Wednesday 5 August 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 687 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: బాల కాండము: అవతార ఖండము)





నుదుటఁ గస్తురి బొట్టు చదురుగాఁ దీరిచి ముసలిది వలదన్న మొగము తుడుచు 
శ్రీరంగనాథుని సేవింప మడిఁగట్టి మంథర వలదన్న మానివేయుఁ
గౌసల్యఁగనఁబోవఁగా బండిఁ బిలిపించి వగ్గు కాదన్నచోఁ బంపివేయుఁ
గోర్కి సింగారించుకొని పతిఁ  గలయఁగా దాది కిష్టములేదొ తగ్గిపోవు

తల్లి నెఱుఁగని దోషమ్ము తగిలి కైక 
కన్నతల్లి జూడని మమకార నెల్ల 
దన్నుఁ జేతులఁ బెంచిన దాదిమీఁద

నొలుకపోయును గుండెలో నులికిపడుచు.

మడికట్ట వలదన్న మంథర మన్నించి నాతి లోలో రంగనాథుఁ గొలుచు
దాది యొత్తిడి మహాధనచేలములు గట్టి కాంత కాషాయముల్ కాంక్ష సేయు 
ముసలి రత్నాసనమ్మును వీడనీయమిఁ బాదుకల్ తొడిపోవఁ బడఁతి యెంచు
నడి వగ్గు నదుపులు సగ మిష్టమై కాక యతివ నే నిందుండ ననుచుఁ బలుకు

నెపుడొ మంథర మాటకు నెదురు తిరుగు
నొక్కొకప్పుడు మంథర కొదిగియుండు
నెంత గొడ్డమ్ములైన నా యింతి యెడఁద 
బ్రభువు శ్రీరంగనాథుండు పాయకుండు

రెండు సీస పద్యాలు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, అవతార ఖండము లోనివి.

మంథర కైకేయి అరణపు దాది. కైకేయి పాత్రలో రెండు పార్శ్వాలున్నాయిబాహ్యంగా, చిన్నతనం నుండి తనను పెంచి పెద్దజేసిన మంథర యొక్క ప్రభావం అందులో ఒకటి కాగా, రెండవది అంతర్గతంగా ఆమె కున్న హృదయసౌశీల్యం. రెండు పద్యాలూ విభిన్నాంశాలను ఆవిష్కృతం చేస్తున్నాయి.

" నుదుటి మీద కస్తూరి తిలకం చక్కగా పెట్టుకొని, ముసలామె వద్దంటే తుడిచేస్తుందిశ్రీరంగనాథుని పూజ కోసమని మడి గట్టుకొని, మంథర వద్దనగానే మానివేస్తుందిఅక్కగారు కౌసల్య దగ్గరకు పోవటానికి  రథాన్ని సిద్ధం చేయించి, పండుముసలి వెళ్ళొద్దనగానే, బండిని తిరిగి పంపివేస్తుందికావాలని అలంకరించుకొని భర్తను కలవటానికి పోతుంటే, దాది కది ఇష్టం లేదనగానే ఊరుకుంటుందితల్లిని చూడని దోషం తగిలి, కన్నతల్లి మీద మమకార మంతా, తనను చేతుల మీద పెంచిన దాది మీద ఒలకబోస్తుందికానీ గుండెలో ఉలికిపడుతుంది. "

కైక మంథర మాటను కాదనలేదు, అలాగని, అంతర్గతంగా తన ఇష్టాన్ని చంపుకోలేదు. అందుకే, కైకకు గుండెలో ఉలికిపాటు.

" మడి కట్టుకోవద్దన్న మంథర మాటను గౌరవిస్తుంది కానీ, మానసికంగా శ్రీరంగనాథుని స్మరణ చేస్తుందిదాది ఒత్తిడి మీద వెల గల చీరలు కట్టుకుంటుంది గానీ, లోపల మాత్రం కాషాయవస్త్రాలు కట్టుకోవాలనుకుంటుంది. ముసలిది రత్న సింహాసనాన్ని దిగనీయదు గానీ, ఈమెకు మాత్రం పాదుకలు తొడుక్కొని పోవాలని ఉంటుంది. వృద్ధురాలు పెట్టే అదుపాజ్ఞలు సగం ఇష్టమై, సగం ఇష్టం లేకుండా ఉన్న కైక, తానక్కడ ఉండనని వెళ్ళిపోతానంటుందిఅప్పుడప్పుడు మంథర మాటకు ఎదురు తిరుగుతుంది, ఒక్కొక్కప్పుడు ఆమె చెప్పినట్లే చేస్తుందికైకేయి ఎంత బిరుసుగా ఉన్నా, ఆమె హృదయంలో మాత్రం శ్రీరంగనాథుడు విడవకుండా ఉన్నాడు. "

రెండవ పద్యం లోని విశేష మేమంటే, కైకేయి యొక్క నిరాడంబరత, కాషాయం మీద, పాదుకల మీద మక్కువ, హృదయగత శ్రీరంగనాథ సేవపరమ భాగవతోత్తముడు భరతుని జననాన్ని సూచిస్తున్నాయి.

పద్యాలు కైకేయి ఆత్మగత సౌందర్యాన్ని, సౌశీల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయిఇవి మున్ముందు కైకేయి పాత్రను సహృదయంతో అర్థం చేసుకోవటానికి బాగా ఉపయుక్తమౌతాయి.










No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like