుతు దర్శనము చేయఁగా నేగెదరా 
యాయన మీరెప్పుడు వి
చ్చేయుదురని యెదురుచూచు శ్రీయుతులారా

పూట పడిన మీరలు 
నా పూటనె వత్తురంచు ననుకొనుచుంటిన్
మీ పయనపుబడలిక పో
నోపిక స్నానములు చేయుఁడున్నవి జలముల్.

నేను బ్రహ్మచారి నెట్టులా ! తల్లి  
చ్చెడు నటంచు నేను సేగిపొందఁ
బొరుగుగాలవుఁ మునిభార్య నాకంటె
తొందరించి తాను తోడువచ్చె.

పద్య మెప్పుడైనా మనతో మాట్లాడుతుందా? పద్యం మనతో మాట్లాడిన అనుభూతి పద్యం చదువుతున్నప్పుడు కలుగుతుందా? విశ్వనాథ శ్రీమద్రామాయణ కల్పవృక్షములో, పలు తావుల్లో పాఠకునికి యీ అనుభూతి కలుగుతుంది.

కోవకు చెందినవే శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోని అందమైన యీ రెండు కాంద పద్యాలు, ఒక ఆటవెలది.

రామాయణంలో మనం అగస్త్యభ్రాత అనే పేరు వింటుంటాము. ఆయన అగస్త్యునికి సోదరుడని తెలుసు గానీ ఆయన పేరు తెలియదు.

రామలక్ష్మణులు, సీతతో కలిసి, దక్షిణ దిక్కుగా పోసాగారు. దారిలో శరభంగుడు, సుతీక్ష్ణుడు వంటి ఎందరో మునులను దర్శనం చేసుకొన్నారుఅగస్య్త మహర్షి దర్శనార్థం పోతూ, దారిలో అగస్త్యభ్రాత ఆశ్రమానికి వచ్చారు. మునీశ్వరుడు రామలక్ష్మణులతో మాట్లాడిన సారాంశమే పద్యాల లోని భావంఅగస్త్యభ్రాత రామలక్ష్మణులతో విధంగా అంటున్నాడు.

" వింధ్యపర్వత గర్వాపహారి, మహానుభావుడైన, అగస్త్యుడు మహర్షి దర్శనం కోసం వెళ్తున్నారా? చిరంజీవులారా ! ఆయన మీ రెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాడు నాయనా

పూట కా పూట మీరొస్తారని అనుకొంటున్నాను. అవిగో కావలసినన్ని నీళ్ళున్నాయిమార్గాయాసం తీరేటట్లుగా, ఓపికగా, స్నానం చేయండి.

నేను చూస్తేనా బ్రహ్మచారిని. సీతమ్మ తల్లి వస్తుంది ఎట్లాగా అని బాధపడుతుంటే, పొరుగున ఉన్న గాలవుడనే మునీశ్వరుని భార్య, నా కంటె కూడా ఎక్కువగా ఆందోళన పడి, అన్నీ సిద్ధం చేసింది. "

స్నానాదులయిన తరువాత, అగస్త్యుడు సోదరుడు, వారికి భోజనాదికాలు ఏర్పాటు చేయించాడు.

పైన పేర్కొన్న పద్యాల వంటివి కల్పవృక్షములో కొల్లలుగా కనిపిస్తాయి. అవి హృదయం లోనికి నేరుగా చొచ్చుకొని పోయి, మనమే సంభాషణను నెరుపుతున్న అనుభూతిని పొందుతాము. అది విశ్వనాథ పద్యరచనాశిల్పం లోని ఒక విశిష్టత.














No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like