Thursday 13 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 90 (శ్రీనాథుని కాశీఖండము)

ప్రణవంబు నీవు నిర్మలగుణాలంకార!
          యామ్నాయవిద్య యీ యలరుబోడి
తప మీవు శశికళోత్తంసభక్తినిధాన!
          శాంతి యీ సంపూర్ణచంద్రవదన
ఫల మీవు వాతాపిఖలదర్పభంజన!
          సత్క్రియ యీ గంధసారగంధి
మిహిరుండ వీవు విశ్వహితప్రవర్తక!
          చైతన్యలక్ష్మి యీ చపలనయన

బ్రహ్మతేజంబు నీయందు బ్రజ్వరిల్లు
బ్రజ్వరిల్లు బతివ్రతాపరమతేజ
మీ లతాతన్వియందు మా కిందఱకును 
నుభయతేజంబులును మహాభ్యుదయ మొసంగు.

దేవగురువు బృహస్పతి మునులను వెంటబెట్టుకొని కాశీ క్షేత్రంలో నున్న అగస్త్యుని వద్దకు వచ్చి, మేరుపర్వతము మీద స్పర్థతో, సూర్య గమనాన్ని నిరోధిస్తూఎత్తుకు పెరుగుతున్న వింధ్యపర్వతం గర్వం అణచాలని అభ్యర్థించాడు సందర్భంగా, పుణ్యదంపతులను ప్రస్తుతిస్తూ చేసిన పద్య మిది.

అగస్త్యుడు ప్రణవ స్వరూపుడైతే, లోపాముద్ర వేదవిద్యఆతడు తపస్సైతే, ఆమె శాంతిఅతడు ఫలమైతే, ఆమె ఫలాన్నిచ్చే క్రియఅతడు సూర్యుడైతే, ఆమె అందులో నున్న చైతన్యము ఇద్దరిలో, ఒకరియందు బ్రహ్మజేజము ప్రకాశిస్తుంటే, ఇంకొకరియందు పరమ పతివ్రతా తేజం వెలుగొందుతున్నది విధంగా యీ రెండు కాంతిపుంజములు విశ్వాభ్యుదయానికి తోడ్పడుతున్నాయి.

పద్యాన్ని పరిశీలిస్తే, వేదములు ప్రతిపాదించే ఓంకారము, తపస్సు వలన సాధించే సత్త్వము, క్రియల వలన వచ్చే ఫలము, సూర్యునిలో నున్న వెలుగు, అవిభాజ్యమని తెలుస్తుందిఇదే విషయాన్ని, శ్రీమద్రామాయణ కల్పవృక్షములో విశ్వనాథ సత్యనారాయణగారు, శ్రీరాముడు జలమైతే సీత ప్రవాహమనీ, ఆయన ఆకాశమైతే ఆమె శబ్దమనీ, ఆయన ఇంద్రుడైతే ఆమె హవిస్సు అనీ, ఆయన శ్రుతి అయితే ఆమె స్వరమనీ, ఇద్దరికీ గల అవినాస్థితిని తెలియజేసారు.

ఇక పద్యంలో అగస్త్యుని పరంగా, లోపాముద్ర పరంగా శ్రీనాథుడు వాడిన విశేషణాలు వారిద్దరి మహత్వాన్ని తెలియజేస్తాయి.

సీసపద్యం శ్రీనాథ కవిసార్వభౌముని కాశీఖండము ద్వితీయాశ్వాసములో నున్నది.


No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like