Monday 3 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 56 (ఆంధ్రమహాభారతావతారిక) ఆదిపర్వం: ప్రథమాశ్వాసం)

సాత్యవతేయ విష్ణుపద సంభవమై, విబుధేశ్వరాబ్ధి సం
గత్యుపశోభితంబయి, జగద్విదితంబగు భారతీయ భా
రత్యమరాపగౌఘము నిరంతర సంతత పుణ్య సంపదు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.

నన్నయగారి మహాభారతావకారికలో యిది చాలా ప్రసిద్ధమైన పద్యంఇందులో వాడిన విశేషణాలకు భారతము పరంగాను, గంగానది పరంగాను అర్థం చెప్పుకోవాలి.

ముందుగా, భారతము పరంగా చూద్దాముమహాభారతము సత్యవతీ పుత్రుడైన, నారాయణాంశ కలిగిన, వ్యాసుని వాక్కు నుండి పుట్టినదిపండితులనే సాగరము యొక్క స్నేహమనే కలయిక చేత ప్రకాశిస్తున్నదివిశ్వవిదితమైన ఇటువంటి భారతము యొక్క వాక్స్వరూపం, వినినా, ప్రశంసించినా, ప్రతివారికీ, విశేషమైన పుణ్యసంపదను కలిగిస్తుంది.

ఇక గంగానదీ పరమైన అర్థమువిష్ణుపాదోద్భవ అయినట్టిదీ, దేవతల  రాజైన దేవేంద్రునికి సంబంధించిన సముద్రము యొక్క   సంగమము చేత ప్రకాశించినట్టిదీ అయిన, గంగానదీ ప్రవాహము గురించి, పౌరాణికులు చెప్పగా వినినా, పొగిడినా, అది ఎల్లవారికీ, విశేషమైన పుణ్యాన్ని కలుగజేస్తుంది.


నన్నయగారి " నానారుచిరార్థసూక్తినిధిత్వము " అనే లక్షణానికి యీ పద్యము చక్కని ఉదాహరణము పద్యానికి సంబంధించినంతవరకురుచిరార్థసూక్తినిధిత్వము అంటే, రుచిరమైన అర్థము, మంచి అర్థము, అని చెప్పుకోవాలిఇక రెండవ విషయము, పద్యంలో, మహాభారత పరంగాను, గంగానది పరంగాను అర్థద్వయాన్ని అన్వయించడంలో ఒక ఔచిత్యం ఉన్నదితూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని రాజ్యము, అనగా వేంగీదేశము, తూర్పు సముద్రము చేత చుట్టబడిందిదక్షిణగంగ అని పిలువబడే, గౌతమీనది, తూర్పుసముద్రంలో కలుస్తుందిఅందువల్ల, మహాభారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజరాజనరేంద్రుని యొక్క, దానిని సిద్ధింపజేసిన నన్నయల యొక్క సంగమము - సాగరము గంగానదుల సంగమము వలె - అపూర్వమైన కలయిక    అని చెప్పికొనక తప్పదు.

No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like